మురిపించి.. విస్మరించి..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే బండికి వ్యవసాయం, పాడి.. జోడుచక్రాలు. ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలైంది.
మందులివ్వక.. ఖాళీలు భర్తీ చేయక
ఐదేళ్లుగా పాడి పరిశ్రమపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం
ప్రభుత్వ వైఖరితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలు
గుడుపల్లెలోని ప్రభుత్వ పశువైద్యశాల
ఈనాడు, చిత్తూరు- న్యూస్టుడే, గుడుపల్లె: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే బండికి వ్యవసాయం, పాడి.. జోడుచక్రాలు. ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలైంది. ఈ సమయంలో పాడి ఎంతోకొంత చేయూతనందిస్తుందని ఆశించినా వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో వారూ నష్టపోయారు. ఫలితంగా పశువులను కబేళాలకు అమ్మేయాల్సిన దుస్థితి ఎదురైంది.
జిల్లావ్యాప్తంగా 5.40 లక్షల ఆవులు, 7.09 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఏడు నియోజకవర్గాలూ గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాయి. పల్లెల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక పాడి ఆవును పోషించే పరిస్థితి ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థలో భాగంగా పశుసంవర్ధక సహాయకుల (ఏహెచ్ఏ)ను నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు. ఉన్నవారిలో సైతం కొందరు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
కాగితాల్లోనే మందులు
రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా పశువైద్యాన్ని పాడి రైతుల ఇంటి ముంగిటకే తెచ్చామని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెబుతున్నారు. ఈ వ్యవస్థ ప్రారంభమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల విలువైన మందులు సరఫరా చేసింది. ఆ తర్వాత రెండేళ్లపాటు ఔషధాలు ఇచ్చిందే లేదు. దీంతో పశుసంవర్ధక సహాయకులు మందులు రాసిస్తే రైతులు బయట కొనుగోలు చేశారు. ప్రభుత్వం మాత్రం 108 రకాల మందులను ఉంచాలని చెప్పినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. మూడు నెలలకోసారి ఔషధాలు సరఫరా చేయాల్సి ఉన్నా ఆరు నెలలకోసారి పంపిస్తున్నారు. అవీ అరకొరగా ఇస్తున్నారు.
ఎన్ని గొప్పలో..: మనుషుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తూ పాడి రైతులకు, పశు పెంపకందార్లకు మేలు చేసేలా విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి జగన్ ఘనంగా ప్రకటించారు. మూగజీవాలకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్న ఘనత తనకే దక్కిందని గొప్పలు పోయారు.
క్షేత్రస్థాయిలో దుస్థితి: ముఖ్యమంత్రి చెప్పిన విప్లవాత్మక మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా రాలేదు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని పాడి రైతులు పశువులకు వైద్యం చేయించేందుకు కర్ణాటకలోని ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడుతున్నారు. కనీసం మందులు కూడా అందుబాటులో లేనందున బయట దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.
130 పోస్టులు ఖాళీగానే..
జిల్లాలోని 31 మండలాల్లో కలిపి 502 మంది పశుసంవర్ధక సహాయకులు సేవలు అందించాలి. ప్రస్తుతం 372 మంది మాత్రమే విధుల్లో ఉండగా 130 పోస్టులు భర్తీ చేయాలి. పలమనేరు, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఖాళీలున్నాయి. ఈ క్రమంలోనే రైతులు కర్ణాటకలోని ప్రైవేటు పశువైద్యులకు ఫోన్లు చేసి సేవలు వినియోగించుకుంటున్నారు. రూ.400- రూ.800 వారు వసూలు చేస్తున్నారు. పడమటి మండలాల్లోని ప్రజలు పాడిపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అటువంటప్పుడు ఇక్కడే ఎక్కువ ఖాళీలుంటే ఏవిధంగా జీవనం ముందుకు సాగుతుందో ప్రభుత్వమే చెప్పాలి.
అంతుపట్టని వ్యాధినీ పట్టించుకోక..
కుప్పం మండలం రాజనంలో దాదాపు 20 పాడి ఆవులు మృత్యువాత పడ్డాయి. ఇలా ఎందుకు జరిగిందో రైతులకు ఇప్పటివరకూ అంతుపట్టలేదు. ఈవిషయంలో అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం సైతం నిర్లిప్తంగా వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి.
ఈ రైతు పేరు నారాయణప్ప. స్వస్థలం గుడుపల్లె మండలం పెద్దగొల్లపల్లి. ఈయనకు రెండు పాడి ఆవులున్నాయి. వాటికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో కర్ణాటకలోని ప్రైవేటు పశువైద్యుడి వద్దకు తీసుకెళ్తే రూ.2,600 ఖర్చయింది. ప్రభుత్వ వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. గుడుపల్లె మండలంలో 18 మంది పశుసంవర్ధక సహాయకులకుగాను ఇద్దరు మాత్రమే ఉన్నారు.
ఈయన పేరు ఆర్.కృష్ణప్ప. గుడుపల్లె మండలం కాడేపల్లివాసి. పశువైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే మందులు లేవని.. రాసిస్తాం.. బయట కొనుక్కోమని చెప్పారు. ఇలా ఉంటే మా జీవనం ఎలా సాగుతుందని కృష్ణప్ప వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
[ 19-05-2024]
భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ సినీ ఫక్కీలో ఓ ఆలయ పూజారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఐదేళ్లు.. రూపాయి విదిల్చితే ఒట్టు!
[ 19-05-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శరవేగంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు నిర్మితమవుతున్నాయి. తక్కువ సమయంలో మహా నగరాలకు చేరుకుంటున్నాం. -
ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం
[ 19-05-2024]
జిలాలో జరిగిన హింసాత్మక ఘటనలను తీవ్రంగా తీసుకున్న ఎన్నికల సంఘం శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. -
తీపెక్కిన మామిడి
[ 19-05-2024]
బంగారుపాళ్యం మార్కెట్యార్డులో మామిడి కాయల సీజన్ ప్రారంభమైంది. -
228 మందికి షోకాజ్ నోటీసులు
[ 19-05-2024]
ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ షన్మోహన్.. 228 మంది ఉద్యోగులకు శనివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. -
నీరు కావాలంటే.. కొనాల్సిందే
[ 19-05-2024]
మనిషి జీవన ప్రయాణంలో నీటి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకోవాల్సి వస్తోంది. -
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి
[ 19-05-2024]
జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తితే పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కోరారు. -
వైకాపా నేతల మెడకు బిగుసుకోనున్న ఉచ్చు!
[ 19-05-2024]
పోలింగ్ రోజు, తర్వాత జరిగిన ఘటనలకు వైకాపా నేతలే ప్రధాన కారణమని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పొంగిపొర్లుతున్న మురుగు
[ 19-05-2024]
తిరుమలలో కొద్దిపాటి వర్షానికే మురుగు పొంగిపొర్లుతోంది. -
తెలంగాణ ఫలితాల్లో వెంగమాంబాపురం విద్యార్థి ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏడో ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం వెంగమాంబాపురానికి చెందిన వడ్లపూడి ముకేష్ చౌదరి. -
కారుపై మాత్రమే దాడి చేశారు: భానుకుమార్రెడ్డి భార్య రాణి
[ 19-05-2024]
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై మాత్రమే దాడి జరిగిందని రామచంద్రాపురం మండల జడ్పీటీసీ సభ్యురాలు దిల్లీరాణి పేర్కొన్నారు. -
నగరవాసులే ముందంజ
[ 19-05-2024]
చిత్తూరు నియోజకవర్గంలో మునుపెన్నడూ చూడని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. -
అశ్వవాహనంపై శ్రీసదాశివేశ్వరుడి విహారం
[ 19-05-2024]
పట్టణంలోని శ్రీ కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి వారు శ్రీకామాక్షీ దేవి సమేతుడైన శ్రీసదాశివేశ్వరుడు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
‘ఈ ఎన్నికల్లో గెలిచేది తెదేపా కూటమే’
[ 19-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని ఐ తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాలి గోపీనాథ్ పేర్కొన్నారు. -
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై మొదలైన విచారణ
[ 19-05-2024]
జడ్పీలో గతంలో బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గతేడాది లోకాయుక్తకు పలువురు పూర్వ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. -
సీఎం జగన్ కలలు కంటున్నారు
[ 19-05-2024]
సీఎం జగన్ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, ఆయన కల నెరవేరే పరిస్థితి లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు పేర్కొన్నారు. -
పెళ్లిచూపులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 19-05-2024]
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి