జరుగు జరుగు.. జాబుల్లేవ్ జగన్
ఏటా ప్రారంభంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా.. మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తా.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అంతమొందించడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సమయాన నిర్వహించిన పాదయాత్రలో గొప్పగొప్ప హామీలు గుప్పించారు..
క్యాలెండర్ ఎక్కడన్నా ఉద్యోగాలంటూ ముంచేశావ్
మండిపడుతున్న నిరుద్యోగులు
న్యూస్టుడే, చిత్తూరు గ్రామీణ, పెనుమూరు, ఐరాల, జీడీనెల్లూరు
ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు
ఏటా ప్రారంభంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా.. మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తా.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అంతమొందించడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సమయాన నిర్వహించిన పాదయాత్రలో గొప్పగొప్ప హామీలు గుప్పించారు.. అడుగడుగునా చిలుక పలుకులు పలికారు.. నిరుద్యోగులపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోశారు.. తీరా ఎన్నికలయ్యాయి.. అధికారం చేపట్టారు.. చివరకు అంతా తుస్.. తుస్.. మనిపించి నిరుద్యోగ యువతను నిట్టనిలువునా ముంచారు.. జాబ్ క్యాలెండర్ మాట అటుంచితే అసలు క్యాలెండరే లేకుండా చేశాడని యువత వాపోతున్నారు.. ఉద్యోగ, ఉపాధి కోసం ఐదేళ్లుగా నిరీక్షించి తమ కళ్లు కాయలు కాశాయని, చివరకు ఒరిగిందేమీ లేదని.. కనీసం డీఎస్సీ పెట్టిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చివరకు నిరాశే మిగిలింది..
మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో తమ జీవితాల్లో ఎంతో వెలుగు వస్తుందని ఆశపడ్డాం. అదికాస్తా నిరాశగానే మిగిలింది. చివరకు డీఎస్సీపై ఎలాంటి చర్యలు లేవు. ఇంతకన్నా దారుణం మరోటి లేదు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసుకోవాల్సి వచ్చింది.
జ్యోతి, పెనుమూరు
విన్నాం.. మోసపోయాం..
ముఖ్యమంత్రి జగన్ మాటలు ఎంతగానో నమ్మాం. జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశ పడ్డాం. భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగడానికి భరోసా వస్తుందని భావించాం. చివరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఎన్నికల సమయాన హడావుడిగా డీఎస్సీ ప్రకటించినా ఫలితంలేదు.
యోగనందిని, పేటనత్తం, జీడీనెల్లూరు
ఎదురుచూపులు తప్ప మేలు లేదు..
మెగా డీఎస్సీ నిర్వహించి యువతను ఆదుకుంటామనే ముఖ్యమంత్రి మాటలు గుడ్డిగా నమ్మాం. ఐదేళ్లుగా ఉద్యోగావశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా రాలేదు. ఎదురు చూపులు తప్ప ఫలితం లేదు.
ఆశాగ్రేసి, తెల్లగుండ్లపల్లె, ఐరాల మండలం
జాబ్ క్యాలెండర్ ఏదీ..?
నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన సీఎం మాటలు కార్యరూపం దాల్చలేదు. దీంతో నిరుద్యోగ యువత నిరాశలో మునిగిపోయింది. ఒక్కసారి కూడ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన దాఖలాలు లేవు. దీంతో నిరుద్యోగం పెరిగిపోతోంది.
మోహన్కుమార్, డీఈడీ విద్యార్థి, కుక్కలపల్లె, చిత్తూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగుబడులు పెరిగి.. ధరలు పతనమై
[ 18-05-2024]
వాతావరణం అనుకూలించడంతో ఈ సంవత్సరం టమాటా దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితే దక్షిణాది రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఫలితంగా టమాటా దిగుబడులు మార్కెట్లకు తరలివస్తున్నాయి. -
వైద్యులు ఉండరు.. సేవలు అందవు
[ 18-05-2024]
జిల్లాలోని 50 పీహెచ్సీల తోపాటు నాలుగు సీహెచ్సీల్లో 24 గంటల వైద్య సేవలను అందించాల్సి ఉండగా.. చాలాచోట్ల పగటి వేళల్లో మాత్రమే వైద్యులు అందుబాటులో ఉంటారని.. రాత్రుల్లో వారి సేవలు నామమాత్రమే అని ఆరోపణలు చోటు చేసుకొంటున్నాయి. -
మనోళ్లే ఇచ్చేయండి..!
[ 18-05-2024]
పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనుల్లో కొన్నింటికి బిల్లులు మంజూరయ్యాయి.. -
నేడు సైన్స్ సెంటర్ ప్రవేశం ఉచితం
[ 18-05-2024]
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలోకి సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. -
భూసారం.. లక్ష్యం నిస్సారం
[ 18-05-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని.. తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయట పడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి.. -
తెదేపాకు 125-150 సీట్లు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తెదేపాకు 125 నుంచి 150 సీట్లు వస్తాయని తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారిని అభిషేక సేవలో ఆయన దర్శించుకున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
శ్రీపద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం
[ 18-05-2024]
తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు యువకుల మృతి
[ 18-05-2024]
తిరుపతి-చెన్నై జాతీయ రహదారిలోని నగరి మండలం తడుకుపేట వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇలంకన్నన్(26), కన్నన్(28) మృతిచెందారు. -
శోకసంద్రంలో ఎస్బీఆర్పురం
[ 18-05-2024]
వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం చెరువులో నీటి మునిగి మృతి చెందిన ముగ్గురు ఆడబిడ్డల మృతదేహాలకు పలువురు శుక్రవారం నివాళులర్పించారు. ముగ్గురు కుమార్తెలు విగతజీవులుగా పడిఉండటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు వర్ణనాతీతం. -
అడ్డగోలు తవ్వకం.. లేదంటూ నాటకం
[ 18-05-2024]
శ్రీకాళహస్తి మండలం సుబ్బనాయుడు కండ్రిగ, పుల్లారెడ్డి కండ్రిగ, రామలింగాపురం, చుక్కలనిడిగల్లు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. -
స్ట్రాంగ్రూంల వద్ద మూడంచెల భద్రత
[ 18-05-2024]
మహిళా వర్సిటీలోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద మూడంచెల కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉన్నట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
భక్తి‘తోటి’ వేషాలు
[ 18-05-2024]
తాతయ్యగుంట గంగమ్మ జాతరలో మూడో రోజు శుక్రవారం భక్తులు తోటి వేషాలతో సందడి చేశారు. గర్భాలయంలోని గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించారు. -
రక్తపోటు నియంత్రణతో వ్యాధులు దూరం
[ 18-05-2024]
ప్రతి ఒక్కరూ విధిగా బీపీ తనిఖీ చేసుకుంటూ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలని డీఎంహెచ్వో యు.శ్రీహరి, రుయా సూపరింటెండెంట్ రవిప్రభు పేర్కొన్నారు. -
విపంచి ధరించి.. విహరించి
[ 18-05-2024]
శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఉదయం చిన్నశేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై గోవిందరాజస్వామి భక్తులకు అభయమిచ్చారు.