పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద సోమవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇక్కడి పట్టాలు(ట్రాక్) సమస్యే దీనికి కారణంగా తెలుస్తుంది.
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో ఘటన
రైల్వేస్టేషన్లోని రెండవ ప్లాట్ఫామ్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ బోగి
వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం), న్యూస్టుడే: రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద సోమవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇక్కడి పట్టాలు(ట్రాక్) సమస్యే దీనికి కారణంగా తెలుస్తుంది. ఎరువుల లోడుతో పారాదీప్ నుంచి బళ్లారి వెళ్తున్న ఈ గూడ్స్ ఉదయం 6.20 గంటల సమయంలో ఇక్కడి ప్రధాన రైల్వేస్టేషన్కు వచ్చింది. రెండవ నంబరు ప్లాట్ఫామ్పై నుంచి వెళ్తుండగా వెనుక నుంచి అయిదవ బోగీ చక్రం పట్టా తప్పింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు పట్టాలు తప్పిన బోగి నుంచి మిగతా బోగీలను వేరుచేసిన తర్వాత ఉదయం 8.30 గంటల సమయంలో దీనిని పట్టా ఎక్కించి అక్కడి నుంచి తొలగించారు. ఈ సమయంలో రెండో ప్లాట్ఫామ్ పైనుంచి వెళ్లాల్సిన మిగతా రైళ్లను వేరే ట్రాక్ మీదుగా మళ్లించారు. మిగతా రైళ్ల రాకపోకలకు ఆటంకం లేకుండా చూసినప్పటికీ క్లియరెన్స్ కోసం ఉదయం 6.40 గంటల సమయంలో ఇక్కడి ఒకటో నంబరు ప్లాట్ఫామ్పైకి వచ్చిన షాలిమార్-సికింద్రాబాద్ సూపర్ఫాస్ట్ రైలును మాత్రం 15 నిమిషాల పాటు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. ఇక్కడి రెండవ ప్లాట్ఫామ్లో ట్రాక్ సమస్య కారణంగా గతంలోనూ కొంతకాలం రైళ్లు నిలపడం మానేసి మరమ్మతులు చేశారు. ట్రాక్ పూర్తిగా తొలగించి కొత్తగా వేసేందుకు ప్రతిపాదనలు ఉండటంతో ప్రస్తుతం దీనిపై ఎక్కువ రైళ్లను ఆపడంలేదు. ఈ స్టేషన్ మీదుగా ప్రతిరోజూ 160 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఎక్స్ప్రెస్లు 90 వరకు ఉండగా మిగతావి గూడ్స్లే. రెండవ ప్లాట్ఫామ్పై ట్రాక్ సమస్య ఉండటంతో దీనిపై కొన్ని ఎక్స్ప్రెస్లను ఆపడం తగ్గించి గూడ్స్ రైళ్లనే ఎక్కువగా పంపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19 పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్