logo

పారదర్శకంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది కోసం కల్పించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్వోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

Published : 05 May 2024 02:58 IST

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, చిత్రంలో డీఆర్వో పెంచల కిషోర్‌

తిరుపతి (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది కోసం కల్పించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్వోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శనివారం డీఆర్వో పెంచల కిషోర్‌ తదితర అధికారులతో కలిసి ఏడు నియోజకవర్గాలకు చెందిన అధికారులతో వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉద్యోగులు, సిబ్బంది ఫారం 12, 12డీ సమర్పించి నిర్ణీత కేంద్రాల్లో ఓటు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో సంబంధిత బాక్స్‌లను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించాలన్నారు. డీఎల్‌డీవో సుశీలాదేవి, జిల్లా సమాచార, పౌరసంబంధాల అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లోకి సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం సూచనలు చేశారు.

  • 'మీ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పేరు, దాని కోడ్‌ నంబర్‌ తెలుసుకోవాలి. మీ ఓటు ఉన్న పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ ఓటరు జాబితాలో మీ ఓటు క్రమసంఖ్య తెలుసుకోవాలి.
  • ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళ్లిన తర్వాత 13ఏ డిక్లరేషన్‌, 13బి కవర్‌ ఏ, 13సి కవర్‌ బి, ఫాం-13డి సూచనలు, బ్యాలెట్‌ ఇస్తారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిచేయాలి.
  • 13ఏ పూరించి అందులో మీకు ఇచ్చిన పోస్టల్‌ బ్యాలెట్‌ సీరియల్‌ నంబర్‌ తప్పక రాయాలి. మీ సంతకం, గెజిటెడ్‌ అధికారి సంతకం చేయించాలి. గెజిటెడ్‌ అధికారి అక్కడే అందుబాటులో ఉంటారు.
  • 13బి(ఏ ఇన్నర్‌ కవర్‌) పూర్తి చేయాలి. 13బిలో కూడా మీ పోస్టల్‌ బ్యాలెట్‌ సీరియల్‌ నంబరు తప్పక రాయాలి. అలా వేయకుంటే అది ఇన్‌వ్యాలిడ్‌ అవుతుంది. టిక్‌ చేసిన బ్యాలెట్‌ అందులో పెట్టి సీల్‌ వేయాలి.
  • 13సి ఔటర్‌ కవర్‌లో 13బి ఇన్నర్‌ కవరును, 13ఏ డిక్లరేషన్‌ ఉంచి సీల్‌ చేసి కవర్‌పై వివరాలు పూర్తిచేయాలి. ఆపై అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్‌ వేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని