logo

హద్దులు దాటి వైకాపా ప్రచారం

కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రం గేటు వద్ద వైకాపా అభ్యర్థి భరత్‌, ఆ పార్టీ శ్రేణులు నిబంధనలు విస్మరించి ఓట్లు అభ్యర్థించారు. దీంతో తెదేపా శ్రేణులు అక్కడికి రాగా.

Published : 06 May 2024 04:47 IST

వైకాపా అభ్యర్థి భరత్‌ను వారించకుండా కొంత దూరంలో ఉన్న తెదేపా శ్రేణులను వెళ్లగొడుతున్న పోలీసులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రం గేటు వద్ద వైకాపా అభ్యర్థి భరత్‌, ఆ పార్టీ శ్రేణులు నిబంధనలు విస్మరించి ఓట్లు అభ్యర్థించారు. దీంతో తెదేపా శ్రేణులు అక్కడికి రాగా.. ఎన్నికల అధికారులు గేటు వద్ద ఉన్న షామియానా తొలగించి, వంద మీటర్ల దూరం వెళ్లాలంటూ ఇరు పార్టీలకు తెలిపారు. కొద్దిసేటికే వైకాపా అభ్యర్థి భరత్‌, అతని అనుచరులు గేటు వద్ద కండువాలు, టోపీలతో ప్రచారం చేశారు. పోలీసులు భరత్‌ను వారించకుండా తెదేపా శ్రేణులు వెళ్లిపోవాలని ఆదేశాలివ్వడం వివాదానికి దారి తీసింది. వైకాపా శ్రేణులు వెళ్లిపోవాలంటూ చెప్పిన సీఐపై కొందరు వైకాపా నాయకులు దురుసుగా ప్రవర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని