పాలకులారా.. పట్టించుకోండి
మలికిపురం మండలంలో కేశనపల్లి, గొల్లపాలెం, తూర్పుపాలెం, పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, గూడపల్లి, గుబ్బలపాలెం, జి.పల్లిపాలెం సముద్ర తీర గ్రామాల్లో ప్రజలకు కొబ్బరి, సరుగుడు పంటలే ఆధారం.
కేశనపల్లిలో ఉప్పు నీరు వల్ల చనిపోయిన కొబ్బరి చెట్లు
న్యూస్టుడే, మలికిపురం: మలికిపురం మండలంలో కేశనపల్లి, గొల్లపాలెం, తూర్పుపాలెం, పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, గూడపల్లి, గుబ్బలపాలెం, జి.పల్లిపాలెం సముద్ర తీర గ్రామాల్లో ప్రజలకు కొబ్బరి, సరుగుడు పంటలే ఆధారం. ఇప్పుడు అక్కడ కొబ్బరి చెట్లు అంతరించిపోయే ప్రమాదం వచ్చింది. ఈ గ్రామాల్లోని శంకరగుప్తం మేజరు డ్రెయిన్ వెంట ఇరువైపులా ఉన్న వేల కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. రెండేళ్ల నుంచి ఆటు, పోట్ల సమయంలో డ్రెయినులోని నీరు గట్టుపైకి చేరి తోటల్లోకి ప్రవేశించి అక్కడ ముంపుగా ఉండిపోతోంది. ఇదంతా ఉప్పు నీరవ్వడం నిల్వ ఉన్న నీటి వల్ల కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. చెట్ల స్థానంలో మళ్లీ పాతిన కొబ్బరి మొక్కలు కూడా దెబ్బతింటున్నాయి. ఉప్పు నీటి ప్రభావంతో ఈ ప్రాంతమంతా మాడి మసై పోతోందని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సరుగుడు చెట్లు కూడా చచ్చిపోతున్నాయి. తీరంలో కొబ్బరి, సరుగుడు పంటపైనే ఆధార పడిన ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని వాపోతున్నారు.
ఎందుకిలా జరుగుతోంది..
నాలుగైదు సంవత్సరాల క్రితం శంకరగుప్తం మేజరు డ్రెయినుకు కేశనపల్లి నుంచి కరవాక వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగు పనులతో మెరకలు తొలగించి, వెడల్పు చేసి మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి డ్రెయినులోని నీరు గట్టుపైకి చేరి తోటల్లోకి ప్రవేశిస్తున్నట్టు రైతుల వాదనగా ఉంది. డ్రెయినులో ప్రవహించే నీటిని తీసుకుని శంకరగుప్తం డ్రెయిను వైనతేయ నదిలో కలుస్తుంది. పోటు సమయంలో నదిలోని ఉప్పు నీరు(నది సాగర సంగమ ప్రాంతమవ్వడంతో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది) ఎక్కువగా డ్రెయినులోకి వెనక్కి ప్రవహించి గట్లు మునిగిపోయి ఆ నీరు కొబ్బరి తోటల్లోకి వస్తోందని రైతులు చెబుతున్నారు.
* గతంలో శంకరగుప్తం డ్రెయినులో పూడికలు తొలగిస్తూ డ్రెడ్జింగు పనులు చేసి లోతు చేశారు. కానీ డ్రెయిను నదిలో కలిసే చోట మాత్రం పూడికలు తొలగించలేదు. ఫలితంగానీరు నదిలోకి పారడం లేదని, నదిలోని నీరే డ్రెయినులోకి వస్తోందని రైతులు చెబుతున్నారు. రూ.కోట్లు పెట్టి డ్రెడ్జింగ్ పనులు చేసినా ఉపయోగం లేదు సరికదా నష్టం జరుగుతోందంటున్నారు. డ్రెయినులోని మురుగు నీరు చింతలమోరి-కేశవదాసుపాలెం వద్ద స్ట్రెయిట్కట్లోకి వెళ్లేలా నిర్మితమైన స్లూయిస్ పూర్తిగా శిథిలమైంది. అక్కడి స్ట్రెయిట్కట్ కూడా పూడిపోయి పని చేయని పరిస్థితుల్లో డ్రెయినులోని నీరు వైనతేయలోకి చేరుతోంది. చింతలమోరి వద్ద స్లూయిస్ స్థానే నూతన స్లూయిస్ను నిర్మించి స్ట్రెయిట్కట్ను కూడా సరి చేస్తే ప్రయోజనం ఉంటుందని ఇక్కడి రైతులు అంటున్నారు.
రూ.2 కోట్లన్నారు.. ఏవీ..
రైతులు మొర పెట్టుకోవడంతో గత ఏడాది నవంబరు నెలలో జిల్లా కలెక్టరు ఈ ప్రాంతంలో పర్యటించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. పరిస్థితిని సమీక్షించి కారణాలు తెలుసుకున్నారు. అనంతరం తీరంలో ఉప్పు నీటి సమస్య పరిష్కరించడానికి శంకరగుప్తం మేజరు డ్రెయినుకు ఇరువైపులా గట్టు ఎత్తు పెంచి పటిష్టం చేయడానికి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధులు వస్తాయి.. గట్టు ఎత్తు పెంచి పటిష్టం చేస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు గట్టును పటిష్టం చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టలేదు.
తీర ప్రాంతం బీడు భూములుగా..
కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో కూనవరం స్ట్రెయిట్కట్, డ్రెయిన్ సమస్య వల్ల ఇక్కడ కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి ఖరీఫ్ సాగుకు అంతరాయం ఏర్పడుతోంది. కొబ్బరి తోటలు చచ్చిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాంతంలో కూడా కలెక్టరు పర్యటించారు. స్ట్రెయిట్కట్ డ్రెయిను మరమ్మతులు, స్లూయిస్ల నిర్మాణాలకు సుమారు రూ.5.50 కోట్లు నిధులు మంజూరయ్యాయి.
* సఖినేటిపల్లి మండలం అంతర్వేది, అంతర్వేదిదేవస్థానం, పల్లిపాలెం, గొంది, కేశవదాసుపాలెం గ్రామాల్లో ఉప్పు నీటి ప్రభావంతో వేల ఎకరాలు బీడు భూములుగా మారిపోయిన పరిస్థితి ఉంది. సముద్రం కెరటాలతో గ్రామాల్లోకి ఉప్పు నీరు వస్తోందని ఇక్కడి ప్రజలు, రైతులు ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి తీర ప్రాంతం బీళ్లుగా మారిపోయే దుస్థితి దాపురించింది. పరిష్కార మార్గాలు అన్వేషించకపోతే భవిష్యత్తు అంధకారమే..!
నిధుల మంజూరు ఉత్తర్వులు రావాల్సి ఉంది
- ఆర్.నాగార్జున, డీఈఈ, జలవనరుల శాఖ (డ్రెయిన్స్ విభాగం)
శంకరగుప్తం మేజరు డ్రెయిను గట్టు పటిష్టతకు సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.2 కోట్లు కేటాయించారు.. వీటికి ఉన్నతాధికారుల నుంచి మంజూరు ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఉత్తర్వులు వచ్చిన వెంటనే మరమ్మతులకు కార్యాచరణ చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ