ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ
కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు.
రాజీనామా చేసిన వాలంటీర్లదే ప్రధాన పాత్ర
కొత్తపల్లి, కాకినాడ కలెక్టరేట్: కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు. స్థానికేతరులైన వ్యక్తుల ద్వారా పంపిణీకి దిగడం గమనార్హం. ఇప్పటికే కొత్తపల్లి, వాకతిప్ప, కుతుకుడుమిలి తదితర గ్రామాల్లో పంపిణీ జోరుగా సాగుతోంది. కొత్తపల్లిలో వైకాపా నాయకుడి ఆధ్వర్యంలోనే పంపిణీ పూర్తి చేశారు. ముందుగా రాజీనామాలు చేసిన వాలంటీర్లతో జాబితా సిద్ధం చేసుకుని నేరుగా ఓటర్ల ఇంటికెళ్లి నగదు అందిస్తున్నారు. బుధవారం సాయంత్రం ప్రారంభించిన పంపకాల తంతు రాత్రి 2 గంటల వరకు సాగింది. గురువారం కూడా కొనసాగించారు. దీనికి పది రోజుల ముందు మత్స్యకార ప్రాంతాల్లో వైకాపా నాయకులు రేషన్కార్డుకి రూ.2 వేలు చొప్పున పంపిణీ చేసి.. తమకే ఓటేయాలని ప్రచారం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం.
కాకినాడలో రూ.2వేలు..
కాకినాడ నగర నియోజకవర్గంలో అధికార వైకాపా ఓట్లు కొనుగోలు చేస్తోంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు డివిజన్లలో నగదు పంపిణీ జరిగింది. రాజీనామా చేసిన వాలంటీర్ల సహకారంతో ఓటుకు రూ.2వేలు చొప్పున పంపిణీ చేశారు. ఉదయం 27వ డివిజన్లో వైకాపా నాయకులు, రాజీనామా చేసిన వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఓటుకు రూ.2వేలు చొప్పున అందజేశారు. మధ్యాహ్నం కొన్నిచోట్ల, సాయంత్రం నుంచి రాత్రి వరకు మరికొన్ని ప్రాంతాల్లో నగదు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో లక్ష ఓట్ల వరకు నగదుకు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. జగన్నాథపురంలోని 13 డివిజన్లు, నగరంలో పేదలు ఎక్కువగా ఆవాసముంటున్న డివిజన్లలో నగదు పంపిణీ జరిగేలా వ్యూహం రచించినట్లు తెలిసింది. ఇక్కడా వైకాపా అభిమానులు, కార్యకర్తలు, తటస్థంగా ఉన్న వారికే నగదు అందజేస్తున్నారు.
నిఘా బృందాలు ఎక్కడ..?
కాకినాడ నగర నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి నిఘా బృందాలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిలో స్థానిక ప్రజాప్రతినిధికి అత్యంత అనుకూలమైన అధికారులను నియమించారనే విమర్శలు ఉన్నాయి.
డివిజన్ల వారీగా నగదు డంపు..?
అధికార వైకాపా ముందస్తుగానే ఆయా డివిజన్ల పరిధిలో నమ్మకమైన వ్యక్తుల ఇళ్ల వద్ద నగదు దాచినట్లు ప్రచారం జరుగుతోంది. నగదు తరలింపునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. వీరికి ప్రజలకు రక్షణ కల్పించే శాఖలోని కొందరు అధికారులు సహకారం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM