Andhra News: ఏపీలోనూ ఈడీ దాడులు.. ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో కొనసాగుతున్న సోదాలు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఇవాళ ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.

Published : 02 Dec 2022 16:30 IST

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఇవాళ ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో జరిగిన అవకతవకలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దిల్లీ నుంచి వచ్చిన నాలుగు ఈడీ బృందాలు ఎన్నారై ఆసుపత్రి, వైద్యకళాశాల, డైరెక్టర్ల నివాసాలు, వారికి సంబంధించిన న్యాయవాదుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. గతంలో ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని