logo

ముసుగు తీసి.. వైకాపా సేవలో తరించి..

సేవ చేసేందుకు వచ్చామని గొప్పలు చెప్పిన వాలంటీర్లు.. ఇప్పుడు రాజీనామా చేసి ముసుగు తొలగించి ఏకంగా వైకాపా కార్యకర్తలుగా మారిపోయారు.

Published : 06 May 2024 04:39 IST

కుప్పంలో వైకాపా నాయకులతో కలిసి డమ్మీ ఈవీఎంలతో ప్రచారం చేస్తున్న పూర్వ వాలంటీర్లు

కుప్పం పట్టణం: సేవ చేసేందుకు వచ్చామని గొప్పలు చెప్పిన వాలంటీర్లు.. ఇప్పుడు రాజీనామా చేసి ముసుగు తొలగించి ఏకంగా వైకాపా కార్యకర్తలుగా మారిపోయారు. ఇన్నాళ్లు తాము పింఛన్లు పంపిణీ చేసిన లబ్ధిదారుల వద్దకెళ్లి బ్యాంకు కష్టాలకు ప్రతిపక్షాలే కారణమంటూ లబ్ధిదారుల్లో విషం నింపేందుకు యత్నిస్తున్నారు. కుప్పం పట్టణంలో శని, ఆదివారాలు వైకాపా నాయకులతో కలిసి వాడవాడలా వైకాపా అభ్యర్థి భరత్‌ తరఫున పూర్వ వాలంటీర్లు డమ్మీ ఈవీఎం బాక్సులతో ప్రచారం చేశారు. ఇంటింటా ‘సిద్ధం’ స్టిక్కర్లను గోడలకు అతికిస్తూ నిబంధనలు అతిక్రమిస్తున్నా.. అధికారులు పట్టించుకోక పోవడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని