ఇదేం ఉచితం.. జగనన్నా..!
విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేదలు, అభాగ్యులకు 25 శాతం సీట్లు కల్పించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చట్టం ప్రకారం ఉచిత సీట్లను రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచే కేటాయిస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు సీట్లు
‘అమ్మఒడి’ నుంచి ఫీజు వసూలు
న్యూస్టుడే, కాకినాడ నగరం: విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేదలు, అభాగ్యులకు 25 శాతం సీట్లు కల్పించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చట్టం ప్రకారం ఉచిత సీట్లను రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచే కేటాయిస్తున్నారు. ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, రాష్ట్ర సిలబస్ బోధించే ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. వాస్తవానికి ఈ చట్టం కింద చేరే పిల్లలకు బోధనా రుసుములు (ఫీజు) ప్రభుత్వమే చెల్లించాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో మార్గం సూచించింది. ‘అమ్మఒడి’ పథకం నుంచి ఫీజు తీసుకోవాలని సూచించింది. అర్బన్ ప్రాంతాల్లో రూ.8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6 వేల చొప్పున ఫీజుగా నిర్దేశించి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. అయితే ‘అమ్మఒడి’ నిధులు వచ్చేలోగా ఆయా పాఠశాలలకు తల్లిదండ్రులే ఫీజు చెల్లించాలని విద్యా శాఖ అధికారులు పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఉచిత ప్రవేశాలని చెప్పి ఫీజు వసూలు చేస్తారా అని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.
- కాకినాడ జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో 215 మందికి, 2023-24లో 1,141 మంది పిల్లలకు ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
- ఈ చట్టం కింద పేద వర్గాలకు కేటాయించాల్సిన సీట్ల భర్తీపై మార్గర్శకాలున్నాయి. వాటి ప్రకారం అనాథలు, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం, నిరుపేద ఎస్సీ పిల్లలకు 10 శాతం, ఎస్టీ చిన్నారులకు 4 శాతం, బీసీ, మైనారిటీ, ఓసీ తదితర ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలకు 6 శాతం చొప్పున సీట్లకు దరఖాస్తుల స్వీకరణ అనంతరం లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఫీజు విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. ఉచిత సీట్లని ప్రకటించినా ఆయా విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం అందించే ‘అమ్మఒడి’ సాయం నుంచే ఫీజు వసూలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడం వివాదాస్పదంగా మారింది. ఇలాగైతే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించుకుంటామని చెబుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ఏకరూప దుస్తులు, బూట్లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు అమ్మఒడి సాయం కూడా అందేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పథకంలో చేరే పిల్లలకు తల్లి లేదా తండ్రి లేకపోవడం, కొందరికి ఇద్దరూ లేకపోవడం.. ఇద్దరూ ఉంటే వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం, కొందరు సంరక్షుల వద్ద పెరగడం ఇవన్నీ ప్రతికూలతలుగా మారుతున్నాయి.
పాత బకాయిల వసూళ్లకే..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫీజుపై ఎలాంటి ఒత్తిడి లేదు. 2022-23 విద్యా సంవత్సరంలో చాలామంది ‘అమ్మఒడి’ సొమ్ము ఫీజుగా చెల్లించలేదు. ఈ కారణంగా ఆయా పాఠశాలల యజమానులు మాపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. పాత బకాయిలు చెల్లించాలని సూచిస్తున్నామే తప్ప ఎవరినీ ఒత్తిడికి గురిచేయడం లేదు.
పి.రమేష్, సమగ్ర శిక్ష ఇన్ఛార్జి ఏపీసీ, డీఈవో
తల్లిదండ్రులపై ఒత్తిడి..
ప్రభుత్వం ముందుగా ఉచిత సీట్లను ప్రకటించింది. తీరా ప్రవేశాలు కల్పించాక ‘అమ్మఒడి’ పథకంలో రూ.13 వేలు చొప్పున జమయ్యే నిధుల నుంచి కోత పెడుతోంది. అయితే చిన్నారుల తల్లి లేదా సంరక్షకుల ఖాతాలో జమవుతున్న ఈ సొమ్మును వారు తమ అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో 215 మందికి ప్రవేశాలు కల్పించగా వీరిలో సగానికిపైగా విద్యార్థులకు ఫీజు జమకాలేదు. 2023-24 విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ముగియనుంది. వీరికి ఇంకా అమ్మఒడి పథకం డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. వచ్చే జూన్ నెలలో వచ్చే అవకాశముందని సమాచారం. ఈలోగా 2024-25 విద్యా సంవత్సరంలో 25 శాతం సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రైవేటు పాఠశాలల యజమానులు ఫీజు కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా స్పందించడంతో ఫీజు బకాయిలు చెల్లించాలని తల్లిదండ్రులపై విద్యా శాఖ యంత్రాంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19 పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్