Tirupati: నే చూసుకుంటా.. నువ్వు అమ్మేయ్!
రెవెన్యూ రికార్డులు, ఆన్లైన్లోనూ అది ప్రభుత్వ భూమే. పైగా న్యాయస్థానంలో కేసు నడుస్తోంది.
ప్రభుత్వ భూమిలో స్థిరాస్తి వ్యాపారం!
వైకాపా నేత అండతో దందా
ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు
ఈనాడు-తిరుపతి; న్యూస్టుడే, మంగళం: రెవెన్యూ రికార్డులు, ఆన్లైన్లోనూ అది ప్రభుత్వ భూమే. పైగా న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ స్థలం జోలికి వెళ్లకూడదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందిన కాడికి దోచుకోవాలని ఆరాటపడుతున్న ఓ వైకాపా నేత అండగా నిలవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. సదరు స్థలంలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. అందులో నిర్మాణాలు చేస్తున్నారు. ఇదీ రేణిగుంట మండలంలో అధికార పార్టీ నేత ఆధ్వర్యంలో నడుస్తున్న కబ్జాపర్వం.
రేణిగుంట మండలం అన్నాసామిపల్లిలోని సర్వే నంబరు 385లో 31.65 ఎకరాల భూమి ఉంది. దీన్ని 2012 ఏప్రిల్లోనే అనాధీనం (ప్రభుత్వ భూమి)గా పేర్కొంటూ మ్యుటేషన్ చేసి ఆన్లైన్లో నమోదు చేశారు. భూ రిజిస్టర్తోపాటు రెంట్ రిజెక్షన్ చట్టం 1947ని అనుసరించి అన్నాసామిపల్లె గ్రామంలోని సర్వే నంబరు 385 పట్టా భూమి కాదని ప్రత్యేక కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ 1997లోనే ఉత్తర్వులు ఇచ్చారు. రెంట్ రిజెక్షన్ చట్టాన్ని గ్రామానికి వర్తించే సమయంలో ఇక్కడ 16.50 ఎకరాల మేరకు మాత్రమే పట్టా భూమి ఉందని స్పష్టం చేశారు. అందువల్ల సర్వే నంబరు 385లోని భూమి రైత్వారీ భూమి కాదని నిర్ధారించారు. దీంతో 1986లో నెల్లూరు సెటిల్మెంట్ అధికారి కొందరి పేరిట జారీ చేసిన రైత్వారీ పట్టాలను సైతం రద్దు చేశారు. ఆపై సీసీఎల్ఏ (అప్పీల్స్) కొందరు వ్యక్తులకు అనుకూలంగా ఆదేశాలివ్వడంతో ప్రభుత్వం దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
అడ్డగోలుగా విక్రయాలు
న్యాయస్థానంలో కేసు నడుస్తుండటంతోపాటు రెవెన్యూ రికార్డుల్లో ప్రస్తుతం ఎక్కడా ప్రైవేటు వ్యక్తుల పేర్లు పొందుపర్చలేదు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం మొదలుపెట్టారు. సుమారు 24 అంకణాలు (96 గజాలు) రూ.7 లక్షలకు విక్రయిస్తున్నారు. కొనుగోలు చేస్తున్న వ్యక్తులకు రూ.100 స్టాంపు పేపరుపై రాసి ఇస్తున్నారు. ఎక్కడా రిజిస్ట్రేషన్లు చేయట్లేదు. ఇబ్బంది వస్తే తాము చూసుకుంటామని, ఇళ్లు నిర్మించుకోవచ్చని నమ్మబలుకుతున్నారు.
రికార్డుల్లో లేకుండానే
రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబరు 385లోని భూమి ప్రభుత్వ భూమిగానే చూపిస్తున్నారు. 2019లో అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు ఎఫ్8/4495/2013 కింద రిజిస్ట్రేషన్లు చేయకుండా సర్వే నంబరును నిషేధిత జాబితాలోనూ పొందుపర్చారు. దీంతో రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు చేసుకోకుండా నిబంధనలు అతిక్రమించి విక్రయాలు ఎలా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న వ్యక్తుల వెనుక కొందరు వైకాపా నేతలు ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికలు పూర్తయ్యే నాటికి వీలైనన్ని ప్లాట్లు విక్రయించాలని చూస్తున్నారు. న్యాయస్థానంలో అది ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తే నష్టపోయేది నిరుపేదలేనన్న వాదనలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లిచూపులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 19-05-2024]
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు
[ 19-05-2024]
శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, నిండిపోయాయి. -
ఐదేళ్లు.. రూపాయి విదిల్చితే ఒట్టు!
[ 19-05-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శరవేగంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు నిర్మితమవుతున్నాయి. తక్కువ సమయంలో మహా నగరాలకు చేరుకుంటున్నాం. -
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
[ 19-05-2024]
భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ సినీ ఫక్కీలో ఓ ఆలయ పూజారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రేణిగుంట సమీపంలో ప్రైవేట్ బస్సుకు మంటలు
[ 19-05-2024]
తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అనుకోని ప్రమాదంలో మంటల్లో చిక్కుకుంది. -
ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం
[ 19-05-2024]
జిలాలో జరిగిన హింసాత్మక ఘటనలను తీవ్రంగా తీసుకున్న ఎన్నికల సంఘం శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. -
తీపెక్కిన మామిడి
[ 19-05-2024]
బంగారుపాళ్యం మార్కెట్యార్డులో మామిడి కాయల సీజన్ ప్రారంభమైంది. -
228 మందికి షోకాజ్ నోటీసులు
[ 19-05-2024]
ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ షన్మోహన్.. 228 మంది ఉద్యోగులకు శనివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. -
నీరు కావాలంటే.. కొనాల్సిందే
[ 19-05-2024]
మనిషి జీవన ప్రయాణంలో నీటి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకోవాల్సి వస్తోంది. -
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి
[ 19-05-2024]
జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తితే పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కోరారు. -
వైకాపా నేతల మెడకు బిగుసుకోనున్న ఉచ్చు!
[ 19-05-2024]
పోలింగ్ రోజు, తర్వాత జరిగిన ఘటనలకు వైకాపా నేతలే ప్రధాన కారణమని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పొంగిపొర్లుతున్న మురుగు
[ 19-05-2024]
తిరుమలలో కొద్దిపాటి వర్షానికే మురుగు పొంగిపొర్లుతోంది. -
తెలంగాణ ఫలితాల్లో వెంగమాంబాపురం విద్యార్థి ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏడో ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం వెంగమాంబాపురానికి చెందిన వడ్లపూడి ముకేష్ చౌదరి. -
కారుపై మాత్రమే దాడి చేశారు: భానుకుమార్రెడ్డి భార్య రాణి
[ 19-05-2024]
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై మాత్రమే దాడి జరిగిందని రామచంద్రాపురం మండల జడ్పీటీసీ సభ్యురాలు దిల్లీరాణి పేర్కొన్నారు. -
నగరవాసులే ముందంజ
[ 19-05-2024]
చిత్తూరు నియోజకవర్గంలో మునుపెన్నడూ చూడని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. -
అశ్వవాహనంపై శ్రీసదాశివేశ్వరుడి విహారం
[ 19-05-2024]
పట్టణంలోని శ్రీ కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి వారు శ్రీకామాక్షీ దేవి సమేతుడైన శ్రీసదాశివేశ్వరుడు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
‘ఈ ఎన్నికల్లో గెలిచేది తెదేపా కూటమే’
[ 19-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని ఐ తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాలి గోపీనాథ్ పేర్కొన్నారు. -
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై మొదలైన విచారణ
[ 19-05-2024]
జడ్పీలో గతంలో బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గతేడాది లోకాయుక్తకు పలువురు పూర్వ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. -
సీఎం జగన్ కలలు కంటున్నారు
[ 19-05-2024]
సీఎం జగన్ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, ఆయన కల నెరవేరే పరిస్థితి లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..