గడిచాయి ఐదేళ్లు.. ఏవీ నీళ్లు?
‘వడ్డించే వాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి’ అన్నది సామెత. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపాలో నంబరు-2 అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ మిథున్రెడ్డిది మన జిల్లానే కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని ప్రజలు భావించారు.
కొలిక్కిరాని వాటర్గ్రిడ్ ప్రాజెక్టు
జగన్ సన్నిహిత సంస్థకు పన్నులు కట్టబెట్టినా సాగని పనులు
కుప్పం మున్సిపాలిటీ ఏడో వార్డు రాజీవ్కాలనీలో ట్యాంకరు వద్ద నీటి కోసం వేచిచూస్తున్న మహిళలు
ఈనాడు, చిత్తూరు: ‘వడ్డించే వాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి’ అన్నది సామెత. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపాలో నంబరు-2 అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ మిథున్రెడ్డిది మన జిల్లానే కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని ప్రజలు భావించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చకచకా సాగుతాయని ఆశలు పెట్టుకున్నారు. సీఎం ఇచ్చిన హామీలే కాక ఇవ్వనవీ అమలవుతాయని భావించింది. వారే స్వయంగా చెప్పిన వాటర్గ్రిడ్ ప్రాజెక్టు పనులైతే వాయువేగంతో సాగుతాయని, ప్రతి ఇంటికీ 24 గంటలూ రక్షిత నీరు అందుతుందనుకున్నా ఇవన్నీ తలకిందులయ్యాయి. ఐదేళ్లుగా కాగితాల్లోనే నీళ్లు ప్రవహించాయి. వైకాపాను నమ్మి ఓటేసినందుకు ప్రజానీకం నట్టేట మునిగింది.
ఇదీ తెదేపా ప్రణాళిక: తెదేపా పాలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించేందుకు వాటర్గ్రిడ్ పథకాన్ని అమలు చేయాలని తలచారు. తొలిదశలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్న పడమటి మండలాలకు కడప జిల్లా గండికోట జలాశయం నుంచి 2.20 టీఎంసీల నీటిని తెచ్చి 28 మండలాల్లోని 4,780 గ్రామాలకు అందించాలనేది లక్ష్యం. ఆపై తూర్పు ప్రాంతంలో పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ.4,375 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసి టెండర్లు ఖరారు చేశారు. 2019 జూన్ నెలాఖరులో పనులు ప్రారంభించి 2021 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పుంగనూరుకే పరిమితం చేసి: పుంగనూరు నియోజవర్గంలోని ఆరు మండలాల్లోని 59,607 గృహాల్లో 2.38 లక్షల మందికి తాగునీటి అవస్థలు తప్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితమైన, తెలంగాణలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన సంస్థకు రూ.2,340 కోట్లతో టెండర్ను కట్టబెట్టారు. గతేడాది ఫిబ్రవరి 9న ఆ సంస్థతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. పనుల పూర్తికి 30 నెలల గడువు విధించారు.
‘విపక్ష నేత హోదాలో జగన్ సుదీర్ఘ పాదయాత్రలో జిల్లా ప్రజల కష్టాలు స్వయంగా చూశారు. ప్రజలు నీటి కోసం పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. అందుకే శాశ్వత పరిష్కారానికి వాటర్గ్రిడ్ ప్రాజెక్టును అమలు చేసి నీటిఎద్దడిని తీరుస్తాం’
2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేట ఎంపీ, వైకాపా లోక్సభా పక్షనేత మిథున్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.
‘కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్తో రాష్ట్రవ్యాప్తంగా వాటర్గ్రిడ్ పథకం చేపడుతున్నాం. రానున్న రోజుల్లో జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం’
సీఎం జగన్ కేబినెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అధికారులతో నిర్వహించిన సమీక్షలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన మాటలివి.
రోజుకు ఒక్కో వ్యక్తికి 105 లీటర్లు అంటూ.. : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజుకు 105 లీటర్లు, మున్సిపాలిటీలలో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం డిజైన్లు, డ్రాయింగ్, సర్వే పనులే జరుగుతున్నాయి. ఒప్పందం జరిగి 13 నెలలు దాటినా పైప్లైన్ల ఏర్పాటే ప్రారంభం కాలేదు. ఇక పనులు ఎప్పుడు మొదలవుతాయి? ఎప్పుడు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకమే.
ట్యాంకర్లకే రూ.110 కోట్లు
కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ఐదేళ్లలో ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీరు సరఫరా చేసేందుకు దాదాపు రూ.110 కోట్లు ఖర్చయింది. రాబోయే రోజుల్లో ఇది మరింత అధికం కానుంది. అదే వాటర్గ్రిడ్ను ఈ రెండు నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తే దాదాపు 6.20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.
ఇదీ వైకాపా విఫల చరితం
రామకుప్పం మండలం 89.పెద్దూరులో నీటి కోసం వేచిచూస్తున్న మహిళలు
2019 మే నెలలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్గ్రిడ్ పథకాన్ని పక్కనపెట్టింది. నూతనంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పారు. అనంతరం తీవ్ర తర్జనభర్జనలు పడి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరుకు మాత్రమే పరిమితం చేశారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకూ నీళ్లు అందించాలని ప్రజల నుంచి డిమాండ్లు వచ్చినా వైకాపా నేతలు బుట్టదాఖలు చేశారు. దీంతో ప్రస్తుత చిత్తూరు జిల్లాలో ఒక్క పుంగనూరుకే వాటర్గ్రిడ్ ప్రతిపాదించారు. 2022 చివరి నాటికి ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి పైప్లైన్లతో తంబళ్లపల్లె, మదనపల్లె మీదుగా పుంగనూరుకు నీళ్లు చేర్చి శుద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఎద్దడి నివారణ పట్టించుకోక
వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఐదేళ్లలో నీటిఎద్దడి నివారణకు ఒక్క అడుగూ వేయలేదు. తెదేపా హయాంలో పూర్తి చేసిన టెండర్లకు అనుగుణంగా పనులు మొదలుపెట్టి ఉంటే ఈపాటికి ఇంటింటికీ నీళ్లు వచ్చేవి. తాగునీటి సమస్య అధికంగా ఉండే కుప్పం వరకు వాటర్గ్రిడ్ ప్రాజెక్టును పొడిగిస్తే బాగుంటుంది.
సతీష్కుమార్, కుప్పం పట్టణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
[ 18-05-2024]
తిరుమలలో భక్తుల రద్దీ మూడో రోజూ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. -
దిగుబడులు పెరిగి.. ధరలు పతనమై
[ 18-05-2024]
వాతావరణం అనుకూలించడంతో ఈ సంవత్సరం టమాటా దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితే దక్షిణాది రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఫలితంగా టమాటా దిగుబడులు మార్కెట్లకు తరలివస్తున్నాయి. -
వైద్యులు ఉండరు.. సేవలు అందవు
[ 18-05-2024]
జిల్లాలోని 50 పీహెచ్సీల తోపాటు నాలుగు సీహెచ్సీల్లో 24 గంటల వైద్య సేవలను అందించాల్సి ఉండగా.. చాలాచోట్ల పగటి వేళల్లో మాత్రమే వైద్యులు అందుబాటులో ఉంటారని.. రాత్రుల్లో వారి సేవలు నామమాత్రమే అని ఆరోపణలు చోటు చేసుకొంటున్నాయి. -
మనోళ్లే ఇచ్చేయండి..!
[ 18-05-2024]
పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనుల్లో కొన్నింటికి బిల్లులు మంజూరయ్యాయి.. -
నేడు సైన్స్ సెంటర్ ప్రవేశం ఉచితం
[ 18-05-2024]
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలోకి సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. -
భూసారం.. లక్ష్యం నిస్సారం
[ 18-05-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని.. తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయట పడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి.. -
తెదేపాకు 125-150 సీట్లు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తెదేపాకు 125 నుంచి 150 సీట్లు వస్తాయని తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారిని అభిషేక సేవలో ఆయన దర్శించుకున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
శ్రీపద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం
[ 18-05-2024]
తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు యువకుల మృతి
[ 18-05-2024]
తిరుపతి-చెన్నై జాతీయ రహదారిలోని నగరి మండలం తడుకుపేట వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇలంకన్నన్(26), కన్నన్(28) మృతిచెందారు. -
శోకసంద్రంలో ఎస్బీఆర్పురం
[ 18-05-2024]
వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం చెరువులో నీటి మునిగి మృతి చెందిన ముగ్గురు ఆడబిడ్డల మృతదేహాలకు పలువురు శుక్రవారం నివాళులర్పించారు. ముగ్గురు కుమార్తెలు విగతజీవులుగా పడిఉండటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు వర్ణనాతీతం. -
అడ్డగోలు తవ్వకం.. లేదంటూ నాటకం
[ 18-05-2024]
శ్రీకాళహస్తి మండలం సుబ్బనాయుడు కండ్రిగ, పుల్లారెడ్డి కండ్రిగ, రామలింగాపురం, చుక్కలనిడిగల్లు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. -
స్ట్రాంగ్రూంల వద్ద మూడంచెల భద్రత
[ 18-05-2024]
మహిళా వర్సిటీలోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద మూడంచెల కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉన్నట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
భక్తి‘తోటి’ వేషాలు
[ 18-05-2024]
తాతయ్యగుంట గంగమ్మ జాతరలో మూడో రోజు శుక్రవారం భక్తులు తోటి వేషాలతో సందడి చేశారు. గర్భాలయంలోని గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించారు. -
రక్తపోటు నియంత్రణతో వ్యాధులు దూరం
[ 18-05-2024]
ప్రతి ఒక్కరూ విధిగా బీపీ తనిఖీ చేసుకుంటూ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలని డీఎంహెచ్వో యు.శ్రీహరి, రుయా సూపరింటెండెంట్ రవిప్రభు పేర్కొన్నారు. -
విపంచి ధరించి.. విహరించి
[ 18-05-2024]
శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఉదయం చిన్నశేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై గోవిందరాజస్వామి భక్తులకు అభయమిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే