అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కూటమి అభ్యర్థులను పోలిన పేర్లున్నవారితో నామపత్రాలు
ఇదంతా వైకాపా పన్నాగమేనని విపక్షాల ఆరోపణలు
చివరి రోజు గురువారం అమలాపురం అసెంబ్లీకి అధికంగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం వెనక అధికార పార్టీ ప్రోద్బలం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనందబాబు వెంట మంత్రి విశ్వరూప్ అనుచరుడు శ్రవణ్తోపాటు వైకాపా నేతలే నామినేషన్ సమయంలో ఉండటం ఆ పార్టీ వ్యూహాన్ని బయటపెడుతోందని చర్చించుకుంటున్నారు.
నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనందబాబు వెంట మంత్రి విశ్వరూప్ అనుచరుడు శ్రవణ్
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్, గ్రామీణం: ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. అయిదేళ్లపాటు నిరంకుశ పాలన అందించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైకాపా నాయకులు అధికారమే లక్ష్యంగా ఏయే మార్గాల్లో లబ్ధిపొందవచ్చో.. అన్ని మార్గాలను ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. అందుకు ఉదాహరణగా గురువారంతో ముగిసిన నామినేషన్ల తీరునే పేర్కొంటున్నారు.
పి.గన్నవరంలో..
ఈ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ బరిలో నిలిచారు. ఓటర్లను ఏమార్చేందుకు కాట్రేనికోన మండలం వేట్లపాలెం గ్రామానికి చెందిన గిడ్డి సత్యనారాయణ అనే పేరున్న వ్యక్తిని జాతీయ జనసేన పార్టీనుంచి ఇక్కడ నామినేషన్ వేయించారు.
కొత్తపేటలో అన్నదమ్ముల పేర్లతో..
కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన తమ్ముడు బండారు శ్రీనివాసరావు జనసేన తరఫున బరిలో నిలిచారు. ఓటర్లను తికమక పెట్టేందుకు బండారు శ్రీనివాసరావు అనే పేరున్న వ్యక్తిని నవరంగ కాంగ్రెస్ పార్టీనుంచి బరిలో నిలిపారు. బండారు శ్రీనివాసరావు వర్గాన్ని అయోమయానికి గురి చేయడమే వీరి ప్రధాన ఉద్దేశమని విపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఓటర్లను తికమక పెట్టేందుకేనా..!
కోనసీమ జిల్లావ్యాప్తంగా కూటమి అభ్యర్థుల్లో ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి పోటీ చేసేవారి పేర్లను పోలి ఉన్నవారిని.. పలు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించి ఓటర్లను తికమక పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం ద్వారా ప్రతిపక్ష ఓట్లను చీల్చి, తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశం అధికార పార్టీ నాయకుల్లో కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అమలాపురంలో అమలు..
అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూటమి తరఫున తెదేపా అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు ఎన్నికల బరిలో నిలిచారు. ఇదే పేరుతో ఉన్న కపిలేశ్వరపురం మండలానికి చెందిన వ్యక్తిని స్వతంత్ర అభ్యర్థిగా అధికార పార్టీ నాయకులు బరిలో నిలిపారు. నవరంగ కాంగ్రెస్ పార్టీ తరపున అయితాబత్తుల ఆనందబాబు అనే మరో అభ్యర్థినీ పోటీలో ఉంచారు.
ఈవీఎంలలో వరుస క్రమంలో పేర్లు
ఈవీఎంలలో తెలుగు అక్షరమాల ప్రకారం అభ్యర్థి పేరులో ఉన్న మొదటి అక్షరం ఆధారంగా వరుస క్రమం నిర్వహిస్తారు. ఈ లెక్కన ఒకే పేరున్న అభ్యర్థులు పోటీలో ఉంటే.. వారి పేర్లు ఒకదాని తరువాత ఒకటి వచ్చే అవకాశాలు ఎక్కువ. పేరు ప్రకారం చూస్తే.. ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వారంటున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల పేర్లతో పోలిఉన్న అభ్యర్థులతో నామినేషన్లు వేయించడమనేది పక్కా ప్రణాళిక ప్రకారం చేశారనే వాదన అన్ని నియోజకవర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. వైకాపా జిల్లా ఇన్ఛార్జి మిధున్రెడ్డి సూచనల మేరకే ఈ తరహా కుట్రలకు తెరతీశారని విపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలుజేయాలని చూస్తున్నారు: పవన్పై మండిపడ్డ ముద్రగడ
[ 07-05-2024]
‘ఇటీవల మా కుటుంబంలో చిన్న చిచ్చు రేగిన సంగతి బాధాకరం. అయినా భయపడను. ఎలాగూ నా కుమార్తెను రోడ్డుపైకి లాగారు. ఆమెతో ఇంటర్వ్యూలు ఇప్పించడం, స్టూడియోలకు పంపించి డిబేట్లలో పాల్గొనేటట్లు చేయడం.. -
నమో గోదారి.. తెలుగు జనఝరి
[ 07-05-2024]
వేదంలా ఘోషించే తీరాన.. జన గోదావరి పరవళ్లు తొక్కింది. ప్రజాకంటక వైకాపా పాలనపై కూటమి సమర నినాదం మోగించింది. దక్షిణ గంగ పరవళ్లు తొక్కే రాజమహేంద్రిలో ప్రజాగళమై గర్జించింది. -
జనగళం జయభేరి
[ 07-05-2024]
మూడు పార్టీల జట్టు.. సమర భేరి మోగించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన ప్రజాగళం సభకు కూటమి దళం కదం తొక్కింది. ఒకవైపు భాజపా శ్రేణులు.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు.. ఇంకోవైపు జన సైనికులు.. -
గజిబిజి.. గందరగోళం
[ 07-05-2024]
జిల్లాలో సోమవారం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ అంతా గజిబిజి.. గందరగోళంగా మారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద కొందరు ఉద్యోగులు ఓటు వినియోగించుకోలేని పరిస్థితిలో వెనుతిరగాల్సి వచ్చింది. -
ఇసుకంతా తోడేస్తున్నా.. ఇంకెన్నాళ్లు నిద్ర నటిస్తారు?
[ 07-05-2024]
గోదావరి నదీగర్భంలో యంత్రాలను దించి పర్యావరణానికి విఘాతం కలిగించే ఇసుక తవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినా మనలను కాదులే అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు. -
రూ.66 కోట్లు ఎక్కడ జగన్?
[ 07-05-2024]
విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 98 కి.మీ, పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు 45 కి.మీ. మేర ఏటిగట్లు ఉంది. మొత్తం 143 కి.మీ. పొడవున వశిష్ట కుడిగట్టు ఉంది. -
బీసీలపై కక్ష.. కోతలతో శిక్ష
[ 07-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలనలో వెనకబడిన తరగతుల నడ్డివిరిచారు. రాయితీ రుణాలు నిలిపివేసి స్వయం ఉపాధికి ముగింపు పలికారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నంత కాలం బీసీల స్వయం సమృద్ధికి పెద్దపీట వేశారు. -
నేడు ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 07-05-2024]
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు వ్యయప్రయాసలకోర్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, గంటల తరబడి వరుసలో నిల్చుని ఇబ్బందిపడేవారు. -
తీరంలో ఇసుక దొంగలు
[ 07-05-2024]
సముద్ర తీరంలో ఇసుక దందా ఆగడం లేదు. సీఆర్జెడ్ పరిధిలోనూ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పక్ష నాయకుల అండదండలతోనే ఈ దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైకాపా నాయకులు చెబితేనే జీతాలిస్తారా!
[ 07-05-2024]
రాజీనామాలు చేసి మేము చెప్పినట్లుగా ప్రచారంలోకి వస్తేనే అన్ని సవ్యంగా మీకు ఉంటాయి.. జీతాలు కూడా పడతాయంటూ వైకాపా నాయకుల ఆదేశాలతో రాజీనామా పత్రాలిచ్చేసిన వారిలో కొంతమందికి జీతాలు పడడం చర్చనీయాంశంగా మారింది. -
ఈసారి గెలిపిస్తే చేస్తారట.. ఈ అయిదేళ్లూ ఏం చేశారో..
[ 07-05-2024]
అయిదేళ్లు ఎంపీగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు.. గతంలో ఎప్పుడూ చూడనంతగా నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకొన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రమాణాలు చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రామ్. -
వీధి వీధినా వెతలు.. పట్టించుకునేదెవరు..
[ 07-05-2024]
నగరంలోని 25వ డివిజన్లో ఎటుచూసినా సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా మారడం, కాలువలపై స్లాబులు లేకపోవడం, తాగునీటి కొళాయిల లీకేజీ, పేరుకుపోయిన చెత్త, -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 07-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద సోమవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇక్కడి పట్టాలు(ట్రాక్) సమస్యే దీనికి కారణంగా తెలుస్తుంది. -
చంద్రన్న మాటే మాదిగలకు బాట
[ 07-05-2024]
వైకాపా పాలనలో దళితులను హింసించిన, హత్యలు చేసిన వారిపై కూటమి అధికారంలోకి రాగానే కమిటీ వేసి శిక్షించాలని రాష్ట్ర మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మిట్టా శ్రీకాంత్ కోరారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న పీవో, ఏపీవో, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఇతర సిబ్బందికి నిర్వహించిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని కలెక్టరు మాధవీలత తెలిపారు. -
పెద్దాపురంలో కడప రౌడీలు
[ 07-05-2024]
ఓటమి భయంతో ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి పోలింగ్ ముందు, ఆ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో బీభత్సం సృష్టించడానికి కడప నుంచి రౌడీలను రప్పించారని, వారతా వివిధ లాడ్జీల్లో బస చేశారని హోం శాఖ మాజీ మంత్రి, తెదేపా,
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి