జగన్ జమానాలో.. అంపశయ్యపై ఆరోగ్యశ్రీ
క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం లేదు. రూ.కోట్లల్లో బకాయిలు నెలల తరబడి ఇవ్వకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించని సర్కారు
వైద్య సేవలపై తీవ్ర ప్రభావం
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం
దేశంలో మరెక్కడా లేనట్టుగా పేదలకు వైద్య సేవలందిస్తున్నాం.. ఆరోగ్యశ్రీ పథకంలో 3,200 చికిత్సలకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నాం.. పైసా ఖర్చు చేయకుండా కార్పొరేట్ వైద్యం పొందొచ్చు
... ఇదీ వైకాపా ప్రభుత్వ పెద్దల బడాయి మాటలు
క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం లేదు. రూ.కోట్లల్లో బకాయిలు నెలల తరబడి ఇవ్వకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బకాయిల పెండింగ్ ప్రభావం రోగులకు అందించే వైద్యసేవలపై పడుతోంది. సేవలు ఆపేస్తామని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం ఆధ్వర్యంలో హెచ్చరిక లేఖలు రాస్తే కొంతమేర విడుదల చేసి మమ అనిపిస్తున్నారు. దీంతో రోగులకు పూర్తిస్థాయి సేవలందడం లేదు. కొందరికి ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి డబ్బులు చెల్లించుకోవడం.. కొందరి వద్ద పరీక్షల పేరిట అధికంగా వసూలు చేయడం.. కొన్ని న్యూరో సంబంధిత కేసులకు వర్తించదని చెప్పి ప్రభుత్వాసుపత్రులకు పంపేయడం వంటివి ఇటీవల అధికంగా జరుగుతున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లావ్యాప్తంగా ఆయా ఆసుపత్రుల పరిధిలో సుమారు రూ.100 కోట్ల వరకు ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 90 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. ఇందులో 53 ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. బకాయిలు అందకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల గురించి ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ఆర్థిక భారం పడుతోందని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు వాపోతున్నాయి.
ఇదీఆసుపత్రుల ఆవేదన ఆరోగ్య
శ్రీకి సంబంధించి ప్రతి చికిత్సకు పథకం ప్రారంభమైనప్పుడు ఎంత ప్యాకేజీ ఇచ్చారో ప్రస్తుతం కూడా అదే ఇస్తుండడంతో నిర్వహణ భారంగా ఉందని ఆయా యాజమాన్యాలు చెబుతున్నాయి. కొన్ని నెలల నుంచి బిల్లులు రాకపోవడం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఫార్మసీ, సర్జికల్ సామగ్రి, గుండెకు వేసే స్టంట్లు, ఆర్థో శస్త్రచికిత్సల్లో వేసే రాడ్లు, అంబులెన్సులు, ఉద్యోగులకు వేతనాలు అన్నీ అప్పులు చేసి నెట్టుకొస్తున్నామంటున్నారు. ఈ ప్రభావం రోగులు, వారికి అందించే సేవలపై పడుతోంది. కేంద్రం అందించే ఆయుష్మాన్ భారత్ నిధులను సైతం మళ్లించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల నుంచి రోగుల వివరాలు ప్రతి నెలా అందజేయాలని ఆదేశిస్తోంది.
జరుగుతోందిలా..
గతంలో ఆసుపత్రులకు ప్రతి మూడు నెలలకు బకాయిలు విడుదలయ్యేవి. ప్రస్తుతం స్వల్ప మొత్తంలో ఇటీవల ఒక 20 శాతం బకాయి వేయడం మినహా సుమారు ఏడు నెలల నుంచి బిల్లులు పూర్తవడం లేదు. ఏదైనా అనారోగ్యంతో వస్తే ఆ సమస్య ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని, వైద్య ఖర్చుల్లో రాయితీ ఇస్తామని చెప్పి చేర్చుకుంటున్నారు. కొన్నిచోట్ల చికిత్సలు చేస్తున్నా ముందుగా పరీక్షలు, స్కానింగులకు అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఆరోగ్యశ్రీలో చికిత్సకు అనుమతి రావాలంటే ఆలస్యమవుతుందని చెప్పి పంపేస్తున్నారు. వారు చేసేదిలేక అప్పులు చేసి డబ్బు చెల్లించి చికిత్స తీసుకుంటున్న పరిస్థితులున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులివీ
ప్రైవేట్ ఆసుపత్రులు 36
దంత వైద్యశాలలు 17
ప్రభుత్వ ఆసుపత్రులు 35 పీహెచ్సీలు
జిల్లాలో మొత్తం ఆరోగ్యశ్రీ కార్డులు 4.60 లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM