89 ఆమోదం.. 44 తిరస్కరణ
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది.
నామపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి
కలెక్టరేట్లో నామపత్రాలు పరిశీలిస్తున్న కలెక్టర్ మాధవీలత, ఎన్నికల పరిశీలకుడు బాలసుబ్రహ్మణ్యం
రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి ఆయా రాజకీయ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామపత్రాలను పరిశీలించారు. పార్లమెంట్, అసెంబ్లీకి సంబంధించి మొత్తం 89 నామపత్రాలను ఆమోదించగా 44 తిరస్కరించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియను కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ నిర్వహించగా సాధారణ ఎన్నికల పరిశీలకుడు కె.బాలసుబ్రహ్మణ్యం పరిశీలించారు. వీటిల్లో సక్రమంగా ఉన్న 12 నామినేషన్లను ఆమోదించగా ఏడు తిరస్కరించారు. డమ్మీగా దాఖలు చేసినవి, దరఖాస్తులో వివరాలు తప్పుగా ఉండటం, సంతకాలు లేకపోవడం, అఫిడవిట్లు సమర్పించకపోవడం తదితర కారణాలలో వీటిని తిరస్కరించారు. ఇందుకు గల కారణాలు ఆయా అభ్యర్థులకు తెలియజేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఎంపీ స్థానానికి ఆమోదం: దగ్గుబాటి పురందేశ్వరి (భాజపా), గూడూరి శ్రీనివాస్ (వైకాపా), గణేశ్వరరావు (బీఎస్పీ), గిడుగు రుద్రరాజు (కాంగ్రెస్), బత్తుల బలరామకృష్ణ (నవరంగ కాంగ్రెస్), మేడా శ్రీనివాసరావు (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్), మోహనరావు శింగులూరి (జైభారత్ నేషనల్ పార్టీ), స్వతంత్ర అభ్యర్థులు జల్లి బాలనవీన, బొమ్మనబోయిన వి.ఎస్.ఆర్.మూర్తి, భానుచందర్ కురువెళ్ల, మెడిసి రత్నారావు అలియాస్ వినయ్, సాళోపంతుల రాఘవేంద్రరావు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2.50 లక్షల మందికి పెంచిన పింఛను అందిస్తాం
[ 08-05-2024]
కూటమి ప్రభుత్వం రాగానే సూపర్ సిక్స్ పథకాలు, మ్యానిఫెస్టో అమలు చేసి అభివృద్ధి, సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెబుతామని కూటమి అమలాపురం ఎంపీ అభ్యర్థి, దివంగత లోక్సభ సభాపతి జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్ చెప్పారు. -
ఆయుష్ తీసేసిన జగన్!
[ 08-05-2024]
ప్రతి పీహెచ్సీ పరిధిలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హోమియో, ఆయుర్వేదం, యునాని విభాగాల్లో ఏదో ఒక దానిని ఏర్పాటు చేసి గతంలో వైద్యులు, సిబ్బందిని నియమించారు. -
భరోసాకు విలువలేదు.. బరకమూ ఇవ్వలేదు..
[ 08-05-2024]
మాది రైతు ప్రభుత్వం. వారికి అన్ని విధాలుగా మేలు చేసేందుకే రైతు భరోసా కేంద్రాలు తెస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు తదితర అన్ని రకాల సేవలు అందిస్తాం. -
‘స్వతంత్ర’ కుతంత్రం..!
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ పక్క ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తుంటే.. మరోపక్క స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు చీల్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
రైతును నాశనం చేశారయ్యో!
[ 08-05-2024]
డాలర్ల పంటను దయనీయ స్థితికి తెచ్చారు. మేత ధరలను నియంత్రించరు.. రొయ్య ధరలు పతనమైనా పట్టించుకోరు.. విద్యుత్తు రాయితీలోనూ కోతకోస్తారు.. ఇదీ వైకాపా సర్కారు పాలనలో ఆక్వా రైతు అవస్థ. -
బ్యాలట్ ఓటింగ్ సమాచార లోపంపై ఉద్యోగుల ఆగ్రహం
[ 08-05-2024]
గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో రెండో రోజు మంగళవారం కూడా ఆర్వో కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే నియోజకవర్గంలో ఉద్యోగులకు సోమవారం మధ్యాహ్నం స్థానిక బీఆర్ అంబేడ్కర్ బాలిక గురుకుల పాఠశాలలో పోస్టల్ బ్యాలట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. -
హజ్ యాత్రకు వెళ్లేవారికి వ్యాక్సినేషన్
[ 08-05-2024]
హజ్ యాత్రకు వెళ్లేవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమహేంద్రవరం జీజీహెచ్లోని ఎంసీహెచ్ భవనంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. -
మృతుల కుటుంబాల రోదన జగన్ చెవికెక్కని వేదన
[ 08-05-2024]
మృతుల కుటుంబాలపైనా ముఖ్యమంత్రి జగన్ దయ చూపలేదు. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఎస్ఆర్ బీమా పథకం బాధిత కుటుంబాలకు ఆసరా కల్పించలేకపోయింది. దురదృష్టవశాత్తూ సాధారణ, ప్రమాద మరణాలు పొందిన వారి కుటుంబాలకు సకాలంలో బీమా పరిహారం చెల్లించకుండా నరకం చూపించారు. -
ఏదో జరుగుతోంది..!
[ 08-05-2024]
కాకినాడ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల జారీలో ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల విధుల శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తులు అందజేసినా జాబితాలో పేర్లు గల్లంతు కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
జనాలకు జగన్ గండం
[ 08-05-2024]
ముఖ్యమంత్రి సభ అంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో మంగళవారం మేమంతా సిద్ధం సభ జరిగింది. ఈ నేపథ్యంలో కోరుకొండ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. -
ముంపు శాపం.. ఇది వైకాపా పాపం
[ 08-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో నగరంలో మూడు ప్రాణాలు కాలువల్లోనే కలిసిపోయాయి. చారిత్రక నగరిలో చినుకుపడితే కొన్ని గంటలపాటు జనం జల దిగ్బంధమే. ఏటా ముంపు ముంచెత్తుతున్నా.. ప్రాణాలు కాలువల్లో కలిసిపోతున్నా.. పాలకులకు మాత్రం పట్టదు. -
ఇసుకను ఎంతైనా మింగేసారు.. ఇసుమంతైనా సమస్య కనరు
[ 08-05-2024]
ఒకపక్క మురుగు.. మరోవైపు ప్రాణాంతక ప్లాస్టిక్.. ఇంకోవైపు పారిశ్రామిక మలినాలు.. వీటికి తోడు తీరం వెంబడి ఉండే పల్లెల వ్యర్థాలు.. వెరసి గోదారమ్మ గొంతు గరళంతో నిండుతోంది. -
కొందరికే పోస్టల్ బ్యాలెట్..
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కొందరు ఉద్యోగులకు దక్కడంలేదు. ఫారం-12 సమర్పించినా జాబితాలో పేర్లు లేకపోవడంతో రెండోరోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
Japan: జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్