logo

ఏ తల్లి కన్నబిడ్డో..!

ఏ తల్లి కన్నదో తెలియదుకాని.. అభంశుభం తెలియని ఓ శిశువు మురుగు కాలువలో మృతదేహంగా కనిపించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 10 May 2024 05:08 IST

మురుగు కాలువలో శిశువు మృతదేహం లభ్యం

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఏ తల్లి కన్నదో తెలియదుకాని.. అభంశుభం తెలియని ఓ శిశువు మురుగు కాలువలో మృతదేహంగా కనిపించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్యాపురంలోని ఓ ప్రధాన మురుగు కాలువలో ఓ శిశువు మృతదేహం తేలియాడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారువచ్చి మృతదేహాన్ని వెలికితీయించి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఇంకా బొడ్డుతాడు కూడా తీయని మగ శిశువుని మృతిచెందితే కాలువలో పడేశారా.. బతికుండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో తెలియాల్సి ఉందని ఎస్సై రామకృష్ణ తెలిపారు. లేకుంటే మురుగు కాలువలో కొట్టుకుని వచ్చిందో తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేషశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు