ఓడించలేమా ఒంటి చేత..!
అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా దినోత్సవం ముందురోజే వైఎస్ఆర్ చేయూత ద్వారా సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది.
ప్రభుత్వ తీరుపై అక్కచెల్లెమ్మల ఆగ్రహం
ఇటీవల వైఎస్ఆర్ ఆసరాలో నమూనా చెక్కు ఇస్తున్న వైకాపా ప్రజాప్రతినిధులు
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్: అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా దినోత్సవం ముందురోజే వైఎస్ఆర్ చేయూత ద్వారా సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. మహిళా సాధికారత పట్ల ఇంత చిత్తశుద్ధి చూపిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే మరొకటి లేదు.
- నాలుగో విడత చేయూత కార్యక్రమంలో సీఎం జగన్మోహన్రెడ్డి అన్న మాటలివి.కానీ చేయూత, ఆసరా నిధులు విడుదలకు ముఖ్యమంత్రి బటన్ నొక్కి నెలలు కావస్తున్నా ఇప్పటివరకు సుమారు 70శాతంపైగా మహిళల ఖాతాలకు జమకాలేదు. వైకాపా ప్రజాప్రతినిధులు నమూనా చెక్కులతో కార్యక్రమాలు ఆర్భాటంగా చేస్తున్నా.. నెలలు దాటుతున్నా సొమ్ము రాలేదు. హామీలు మరిచినందుకు ఓటుతో తగిన గుణపాఠం చెప్పలేమా.. అని మహిళలు అభిప్రాయపడుతున్నారు.
ఆసరా దక్కలేదు: జిల్లాలో ఆసరా పథకానికి 31,093 గ్రూపులు అర్హత సాధించాయి. వీరిలో ఇప్పటివరకు 19,553 గ్రూపులకు నిధులు విడుదల చేశారు. మొత్తం రూ.254.24 కోట్లకుగాను రూ.153.27 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇంకా సుమారు 12 వేల గ్రూపులకు రూ.100 కోట్లపైనే విడుదల కావాల్సిఉంది.
చేయూత లేదు: చేయూతకు సంబంధించి జిల్లాలో నాలుగో విడతకు 89,619 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.168.03 కోట్లు విడుదల కావాల్సిఉంది. నేటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు.
వడ్డీకి సున్నా..: జిల్లాలో సుమారు 30 వేల మహిళా సంఘాల సభ్యులకు ఏటా రూ.కోట్ల సున్నావడ్డీ రాయితీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఏటా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వడ్డీ భారం మహిళలపై మోపుతున్నారు. డ్వాక్రా మహిళలకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణమిస్తామన్న జగన్ హామీ నేటికీ అమలు కాలేదు. గత ప్రభుత్వంలో రూ.10 లక్షల వరకు ఎంత రుణం తీసుకున్నా రూ.5 లక్షల వరకు వడ్డీ రాయితీ అందించేవారు. వైకాపా రూ.3 లక్షలకు తగ్గించింది.
ఉన్నతి ఉట్టెక్కింది: గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ మహిళల ఉన్నతికి ఒక్కొక్కరికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వడ్డీలేని ఉన్నతి రుణాలిచ్చేవారు. వైకాపా పైసా కూడా కేటాయించలేదు.
అభయహస్తం దారి మళ్లింది: డ్వాక్రా సంఘాల సభ్యురాళ్లకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛను ఇచ్చేందుకు 2009లో అభయహస్తం పథకం ప్రవేశపెట్టారు. జిల్లాలో పొదుపు మహిళలు, ప్రభుత్వం వాటా కలిపి సుమారు రూ.60కోట్ల వరకు ఉంది. పొదుపు మహిళలు దాచుకున్న సొమ్ము జగన్ నవరత్నాలుకు మళ్లించారు. 11 వేల మందికి నెలకు రూ.500 మాత్రమే అభయహస్తం పింఛను అందజేస్తున్నారు. వీరికి ఒక్క రూపాయీ పెంచలేదు.
మిత్రలకు తీరని ద్రోహం: గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకంలో ఆరోగ్యమిత్రలుగా మండలానికి ఇద్దరు చొప్పున మహిళా సంఘాల్లో సభ్యులు విధులు నిర్వహించేవారు. వైకాపా అధికారంలోకి రాగానే వారిని తొలగించారు. దీంతో పలువురు మహిళలు ఉపాధికి దూరమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM