ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు.
పురందేశ్వరిని, రామకృష్ణారెడ్డిని సత్కరిస్తున్న ముస్లిం పెద్దలు
అనపర్తి గ్రామీణం, న్యూస్టుడే: మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. అనపర్తి ఎస్ఎన్ఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన తెదేపా, భాజపా, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో అనపర్తి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, తెదేపా నేత కే.ఎస్.జవహర్, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుతో కలిసి ఆమె పాల్గొన్నారు. మూడు పార్టీల కార్యకర్తలు ఒక చోట సమావేశమైతే నరేంద్రమోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్కల్యాణ్ శక్తి కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు అనాలోచితంగా ఫ్యాను స్పీడును 151లో పెట్టేశారని, రాష్ట్రం కకావిలకంగా తయారయిందన్నారు. అప్పు, అవినీతి, అబద్ధాలను పునాదిగా చేసుకొని వైకాపా అయిదేళ్లు పాలన సాగించిందన్నారు. రూ.14 లక్షల కోట్ల అప్పు భారం రాష్ట్రంపై ఉందని, ప్రతి ఒకరిపై రూ.2 లక్షల అప్పు ఉందని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాలకు డబ్బు ఇచ్చింది మోదీయేనన్నారు. నాడు-నేడు నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులన్నారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరితో కలిసి పోటీ చేయడం అదృష్టంగా బావిస్తున్నానన్నారు. చంద్రబాబు ఆదేశాలతో భాజపాలో చేరానని, బాధతో తెలుగుదేశం పార్టీని వీడుతున్నానన్నారు. ఎన్డీఏ అభ్యర్థులుగా తాను, పురందేశ్వరి విజయం సాధిస్తే కెనాల్ రోడ్డును కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించేందుకు, రైల్వే హాల్టులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తొలుత అనపర్తి శివారు నుంచి కారు ర్యాలీగా పురందేశ్వరిని సభా వేదిక వద్దకు తీసుకువెళ్లారు. ఎన్టీఆర్, మూలారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెదేపాకు చెందిన 20 కుటుంబాలు భాజపాలో చేరగా, పురందేశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరిని ముస్లిం పెద్దలు సత్కరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2.50 లక్షల మందికి పెంచిన పింఛను అందిస్తాం
[ 08-05-2024]
కూటమి ప్రభుత్వం రాగానే సూపర్ సిక్స్ పథకాలు, మ్యానిఫెస్టో అమలు చేసి అభివృద్ధి, సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెబుతామని కూటమి అమలాపురం ఎంపీ అభ్యర్థి, దివంగత లోక్సభ సభాపతి జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్ చెప్పారు. -
ఆయుష్ తీసేసిన జగన్!
[ 08-05-2024]
ప్రతి పీహెచ్సీ పరిధిలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హోమియో, ఆయుర్వేదం, యునాని విభాగాల్లో ఏదో ఒక దానిని ఏర్పాటు చేసి గతంలో వైద్యులు, సిబ్బందిని నియమించారు. -
భరోసాకు విలువలేదు.. బరకమూ ఇవ్వలేదు..
[ 08-05-2024]
మాది రైతు ప్రభుత్వం. వారికి అన్ని విధాలుగా మేలు చేసేందుకే రైతు భరోసా కేంద్రాలు తెస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు తదితర అన్ని రకాల సేవలు అందిస్తాం. -
‘స్వతంత్ర’ కుతంత్రం..!
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ పక్క ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తుంటే.. మరోపక్క స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు చీల్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
రైతును నాశనం చేశారయ్యో!
[ 08-05-2024]
డాలర్ల పంటను దయనీయ స్థితికి తెచ్చారు. మేత ధరలను నియంత్రించరు.. రొయ్య ధరలు పతనమైనా పట్టించుకోరు.. విద్యుత్తు రాయితీలోనూ కోతకోస్తారు.. ఇదీ వైకాపా సర్కారు పాలనలో ఆక్వా రైతు అవస్థ. -
బ్యాలట్ ఓటింగ్ సమాచార లోపంపై ఉద్యోగుల ఆగ్రహం
[ 08-05-2024]
గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో రెండో రోజు మంగళవారం కూడా ఆర్వో కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే నియోజకవర్గంలో ఉద్యోగులకు సోమవారం మధ్యాహ్నం స్థానిక బీఆర్ అంబేడ్కర్ బాలిక గురుకుల పాఠశాలలో పోస్టల్ బ్యాలట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. -
హజ్ యాత్రకు వెళ్లేవారికి వ్యాక్సినేషన్
[ 08-05-2024]
హజ్ యాత్రకు వెళ్లేవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమహేంద్రవరం జీజీహెచ్లోని ఎంసీహెచ్ భవనంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. -
మృతుల కుటుంబాల రోదన జగన్ చెవికెక్కని వేదన
[ 08-05-2024]
మృతుల కుటుంబాలపైనా ముఖ్యమంత్రి జగన్ దయ చూపలేదు. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఎస్ఆర్ బీమా పథకం బాధిత కుటుంబాలకు ఆసరా కల్పించలేకపోయింది. దురదృష్టవశాత్తూ సాధారణ, ప్రమాద మరణాలు పొందిన వారి కుటుంబాలకు సకాలంలో బీమా పరిహారం చెల్లించకుండా నరకం చూపించారు. -
ఏదో జరుగుతోంది..!
[ 08-05-2024]
కాకినాడ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల జారీలో ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల విధుల శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తులు అందజేసినా జాబితాలో పేర్లు గల్లంతు కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
జనాలకు జగన్ గండం
[ 08-05-2024]
ముఖ్యమంత్రి సభ అంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో మంగళవారం మేమంతా సిద్ధం సభ జరిగింది. ఈ నేపథ్యంలో కోరుకొండ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. -
ముంపు శాపం.. ఇది వైకాపా పాపం
[ 08-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో నగరంలో మూడు ప్రాణాలు కాలువల్లోనే కలిసిపోయాయి. చారిత్రక నగరిలో చినుకుపడితే కొన్ని గంటలపాటు జనం జల దిగ్బంధమే. ఏటా ముంపు ముంచెత్తుతున్నా.. ప్రాణాలు కాలువల్లో కలిసిపోతున్నా.. పాలకులకు మాత్రం పట్టదు. -
ఇసుకను ఎంతైనా మింగేసారు.. ఇసుమంతైనా సమస్య కనరు
[ 08-05-2024]
ఒకపక్క మురుగు.. మరోవైపు ప్రాణాంతక ప్లాస్టిక్.. ఇంకోవైపు పారిశ్రామిక మలినాలు.. వీటికి తోడు తీరం వెంబడి ఉండే పల్లెల వ్యర్థాలు.. వెరసి గోదారమ్మ గొంతు గరళంతో నిండుతోంది. -
కొందరికే పోస్టల్ బ్యాలెట్..
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కొందరు ఉద్యోగులకు దక్కడంలేదు. ఫారం-12 సమర్పించినా జాబితాలో పేర్లు లేకపోవడంతో రెండోరోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్