logo

Palnadu: రాజుపాలెం ఎస్సై భార్య బలవన్మరణం

పల్నాడు జిల్లా రాజుపాలెం ఎస్సై మేర్లపాక నారాయణ భార్య లక్ష్మీగీత (28) శనివారం ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. స్థానికుల వివరాల మేరకు.. ఉదయం దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది.

Updated : 09 Jul 2023 09:32 IST

కుమార్తె మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి

రాజుపాలెం, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా రాజుపాలెం ఎస్సై మేర్లపాక నారాయణ భార్య లక్ష్మీగీత (28) శనివారం ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. స్థానికుల వివరాల మేరకు.. ఉదయం దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో లక్ష్మీగీత మనస్తాపం చెంది వేరే గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. ఎస్సై నారాయణ వెంటనే తలుపులు పగులగొట్టి ఆమెను సిబ్బంది సాయంతో పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నారాయణది చిట్టమూరు మండలం గుణపాడు, లక్ష్మీగీత స్వగ్రామం రేణిగుంట.  వీరికి మూడేళ్ల నేత్ర, ఏడాది వయస్సున్న చైత్ర ఉన్నారు.

బిడ్డ పుట్టినరోజు జరుపుకొనేందుకు..

తమ కుమార్తె చైత్ర మొదటి పుట్టిన రోజు వేడుకలను స్వగ్రామంలో సోమవారం ఘనంగా జరుపుకోవాలని భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. అందుకు సెలవు కావాలని ఎస్సై నారాయణ ఉన్నతాధికారుల అనుమతి కోరారు. వేడుకకు సంబంధించిన దుస్తుల కొనుగోలుకు శనివారం గుంటూరు వెళ్లేందుకు బయల్దేరుతుండగా.. ఏం జరిగిందో తెలియదు.. పాలుతాగే పసిపాపని వదిలి ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు