logo

బడుగు వర్గాల సంక్షేమమే తెదేపా లక్ష్యం

తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Published : 30 Mar 2023 02:25 IST

చిత్తూరులో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు

ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ) న్యూస్‌టుడే: తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో తెదేపా పతాకాన్ని ఆవిష్కరించారు.చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, మాజీ మేయర్‌ కఠారి హేమలత.. తెదేపా ఆవిర్భావ క్రమాన్ని వివరించారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం తెదేపా చేసిన కృషి ఎనలేనిదన్నారు. బీసీసెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్‌యాదవ్‌, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నాగేశ్వర్‌రాజు, కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్‌, మాజీ ఉప మేయర్‌ సుబ్రి, మాజీ కార్పొరేటర్‌ వసంత్‌కుమార్‌, నాయకులు కృష్ణమూర్తి, ఫైరోజ్‌, ఈశ్వర్‌, జయపాల్‌, కందస్వామి, అత్తు, నవాజ్‌, రాజా, రుద్రప్పనాయుడు, ధరణి, మురళి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని