లాభంలేదురొయ్యో..!
ఆక్వారంగంలో ఎన్నడూ చూడని పరిస్థితి కనిపిస్తోంది. రొయ్యలకు తెగుళ్లు, ధరల ఒడుదొడుకులు..
న్యూస్టుడే, ముమ్మిడివరం,అమలాపురం కలెక్టరేట్: ఆక్వారంగంలో ఎన్నడూ చూడని పరిస్థితి కనిపిస్తోంది. రొయ్యలకు తెగుళ్లు, ధరల ఒడుదొడుకులు.. ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని రైతులు ముందుకు సాగారు. ప్రస్తుత పరిస్థితులు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువులో రొయ్యలు పట్టుబడి చేస్తే.. ఐస్ వస్తుందో, రాదో తెలియని స్థితి. ధర ఎంత ఇచ్చినా.. సరకు పట్టుకెళ్లండని వేడుకోవాల్సిన దుస్థితి. ప్రధానంగా నెల నుంచి మారుతున్న పరిస్థితులే కొనసాగితే.. ఆక్వారంగం తిరోగమనం పట్టడం, పంట విరామం ప్రకటించడం ఖాయమనే భావన రైతుల్లో నెలకొంది.
* మధ్యలోనే పట్టుబడి..
ఆక్వా సాగులో 100 కౌంట్ ధర గతంలో కిలోకు రూ.220 వరకు ఉండేది. ప్రస్తుతం ఆ ధర రూ.150-180 మాత్రమే. ప్రభుత్వం ఇటీవల మంత్రులతో కమిటీ వేసి ధరల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించి.. రూ.230 వరకు చెల్లించాలని నిర్ణయించింది. మార్కెట్ ఒడుదొడుకులు, ఇతర కారణాలతో రైతులకు ఆ ధర దక్కడం లేదు కదా.. అసలు పట్టుకున్న రొయ్యలను తీసుకెళ్లి ఒబ్బిడి చేస్తే చాలనే పరిస్థితికి వచ్చింది. నెల రోజుల్లో 10 వేల ఎకరాల్లోని చెరువుల్లో రొయ్యలను మధ్యలోనే పట్టుబడి చేసి అమ్ముకున్నట్లు రైతులు చెబుతున్నారు.
* మేత అరువు బంద్..
రైతులు చెరువుల వద్ద విద్యుత్తు, డీజిల్, రొయ్య పిల్లల కొనుగోలు వంటి వాటికి వెంటనే నగదు చెల్లించి ఆక్వా సాగు ప్రారంభిస్తారు. రొయ్యలకు వినియోగించే మేత, ప్రొ బయాటిక్స్ ఇతర మందులను దుకాణాల్లో పంట చేతికొచ్చిన తర్వాత చెల్లించే ఒప్పందంతో అరువుకు తేవడం, పంట అమ్మాక చెల్లిస్తారు. ప్రస్తుతం ఆక్వారంగం సంక్షోభంలోకి వెళ్లడంతో మేత దుకాణదారులు డిసెంబరు 1 నుంచి మేత, ఇతర మందులు అరువు ఇచ్చేదిలేదని రైతులకు చెప్పేశారు.
* పంట విరామం దిశగా..
ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైతులు చెరువుల్లో రొయ్య పిల్లలు వేయడం లేదు. ఈ సమయంలో హేచరీలు(రొయ్య పిల్లల తయారీ కేంద్రాలు) సీడ్కోసం పెద్దఎత్తున ఆర్డర్లు వచ్చేవని, రైతులు సాగుకు ముందుకు రాకపోవడంతో అమ్మకాలు మందగించాయి. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే వచ్చే ఏడాది మార్చినుంచి పంట విరామం చేపట్టాలని రైతులు భావిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏటా 10 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా దిగుబడి సాధిస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతుండగా.. ప్రస్తుతం కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు..
ఆక్వా సాగులో ప్రస్తుత పరిస్థితి ఎప్పుడూ లేదు. మేత, మందుల ధరలతో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. మరోవైపు వ్యాధుల విజృంభణ.. ఇలా ఎన్ని ఇబ్బందులొచ్చినా సాగు చేస్తున్నాం. ఏం జరిగిందో ఏంటో.. రెండు నెలలుగా సంక్షోభం మొదలైంది. రొయ్యలు పట్టి అమ్ముకోవడానికి నానా కష్టాలు పడాల్సివస్తోంది. దీనిపై ఓ విధానం లేకపోతే ఆక్వా సాగు మనుగడ కష్టమే.
మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు, మురమళ్ల, ఐ.పోలవరం మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు