పాజిటివిటీ రేటు 15.83%
జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 943 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఒకరు మరణించారు. పండగ వేళ ప్రయాణాలు, రద్దీ ప్రాంతాల్లో కలియతిరగడంతో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే
ఒక్కరోజులో 943 కరోనా కేసులు
రొంపిచర్ల మండలం అలవాల ప్రభుత్వ పాఠశాలలో కొవిడ్ పరీక్షలు
ఈనాడు, గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 943 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఒకరు మరణించారు. పండగ వేళ ప్రయాణాలు, రద్దీ ప్రాంతాల్లో కలియతిరగడంతో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే వెయ్యి చేరువగా కొత్త కేసులు నమోదుకావడంతో యంత్రాంగం ఆందోళన చెందుతోంది. జిల్లా కేంద్రంగా ఉన్న ఒక కార్యాలయంలో పది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కార్యాలయ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నా బాధితులుగా మారుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా పాజిటివిటీ రేటు 15.83 శాతం నమోదైంది. 5958 నమూనాలు పరీక్షించగా 943 మందికి కరోనా నిర్ధారణ అయింది. డిసెంబరు నెలలో పాజిటివిటీ రేటు 2 శాతంలోపు ఉండగా, జనవరి ప్రారంభంలో 5 శాతం వరకు ఉంది. ప్రస్తుతం 15 శాతం దాటడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. స్వల్ప లక్షణాలు ఉండటం వల్ల ఇబ్బంది లేదని ఇంట్లో ఎక్కువ మంది వైద్యం పొందుతున్నారు. అయితే కొందరిలో డెల్టా వేరియంట్ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, అలాంటివారు వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఒక్కరోజులోనే 707 కేసులు రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. జిల్లాలో క్రియాశీలక కేసులు 3561 ఉన్నాయి. ఆసుపత్రుల్లో క్రియాశీలక కేసులు 271 ఉన్నాయి. వెంటిలెటర్పై 9 మంది, ఐసీయూలో 48, ఆక్సిజన్ సాయంతో 111 మంది, సాధారణ పడకల్లో 112 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాల్సి ఉంది. విద్యాసంస్థలతోపాటు అన్ని కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా.. ఇప్పటికే ఒకసారి కరోనా బారిన పడినా మళ్లీ వైరస్ సోకుతున్నందునన విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రలోభాలు
[ 04-05-2024]
జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ బాధ్యతల నిర్వహణతోపాటు వివిధ అంశాల్లో ఐదేళ్లు రాచిరంపాన పెట్టడంతో వైకాపా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల్ని ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
‘పేదకు నరకం’.. లేదే కనికరం..
[ 04-05-2024]
రాజేష్, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం. -
‘సంక్షేమం పేరుతో జగన్ నమ్మక ద్రోహం’
[ 04-05-2024]
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమం పేరుతో ముస్లిం, మైనార్టీలకు నమ్మక ద్రోహం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ పేర్కొన్నారు. -
రాజధాని వద్దంటూ.. లోకల్ ఎలా అవుతారు?
[ 04-05-2024]
‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. -
372 సమస్యాత్మక కేంద్రాలు
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 1,309 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
జగన్ కుతంత్రం.. ఓడిన మానవత్వం
[ 04-05-2024]
నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి. ఇవీ సీఎం జగన్ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు. -
తొలి రోజు 1,011 మంది గృహ ఓటింగ్
[ 04-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు రెండు రోజుల పాటు ఓటింగ్ చేసుకునే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. -
జగన్.. మాపై ఎందుకీ కక్ష?
[ 04-05-2024]
భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం. -
జగన్ను గద్దె దించడానికి నిరుద్యోగులు సిద్ధం
[ 04-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను మోసగించిన సీఎం జగన్ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్లు మేర చేపట్టిన నిరుద్యోగ చైనత్యయాత్ర శుక్రవారం మంగళగిరి చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!