తెలియకుండా బాదేస్తున్నారు..
వాడిన విద్యుత్తు కొంత... భారం కొండంత. వినియోగించినది కాకుండా మూడు అదనపు భారాలు. నెలవారీ విద్యుత్తు బిల్లులు చూసి జనం గగ్గోలు పెడుతున్నారు.
యూనిట్కు రూ.1.10 అదనపు విద్యుత్తు ఛార్జీలు
వాడిన విద్యుత్తు కొంత... భారం కొండంత. వినియోగించినది కాకుండా మూడు అదనపు భారాలు. నెలవారీ విద్యుత్తు బిల్లులు చూసి జనం గగ్గోలు పెడుతున్నారు. ట్రూఅప్... ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటూ వ్యాపారులు.. గృహ వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 18.76 లక్షల మందిపై అదనపు ఛార్జీల భారం పడుతుంది.
ఇటీవల కాలంలో వస్తున్న విద్యుత్తు బిల్లులు చూసి వినియోగదారులు షాక్కు గురవుతున్నారు. వినియోగించిన విద్యుత్తు బిల్లుతోపాటు అదనంగా యూనిట్కు రూ.1.10 భారం వేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యుత్తు ఛార్జీలు పెంచడంతోపాటు గతంలో వినియోగించిన దానిపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వినియోగదారులపై మూడు రకాలుగా అదనపు చార్జీల భారం పడుతోంది. -న్యూస్టుడే, దేవీచౌక్(రాజమహేంద్రవరం)
మూడు రకాల మోత
- 2014-19 సంవత్సరాల్లో వినియోగించిన యూనిట్లను ఆధారంగా చేసుకుని ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఆగస్టు 2022 నుంచి జనవరి 2024 వరకు వసూలు చేస్తున్నారు.
- దీంతోపాటు 2021-22 సంవత్సరంలో విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి ఎఫ్పీపీసీఏ(ఇంధన సర్దుబాటు ఛార్జీలు) భారం ఈ ఏడాది మే నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వినియోగదారులు మోయాల్సి వస్తోంది.
- ఈ ఏడాది జూన్ నుంచి ఎఫ్పీపీసీఏ-2 యూనిట్కు నలభై పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది ఎప్పటి వరకు వసూలు చేస్తారనేది అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.
సర్దుబాటు భారం పెరిగి..
ఈ మూడు వెరసి ఇటీవల వస్తున్న విద్యుత్తు బిల్లులు గతంలో కంటే రెట్టింపు ఉంటున్నాయని వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన సర్దుబాటు ఛార్జీలు మూడు నెలలకోసారి మారుతుండటం కూడా జులై నెల నుంచి బిల్లు ఎక్కువ రావడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు 0.1975 పైసలు ఉన్న సర్దుబాటు ఛార్జి ఆగస్టు నుంచి 0.6194గా నిర్ణయించారు.
ప్రస్తుతం వసూలు చేస్తున్న వివిధ రకాల ఛార్జీలు(యూనిట్కు)
- ట్రూఅప్: ఏడు పైసలు చొప్పున (జనవరి 2024 వరకు)
- ఎఫ్పీపీసీఏ: 2023 మే, జూన్, జులై-0.1975 పైసలు
- ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు-0.6194 పైసలు,
- నవంబరు, డిసెంబరు, జనవరి-0.5652 పైసలు
- ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్-0.6455 పైసలు
- ఎఫ్పీపీసీఏ-2: 0.40 పైసలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ