కనుల వైభవం.. సత్యదేవుని విహారం
జై సత్యదేవా అంటూ స్వామి నామస్మరణ నడుమ అన్నవరంలో రథోత్సవం కనులపండువగా సాగింది. దాదాపు 34.1 అడుగుల ఎత్తైన నూతన రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు బుధవారం ఆశీనులు కాగా భక్తులు దర్శించుకుని పరవశించారు.
వేలాదిమంది భక్తుల నడుమ రథోత్సవం
వేడుకలో పాల్గొన్న భక్తులు
అన్నవరం, న్యూస్టుడే: జై సత్యదేవా అంటూ స్వామి నామస్మరణ నడుమ అన్నవరంలో రథోత్సవం కనులపండువగా సాగింది. దాదాపు 34.1 అడుగుల ఎత్తైన నూతన రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు బుధవారం ఆశీనులు కాగా భక్తులు దర్శించుకుని పరవశించారు. వేదమంత్రోచ్చరణ, మంగళవాయిద్యాల నడుమ రథాన్ని ముందుకు లాగుతూ పూజలు నిర్వహించారు. దేవస్థానం ఛైర్మన్ రోహిత్, ఈవో కె.రామచంద్రమోహన్లు సాయంత్రం 5 గంటలకు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు.
స్వామి, అమ్మవార్లను రథం వద్దకు తీసుకువస్తున్న అర్చకులు
అన్నవరంలోని తొలి పావంచాల వద్ద రథం ప్రారంభమై వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద కూడలి నుంచి వెనక్కి మళ్లించారు. అక్కడ నుంచి టోల్గేటు వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్దకు..తిరిగి తొలిపావంచాల వద్దకు చేరుకుంది. ఎంపీ రఘురామకృష్ణరాజు పాల్గొని రథాన్ని ముందుకు లాగారు. రథం తయారు చేసిన కామేశ్వరరావును ఛైర్మన్, ఈవోలు సత్కరించారు. డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులు, ఇతర వాహనాలను జాతీయ రహదారి మీదుగా దారిమళ్లించారు. అంతకుముందు కొండ దిగువన దేవస్థానం ఉద్యానవనంలో వన విహారోత్సవం జరిగింది. స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి పెండ్లి పెద్దలు సీతారాముల వారితో పాటు కొండపై నుంచి మెట్ల మార్గం ద్వారా కిందకు తీసుకువచ్చి ఉద్యానవనంలో వేదికపై ఆసీనులను చేశారు.
- గురువారం ఉదయం 9 గంటలకు కొండ దిగువన పంపా సరోవరంలో శ్రీచక్రస్నానం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండీయాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
[ 16-06-2024]
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దర్శించుకున్నారు. -
మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్ డే వేడుకలు
[ 16-06-2024]
రోటరీ క్లబ్ నిడవోలు అధ్యక్షుడు కీర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్డే వేడుకలు నిర్వహించారు. -
శ్రీకోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా సూపరింటెండెంట్
[ 16-06-2024]
మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంంలో కొలువై ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారిని తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ పి.జగదీశ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. -
నాన్నంటే నాన్నే
[ 16-06-2024]
నాన్నంటే ఇష్టంగా మోసే బాధ్యత.. వెన్నంటి నడిచే ధైర్యం.. ఊహకందని త్యాగం.. నడత నేర్పే గురువు.. తన జీవితాన్నే మనకోసం ధారబోసే మహోన్నతుడు. -
మానసిక సంఘర్షణ.. మృత్యుమార్గాన..
[ 16-06-2024]
ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నత చదువులు చదివారు. మహానగరాల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్ల క్రితం తండ్రి చనిపోవడం.. తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఇంటికొచ్చేశారు. -
అమ్మా.. నన్ను క్షమించు
[ 16-06-2024]
‘అమ్మా.. నన్ను క్షమించు. నా స్నేహితుడు శ్రీను.. వాళ్ల మావయ్య మోసం చేశాడు. రూ.35 లక్షలు ఇవ్వాలి. -
కొమ్మనాపల్లిలో అదుపులోకి రాని అతిసారం
[ 16-06-2024]
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రబలిన (అతిసారం) మూడోరోజుకూ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. గ్రామంలోని మరో 28 మంది శనివారం కూడా అస్వస్థత బారిన పడ్డారు. -
వెంకన్న వేడుక చూద్దాం రండి
[ 16-06-2024]
పవిత్ర వైనతేయ నదీ తీరంలో కొలువైన అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. -
అన్నదాత ఆత్మ సంకల్పానికి దెబ్బ
[ 16-06-2024]
పుడమి తల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అడుగడుగునా సమస్యలే. విత్తు వేసింది మొదలు.. దిగుబడి వచ్చే వరకు, ఆ తర్వాత కూడా అనేక సవాళ్లు. -
అక్కడ కూలినా.. ఇక్కడ వేళ్లూనేలా..
[ 16-06-2024]
దశాబ్దాల క్రితం నాటి ఓ రావిచెట్టు కాకినాడ బాలాత్రిపుర సుందరి దేవాలయం రహదారిలో గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. -
పూలబాట పరిచిన పాదాలకు పుష్పాభిషేకం
[ 16-06-2024]
కాకినాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం ఫాదర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండ్రులపై చిన్నారులు పూలు చల్లి ఆశీర్వచనం తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూన్ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన
-
ఆ విషయంలో నన్నెవరూ అధిగమించలేరు: కుమార్తెపై రామ్ చరణ్ ప్రేమ
-
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు
-
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?