జనాలకు జగన్ గండం
ముఖ్యమంత్రి సభ అంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో మంగళవారం మేమంతా సిద్ధం సభ జరిగింది. ఈ నేపథ్యంలో కోరుకొండ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు.
సీఎం జగన్ కాన్వాయ్ వస్తుంటే జనాన్ని పక్కకు నెట్టేస్తున్న పోలీసులు
ఈనాడు, రాజమహేంద్రవరం, కోరుకొండ, గోకవరం, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, ఏవీఏ రోడ్డు, రాజానగరం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి సభ అంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో మంగళవారం మేమంతా సిద్ధం సభ జరిగింది. ఈ నేపథ్యంలో కోరుకొండ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. నిత్యం రాజమహేంద్రవరం నుంచి గోకవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, భద్రాచలం మీదుగా బస్సులు వెళ్తాయి. ఆ బస్సులు కోరుకొండ రాకుండా జంబుపట్నం, నర్సాపురం, కణుకూరు, తిరుమలయపాలెం, రంప ఎర్రంపాలెం, వీర్లంకపల్లి మీదుగా గోకవరం వైపు మలిచారు. సుమారు 15 కి.మీ చుట్టూ తిరిగి వెళ్లడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కోరుకొండ బస్టాండ్ నుంచి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంకు వెళ్లే రహదారిలో సభ పెట్టడంతో ఆలయానికి వెళ్లే ప్రతీ మార్గం మూసేశారు. పక్క వీధుల్లోనూ వాహనాలను అనుమతించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచి ఆంక్షలు మొదలైపోయాయి.
గంటన్నర ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్
పోలీసుల ఆంక్షలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలిస్తున్న 108 వాహనం అందులో చిక్కుకుంది. సుమారు గంటన్నర సేపు అందులో చిక్కుకోవడంతో రోగి సహాయకులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఇరుకు రోడ్డులో తోపులాట
వేదికను ఇరుకు రోడ్డులో ఏర్పాటు చేశారు. కాన్వాయ్ వచ్చే సమయంలో రోప్ పార్టీ వారందరినీ పక్కకు నెట్టడంతో ఇరుకు రోడ్డులో తోపులాట జరిగింది. ఎక్కువ మంది జనాలు వచ్చారని చూపించేందుకు ఇలా చేశారని సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ సైతం రోడ్డులో వెళ్లలేక కేవలం జామర్ వాహనంతోపాటు ఆయన వెనుక ఒక కారులో మాత్రమే వెళ్లాల్సి వచ్చింది. జగన్ మాట్లాడుతుంటే చాలామంది వెనుదిరిగారు.
జనాల తరలింపు..
పలు విద్యాసంస్థలకు చెందిన సుమారు 300 బస్సుల్లో జనాలను తరలించారు. దూరాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కరికీ రూ.200 నుంచి రూ.500 వరకు ఇచ్చినట్లు అక్కడకు వచ్చిన వారు చెబుతున్నారు. కొన్ని గ్రామాల నుంచి ఉపాధి హామీ కూలీలకు మస్తర్లు వేసి తరలించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు