logo

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రుద్రరాజు

కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోందని రాజమహేంద్రవరం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు.

Published : 10 May 2024 05:20 IST

గోపాలపురం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోందని రాజమహేంద్రవరం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థితో కలిసి ఆయన గోపాలపురం, దేవరపల్లి మండలాల పరిధిలో గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. మండలంలోని గోవపరం నుంచి ప్రారంభమైన ప్రచారం చిట్యాల, పెద్దాపురం, వేళ్లచింతలగూడెం, గోపాలపురం, వాదాలకుంట వెదుళ్లకుంట వరకు సాగింది. అనంతరం దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయిగూడెంలో ప్రచారం ముగిసింది. వెదుళ్లకుంటలోని జ్యేష్ఠ సతీష్‌బాబు నివాసం వద్ద మధ్యాహ్న భోజనం అనంతరం రుద్రరాజు విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. మేం అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్నీ అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కె.శ్రీనివాసరావు, మట్టపర్తి రామ్మోహనరావు, వెలగా రామకృష్ణ, గన్నిన రామారాయుడు, పిట్టా రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు