ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా..
గెలుపు కోసం వైకాపా నేతల హామీల బాకాలు
కాకినాడ-రాజమహేంద్రవరం కలిపేస్తారట..
‘‘కాకినాడ, రాజమహేంద్రవరం లను జంట నగరాలైన హైదరాబాద్- సికింద్రాబాద్లా ఎందుకు కలపకూడదండీ.. రోడ్లు, వంతెనలు అభివృద్ధి చేసి జంట నగరాలు చేసేస్తాం... నా ఆస్తి అమ్మయినా సరే మోరంపూడి పై వంతెన పూర్తిచేస్తానని చెబుతున్నా. (రాజమహేంద్రవరం నగర వైకాపా అభ్యర్థి, ఎంపీ మార్గాని భరత్ హామీలివి)
400 గ్రామాలకు రూ.400 కోట్లు ఇస్తారట..
‘‘కాకినాడ పార్లమెంటు పరిధిలో 400 గ్రామాలు దత్తత తీసుకుంటా.. రాబోయే అయిదేళ్లలో ఒక్కో గ్రామానికి రూ.కోటి చొప్పున రూ.400 కోట్లు ఖర్చుచేసి అభివృద్ధి చేస్తా.. నిరుద్యోగ యువతకు భారీ నైపుణ్య అభివృద్ధి కేంద్రం పెట్టి.. ఏటా 5 వేల నుంచి 6 వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో చేరేలా చూస్తాం. పరిశ్రమలు తీసుకొస్తా’. (కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రవచనం)
ఈనాడు, కాకినాడ: మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. గత హామీలు గుర్తుకొచ్చాయో ఏమో.. కొత్తవాటి ఊసే లేకుండా ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు. మా నాయకుడి కంటే మేమేం తక్కువా..? అనుకున్నారేమో..అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీచేస్తున్న వైకాపా అభ్యర్థులు ఎడాపెడా ఆచరణ సాధ్యంకాని హామీలు దంచేస్తున్నారు. ప్రస్తుతం కొందరు నేతల హామీలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. వీరి మాటలు వింటుంటే.. ఎవరు వెర్రివాళ్లనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.
అంతన్నారు.. ఇంతన్నారు..
రాజమహేంద్రవరం ఎంపీగా వైకాపా ఎంపీ భరత్ తన మార్కు చూపలేకపోయారు. తాజా ఎన్నికల్లో ఈ సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. హామీలు గుప్పించేస్తున్నారు. 2022 జులై 16న మాట్లాడుతూ.. వచ్చే ఏడాదికి మోరంపూడి ఫ్లై ఓవర్ పూర్తిచేస్తాం అన్నారు. మాటిచ్చి రెండేళ్లయినా పూర్తిచేయలేకపోయారు. ఇప్పుడు జంట నగరాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
ఆ లెక్కేంటో చెప్పరూ
కాకినాడ[ లోక్సభ వైకాపా అభ్యర్థి చలమలశెట్టి గతంలో ప్రజారాజ్యం, వైకాపా, తెదేపా నుంచి పోటీచేసి ఓడారు. ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తూ మ్యానిఫెస్టో తెరమీదికి తెచ్చారు. ఎంపీ నిధులు ఏటా రూ.5కోట్లకు మించి వచ్చే పరిస్థితిలేదు.. ఈయన, కుటుంబ సభ్యుల ఆస్తి అఫిడవిట్ ప్రకారం రూ.149.99 కోట్లు చూపారు. మరి అయిదేళ్లలో 400 గ్రామాలకు రూ.400 కోట్లు ఎలా ఖర్చుచేస్తారనే ప్రశ్న ఎదురవుతోంది.
స్కిల్ రాగం
వైకాపా జమానాలో రోడ్లు, వీధి దీపాలు లేవని కాకినాడ గ్రామీణంలోని ఓ ఐటీ సంస్థ వెళ్లిపోతోంది. శంకుస్థాపనలు చేసినా కదలిక లేని పారిశ్రామిక ప్రాంగణాలూ ఉన్నాయి. సవ్యంగా నడుస్తున్న స్కిల్ కేంద్రాలపై బురద జల్లి.. ఇప్పుడు కొత్తగా వీరు స్కిల్ రాగం వినిపిస్తున్నారు. రూ.500 కోట్లతో సైన్స్ ఎంటర్, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాజెక్టులే అయిదేళ్లలో ఈ ప్రభుత్వం చేయలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2.50 లక్షల మందికి పెంచిన పింఛను అందిస్తాం
[ 08-05-2024]
కూటమి ప్రభుత్వం రాగానే సూపర్ సిక్స్ పథకాలు, మ్యానిఫెస్టో అమలు చేసి అభివృద్ధి, సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెబుతామని కూటమి అమలాపురం ఎంపీ అభ్యర్థి, దివంగత లోక్సభ సభాపతి జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్ చెప్పారు. -
ఆయుష్ తీసేసిన జగన్!
[ 08-05-2024]
ప్రతి పీహెచ్సీ పరిధిలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హోమియో, ఆయుర్వేదం, యునాని విభాగాల్లో ఏదో ఒక దానిని ఏర్పాటు చేసి గతంలో వైద్యులు, సిబ్బందిని నియమించారు. -
భరోసాకు విలువలేదు.. బరకమూ ఇవ్వలేదు..
[ 08-05-2024]
మాది రైతు ప్రభుత్వం. వారికి అన్ని విధాలుగా మేలు చేసేందుకే రైతు భరోసా కేంద్రాలు తెస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు తదితర అన్ని రకాల సేవలు అందిస్తాం. -
‘స్వతంత్ర’ కుతంత్రం..!
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ పక్క ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తుంటే.. మరోపక్క స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు చీల్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
రైతును నాశనం చేశారయ్యో!
[ 08-05-2024]
డాలర్ల పంటను దయనీయ స్థితికి తెచ్చారు. మేత ధరలను నియంత్రించరు.. రొయ్య ధరలు పతనమైనా పట్టించుకోరు.. విద్యుత్తు రాయితీలోనూ కోతకోస్తారు.. ఇదీ వైకాపా సర్కారు పాలనలో ఆక్వా రైతు అవస్థ. -
బ్యాలట్ ఓటింగ్ సమాచార లోపంపై ఉద్యోగుల ఆగ్రహం
[ 08-05-2024]
గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో రెండో రోజు మంగళవారం కూడా ఆర్వో కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే నియోజకవర్గంలో ఉద్యోగులకు సోమవారం మధ్యాహ్నం స్థానిక బీఆర్ అంబేడ్కర్ బాలిక గురుకుల పాఠశాలలో పోస్టల్ బ్యాలట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. -
హజ్ యాత్రకు వెళ్లేవారికి వ్యాక్సినేషన్
[ 08-05-2024]
హజ్ యాత్రకు వెళ్లేవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమహేంద్రవరం జీజీహెచ్లోని ఎంసీహెచ్ భవనంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. -
మృతుల కుటుంబాల రోదన జగన్ చెవికెక్కని వేదన
[ 08-05-2024]
మృతుల కుటుంబాలపైనా ముఖ్యమంత్రి జగన్ దయ చూపలేదు. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఎస్ఆర్ బీమా పథకం బాధిత కుటుంబాలకు ఆసరా కల్పించలేకపోయింది. దురదృష్టవశాత్తూ సాధారణ, ప్రమాద మరణాలు పొందిన వారి కుటుంబాలకు సకాలంలో బీమా పరిహారం చెల్లించకుండా నరకం చూపించారు. -
ఏదో జరుగుతోంది..!
[ 08-05-2024]
కాకినాడ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల జారీలో ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల విధుల శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తులు అందజేసినా జాబితాలో పేర్లు గల్లంతు కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
జనాలకు జగన్ గండం
[ 08-05-2024]
ముఖ్యమంత్రి సభ అంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో మంగళవారం మేమంతా సిద్ధం సభ జరిగింది. ఈ నేపథ్యంలో కోరుకొండ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. -
ముంపు శాపం.. ఇది వైకాపా పాపం
[ 08-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో నగరంలో మూడు ప్రాణాలు కాలువల్లోనే కలిసిపోయాయి. చారిత్రక నగరిలో చినుకుపడితే కొన్ని గంటలపాటు జనం జల దిగ్బంధమే. ఏటా ముంపు ముంచెత్తుతున్నా.. ప్రాణాలు కాలువల్లో కలిసిపోతున్నా.. పాలకులకు మాత్రం పట్టదు. -
ఇసుకను ఎంతైనా మింగేసారు.. ఇసుమంతైనా సమస్య కనరు
[ 08-05-2024]
ఒకపక్క మురుగు.. మరోవైపు ప్రాణాంతక ప్లాస్టిక్.. ఇంకోవైపు పారిశ్రామిక మలినాలు.. వీటికి తోడు తీరం వెంబడి ఉండే పల్లెల వ్యర్థాలు.. వెరసి గోదారమ్మ గొంతు గరళంతో నిండుతోంది. -
కొందరికే పోస్టల్ బ్యాలెట్..
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కొందరు ఉద్యోగులకు దక్కడంలేదు. ఫారం-12 సమర్పించినా జాబితాలో పేర్లు లేకపోవడంతో రెండోరోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు