జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’.
ఫిష్ల్యాండింగ్ సెంటర్ల పేరిట దగా
మూడు చోట్ల మంజూరైనా ఒక్క చోటే శంకుస్థాపన
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’ అంటూ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గతేడాది నవంబర్ 21న వర్చువల్గా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తీర ప్రాంతాల్లో మూడు చోట్ల మంజూరైతే ఒక్క చోట శంకుస్థాపనతో సరిపెట్టేశారు.
గూడూరు, న్యూస్టుడే: తీరప్రాంతంలో ఫిష్ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటు.. ఉపాధి పెరుగుదలకు చేస్తున్న చొరవ.. ఎక్కడెక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారన్న వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రశ్నకు లోకసభలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరుషోత్తం రుపాల గతేడాది సమాధానం ఇచ్చారు. తిరుపతి జిల్లాలో మూడు చోట్ల ఫిష్ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు లిఖిత పూర్వకంగా వివరించారు.
గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లోని 3 ప్రాంతాల్లో రూ.59.10 కోట్లు ఫిషింగ్ ల్యాండ్సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించింది. ఇందులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.25.02 కోట్లు వాకాడు మండలం రాయదొరువుకు కేటాయిచింది. దుగరాజపట్నం, భీములవారిపాళెంలో రెండు చోట్ల సెంటర్లకు సాగరమాల కింద నిధులు అందజేసినా ఉపయోగించుకోలేదు. చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటిగా వీరి పాలన ఉందంటూ ఆగ్రహిస్తున్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని జగన్.. ఎన్నికల ముందు పనులకు శంకుస్థాపనలు చేసి మమ అనిపించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేని దుస్థితి ఉంది.
నాలుగు నెలలు కావస్తున్నా ఒక్క అడుగు పడలేదు. నిధులు లేక ఏర్పాటుకు టెండర్లు పిలవలేదు. పరిపాలనా అనుమతులూ లేకుండా నాటకం ఆడినట్లు తెలిసింది. మత్స్యశాఖ శాఖ కనీసంగా టెండర్ల ప్రక్రియ చేపట్టలేదు. రాష్ట్రం నుంచి నిధులు వెచ్చించాల్సి రావడం బడ్జెట్లో ఇందుకు కేటాయింపులు లేకపోవడంతో శంకుస్థాపన డ్రామా ఆడారు.
ఆ రెండు చోట్ల తొక్కిపెట్టి...: సాగరమాల పథకంలో భాగంగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫ్లోటింగ్ జెట్టీలు.. ఇతర మౌలిక వసతులకు కేంద్రం సాగరమాల కింది నిధులు కేటాయించింది. ఇందులో వాకాడు మండలం దుగరాజపట్నంలో రూ.17.79 కోట్లు, తడ మండలం భీములవారిపాళెంలో రూ.16.29 కోట్లు నిధులు కేటాయించినట్లు గతేడాది మార్చిలో వైకాపా ఎంపీ ప్రశ్నకు వచ్చిన సమాధానం కాగా.. ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం దాటేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
[ 27-04-2024]
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే
[ 27-04-2024]
చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. -
‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే
[ 27-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి సంపద సర్వనాశనమైంది. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడానికి బదులు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు యథేచ్ఛగా దోచేశారు. -
అటవీశాఖ మంత్రి.. ‘పెద్ద’ మనసు లేని వైచిత్రి
[ 27-04-2024]
అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు దాహం.. ఆకలి బాధలు తట్టుకోలేక జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో.. జనావాసాల వైపు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. -
జగన్ జమానా.. ఖర్మ నాయనా..!
[ 27-04-2024]
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అప్పు అడిగితే వెతుక్కుని మరీవచ్చి ఇచ్చేవారు.. ఎందుకంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతం వస్తుంది కాబట్టి.. ప్రతి నెలా తేదీ తప్పకుండా నగదు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారనే నమ్మకంతో.. కానీ వైకాపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది.. -
నిజాలు చెబితే తాఖీదులు
[ 27-04-2024]
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. -
వైకాపాకే వంతపాడిన యంత్రాంగం
[ 27-04-2024]
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. -
‘వైకాపా పాలనలో అత్యాచారాల్లో ఏపీకి అగ్రస్థానం’
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే మహిళా సాధికారత సాధ్యమని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..
[ 27-04-2024]
నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. -
ఇసుకలో దోచేసి..మట్టితో దండుకుని
[ 27-04-2024]
వైకాపా నేతలకు ఇసుక, మట్టి ఆదాయ వనరులుగా మారాయి.. ఇసుక, చెరువులు, గుట్టల నుంచి మట్టిని దర్జాగా తరలించి జేబులు నింపుకొంటున్నారు.. -
‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’
[ 27-04-2024]
తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. -
ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
[ 27-04-2024]
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ -
ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఆమోదం 177.. తిరస్కారం 50
[ 27-04-2024]
నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. -
తిరస్కరణ భయం.. బరిలో భార్యలు, వారసులు
[ 27-04-2024]
సార్వత్రిక సమరం 2024లో కీలకమైన నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 27-04-2024]
చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిందని ఏఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM