అధికార పార్టీకి డీఎస్పీ దన్ను..!
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని విభాగాల అధికారులు విధుల్లో తలమునకలై ఉన్నారు.
ఎన్నికల కమిషన్కు తెదేపా ఫిర్యాదుతో చర్చనీయాంశం
విజయ్పాల్
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే, దానవాయిపేట: ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని విభాగాల అధికారులు విధుల్లో తలమునకలై ఉన్నారు. ఈ సమయంలో నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికారుల్లో కొందరు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను ఉద్దేశపూర్వంగా ఇబ్బందులు పెడుతున్నారనే వాదన తెదేపా నుంచి వినిపిస్తోంది. ఇప్పటివరకు ఆరోపణలు చేసినప్పటికీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసిన సందర్భాలు పెద్దగా లేవు. తాజాగా రాజమహేంద్రవరం సెంట్రల్జోన్ డీఎస్పీ విజయ్పాల్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తెదేపా శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతూ స్వామిభక్తి చూపుతూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు వర్గాల్లో ఆయన వ్యవహరించే శైలి చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారులు సైతం ఆ దిశగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఏడాది క్రితమే బాధ్యతల స్వీకరణ..: రాజమహేంద్రవరం సెంట్రల్జోన్ డీఎస్పీగా విజయ్పాల్ గత ఏడాది మే 6న బాధ్యతలు స్వీకరించారు. ఈయన బాధ్యతలు చేపట్టడంలో ఎంపీ మార్గాని భరత్ చక్రం తిప్పారన్న ఆరోపణలున్నాయి. ఎన్నికల్లో రాజమహేంద్రవరం నగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండాలని ముందుగానే భరత్ నిర్ణయించుకోవడంతో ఆ దిశగా తనకు అనుకూలంగా ఉండే కొందరు పోలీసు అధికారులను నియమించారనే వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. ఏ అభివృద్ధి పని చేయాలన్నా ఎంపీ కమీషన్ వసూళ్లు చేస్తున్నారని పేర్కొంటూ ఇటీవల నగరంలో కరపత్రాలు హల్చల్ చేశాయి. ఈ సందర్భంగా తనకు ప్రతికూలంగా కరపత్రాలు ముద్రించిన వారిని పట్టుకోవాలని డీఎస్పీని ఎంపీ సూచించగా.. ఆయన ముగ్గురు సీఐలపై తీవ్ర ఒత్తిడి చేశారని పోలీసు వర్గాల్లో అప్పట్లో తీవ్రమైన చర్చ జరిగింది. అధికార పార్టీ నాయకులు ఎన్నికల సదర్భంగా కొంతకాలంగా చీరలు, ఇతర తాయిలాలు పంపిణీ చేస్తున్న విషయం విదితమే. షెడ్యూల్ విడుదలై తరువాత ఓ వ్యాన్లో తాయిలాలు వచ్చిన విషయం తెలిసినా మిన్నకుండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం తెదేపా నాయకులను ఇబ్బందులకు గురిచేసేందుకు పాతకేసులు తిరగతోడుతున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తూ, తాజాగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన
[ 18-05-2024]
తాళ్లరేవు బీమాబాయి మహిళ మండలి కార్యాలయం లో శనివారం మహిళా రక్షణ చట్టాలపై జిల్లా స్థాయి అవగాహక కార్యక్రమం జరిగింది. -
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?