మద్య ‘నిషా’దం.. బతుకుల్లో ‘విషాదం’
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మద్యం అలవాటున్నవారిపై వల విసిరేందుకు ఊరూవాడా డంప్లు వెలుస్తున్నాయి. నాసిరకం, గోవా మద్యం పేరుతో వందలాది బాక్సుల్లో సీసాలు ప్రత్యక్షమవుతున్నాయి.
ఎన్నికల్లో ప్రలోభాలతో వల
ఉచితంగా ఇచ్చారని తాగితే ప్రాణాన్ని ఫణంగా పెట్టినట్లే
కుటుంబాలను కూల్చేస్తున్న మహమ్మారి
ఈనాడు, కాకినాడ - న్యూస్టుడే, కంబాలచెరువు
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మద్యం అలవాటున్నవారిపై వల విసిరేందుకు ఊరూవాడా డంప్లు వెలుస్తున్నాయి. నాసిరకం, గోవా మద్యం పేరుతో వందలాది బాక్సుల్లో సీసాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఉచితంగా వస్తుంది కదాని ఈ ప్రలోభాల ఉచ్చులో పడి ఏమాత్రం తాగినా చెల్లించుకునే మూల్యం కూడా ఎక్కువే. జీవితాంతం ఆరోగ్య సమస్యలతో సతమతమవ్వాల్సి వస్తోంది. మృత్యువూ పొంచే ఉంటుంది. ఇప్పటికే అనేకమంది వ్యాధులబారిన పడి లక్షలాది రూపాయలు వైద్యానికి ఖర్చుచేస్తున్నారు. బతుకే ఛిద్రమవుతోంది. ఆర్థిక చిక్కుల్లో పడి ఆ కుటుంబం పడే ఆవేదన అంతాఇంతాకాదు.
కాకినాడ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో అయిదేళ్ల కాలంలో మానసిక సమస్యలతో వైద్యం పొందిన వారి సంఖ్య 1,09,240 మంది. వీరిలో ఒక్క మద్యపాన వ్యసనపరులే 12,253 మంది. ఇక్కడ వ్యసన విముక్తి కేంద్రం (ఆల్కహాల్ అండ్ డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్) 2020 మే 28న ప్రారంభమైంది. ఈ ఏడాది మార్చి 24 వరకు ఔట్ పేషెంట్లుగా (ఓపీ) 12,126 వైద్య సేవలు పొందితే.. ఇన్పేషెంట్లుగా 908 మంది చేరి వైద్యం పొందారు. 13,304 మంది చికిత్స పొందారు.
కాకినాడ జీజీహెచ్లోని వ్యసన విముక్తి కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న వైద్య బృందం
కోనసీమలోనూ పెరుగుతున్న కేసులు...
అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో 2020 ఆగస్టులో వ్యసన విముక్తి కేంద్రం ఏర్పాటుచేశారు. 90 శాతం మంది రోగులు చీప్లిక్కర్ను తాగి ఒళ్లు గుల్లచేసుకుంటున్నారు. ఇక్కడ 8,711 మంది మానసిక, ఇతర సమస్యలతో ఆసుపత్రిలో చేరితే.. అందులో మందుబాబులు 7,600 మంది ఉన్నారు. ఇన్పేషెంట్లుగా 150 మంది చేరి చికిత్స పొందారు.
ఊరూవాడా మద్యం పరవళ్లు..
ఉమ్మడి జిల్లాలో 402 మద్యం దుకాణాలు.. 27 బార్లు, క్లబ్బులు ఇతరత్రా ప్రాంగణాల్లో అమ్మకాలు సాగుతున్నాయి. అలవాటున్నవారు సంపాదన అంతా తాగుడుకే ఖర్చుపెడుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు రూ.2వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.3వేల కోట్లకుపైనే.. ఇక నాటు సారా ప్రభావం ఉమ్మడి జిల్లాలో 36 మండలాల పరిధిలోని 120 గ్రామాల్లో ఉంటే.. ఏటా అక్రమ వ్యాపారం రూ.200 కోట్లకుపైనే సాగుతున్నట్లు అంచనా.
మృత్యుముఖంలోకి..
- మద్యంలో హానికరమైన కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. కొన్ని బ్రాండ్లలో వైరాగెలాల్, ఐసోఫ్లోరిక్ యాసిడ్, డైఈథేల్ ప్యాలెట్ వంటి ·కెమికల్ కాంపౌండ్ ఉందని తేల్చింది. కళ్లు ఎర్రబడడం, మెదడు సూదులతో గుచ్చినట్లు అవుతుందని తేల్చారు. మెదడు, శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తి మృత్యువాత పడే ప్రమాదం ఉందని వెల్లడించారు.
- ఉమ్మడి జిల్లాలో అనధికారికంగా తయారవుతున్న నాటుసారాలో కిక్కుకోసం బ్యాటరీల్లోని కార్బన్, యూరియా, డీఏపీ కలుపుతుండడంతో ప్రాణాలమీదికి వస్తోంది.
- వ్యసనపరులు ఆరోగ్యం గుళ్ల చేసుకుని ఆర్థో, న్యూరో, సైకియాట్రి విభాగాను ఆశ్రయిస్తున్నారు.
మత్తులో మెడ, చేతిపై కోసుకున్న వ్యక్తి
ఉమ్మడి జిల్లాలో ఎన్నికల్లో పంచేందుకు విచ్చలవిడిగా మద్యం దిగుమతి అవుతోంది. ఇటీవల కాకినాడ, కాట్రేనికోన, పిఠాపురం, రాయవరం తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున పట్టుబడింది. పిఠాపురంలో పట్టుకున్న సరకైతే ఏకంగా రూ.80 లక్షల పైమాటే. గోవా మద్యం సీసాలూ కనిపించాయి. ఈ నేపథ్యంలో మద్యం జోలికి ఎవరూ వెళ్లకూడదని, తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసే ఎన్నికల్లో బాధ్యతతో వ్యవహరిం చాలని మహిళలు కోరుకుంటున్నారు.
రూ.లక్షలు ఖర్చుపెట్టినా మనిషి దక్కలేదు..
- ధనలక్ష్మి, ఆల్కాట్గార్డెన్స్, రాజమహేంద్రవరం
మా తమ్ముడు ప్రైవేటు ఉద్యోగి (45). పదిహేనేళ్ల నుంచి మద్యం తాగేవాడు. గ్యాస్ట్రిక్, కడుపునొప్పి వచ్చేవి. రెండేళ్ల క్రితం కాళ్లు చేతులకు నీరు పట్టేసి, కడుపు ఉబ్బిపోయింది. కాలేయం దెబ్బతిందని వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి ప్రతి నెలా ఆసుపత్రికి వెళ్లి పొట్టకు సూది పెట్టి నీరు బయటికి తీసేవారు. కాలేయం పూర్తిగా దెబ్బతిని మృతిచెందాడు. బయట అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించాం.
తండ్రి లేని పిల్లలయ్యారు..
- పి.ఝాన్సీ, కాతేరు
నా భర్తను పోగొట్టుకున్నా. నా ఇద్దరు పిల్లలకు తండ్రి ప్రేమ దూరమైంది. ఏడాది క్రితం పచ్చకామెర్లు వచ్చాయి. చికిత్స తీసుకున్న కొద్ది రోజుల తరువాత వెంటనే మళ్లీ మద్యం తాగేయడంతో పరిస్థితి తీవ్రతరమైంది. కొన్నిసార్లు మూర్ఛ వచ్చి పరిస్థితి దారుణంగా ఉండేది. ఆస్తులు అమ్ముకుని మరీ చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది మార్చిలో కడుపు ఉబ్బి, శరీరమంతా నీరు పట్టేసి చనిపోయారు. మద్య రహిత సమాజం వస్తేనే బతుకులు బాగుపడతాయి.
రోగుల్లో శారీరక, మానసిక సమస్యలు..
- డాక్టర్ వి.వి.వరప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రి విభాగం, కాకినాడ జీజీహెచ్
మద్యం మోతాదు ఎక్కువ తీసుకోవడంతో బ్రెయిన్లో టోలరెన్స్ పెరిగి బానిసలయ్యే పరిస్థితి ఉంటుంది. గ్యాస్ట్రిక్, కడుపునొప్పి, వాంతులు, లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంటాయి. నిద్ర పట్టకపోవడం, ఆకలి వేయకపోవడం, చేతులు వణకడం వంటి సమస్యలతో రోగులు వస్తుంటారు. ఫిట్స్ వస్తే మెదడుకు ప్రమాదం. మానసిక పరిస్థితి బాగులేక ఆవేశంలో ఉరివేసుకోవడం, బ్లేడుతోనో కత్తితోనో గాయపరచుకోవడం వంటి పరిస్థితుల్లో వైద్యశాలకు వసున్నవారూ ఉన్నారు.
కాలేయం, గుండెపై తీవ్ర ప్రభావం
- డాక్టర్ పీవీవీ సత్యనారాయణ, జనరల్ మెడిసిన్ హెచ్వోడీ, రాజమహేంద్రవరం జీజీహెచ్
మద్యానికి బానిసైనవారు.. నాసిరకం, కల్తీ మద్యం తాగుతున్న వారికి కాలేయం, గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక్కోసారి మెదడులో నరాలు పగిలి స్ట్రోక్ వస్తుంది. కాలేయం దెబ్బతింటే పచ్చకామెర్లు వస్తాయి. అక్కడే జాగ్రత్తలు తీసుకోకపోతే చికిత్స చేయడానికి కూడా ఉండదు. అలానే పొట్టలో అల్సర్లు వస్తాయి. పొట్ట, శరీరమంతా నీరు పట్టేస్తుంది. దీనికి చికిత్స ఉన్నా రికవరీ సరిగా ఉండదు. మరణాల రేటు అధికం. గుండె పనితీరు తగ్గి ఆల్కహాలిక్ కార్డియో మయోపతి వస్తుంది. దీని వల్ల గుండె ఆగిపోయి మనిషి చనిపోతారు. తీవ్ర మతిమరుపు, మానసిక సమస్యలు వేధిస్తాయి. ఫిట్స్ వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదముంది. ఇలాంటి కేసులు ప్రస్తుతం రాజమహేంద్రవరం జీజీహెచ్కు విపరీతంగా వస్తున్నాయి. మొత్తం కేసుల్లో 20 శాతం ఇలాంటి మద్యం తాగడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులతోనే.. ఇక కల్తీ మద్యం తాగితే అయిదేళ్లలో క్షీణించే ఆరోగ్యం ఏడాదిలోనే పూర్తిగా దెబ్బతిని చికిత్స చేయడానికి అవకాశమే ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం