Kotappakonda: మహా శివరాత్రి.. కోటప్ప కొండను చేరుకోండిలా..
కోటి వేల్పుల అండ కోటప్పకొండ.. కోటొక్క ప్రభలు తెచ్చామయ్యా వచ్చి ఏలుకోవయ్యా త్రికోటేశ్వరయ్యా అని మనసారా కోరుకుని స్వామి దర్శనం సౌకర్యంగా జరిగి సుఖంగా తిరుగుముఖం పట్టాలంటే అధికారులు..
పోలీసుల సూచనలు పాటిద్దాం
ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకుందాం
ఈనాడు డిజిటల్, నరసరావుపేట
కోటి వేల్పుల అండ కోటప్పకొండ.. కోటొక్క ప్రభలు తెచ్చామయ్యా వచ్చి ఏలుకోవయ్యా త్రికోటేశ్వరయ్యా అని మనసారా కోరుకుని స్వామి దర్శనం సౌకర్యంగా జరిగి సుఖంగా తిరుగుముఖం పట్టాలంటే అధికారులు, పోలీసుల సూచనలు పాటించాలి. లక్షల్లో వచ్చే భక్తులు, వేలాది వాహనాలు ట్రాఫిక్లో ఇరుక్కోకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది కొన్ని చేదు అనుభవాలతో ఈసారి పకడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రవిశంకర్రడ్డి, డీఎస్పీ వర్మ ప్రకటించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా వాహనాల క్రమబద్ధీకరణతో పాటు, ఘాట్రోడ్డు మీదుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వెళ్లకుండా చూస్తామంటున్నారు. పైకి కార్లు, ద్విచక్ర వాహనాలను అనుమతించేది లేదని, ఆర్టీసీ బస్సుల్లోనే పయనించాలని, ప్రముఖులకు ఏసీ బస్సులుంటాయని వెల్లడించారు.
ప్రభలు వెళ్లే దారులు
- చిలకలూరిపేట నుంచి వచ్చేవి పురుషోత్తమపట్నం, యడవల్లి, ఈటీ జంక్షన్ మీదుగా రావాలి. ఉదయం 8కి ఆయా గ్రామాల నుంచి బయలుదేరి, సాయంత్రం 4 గంటల్లోపు అన్నీ జంక్షన్కు చేరుకోవాలి.
- నరసరావుపేట నుంచి వచ్చేవి యలమంద, గురవాయపాలెం, స్నానాల ఘాట్ నుంచి వచ్చి రెడ్ల సత్రం మీదుగా ఖాళీ స్థలంలోకి చేరుకోవాలి.
- ప్రభలన్నీ ఒకేసారి వస్తే విద్యుత్తు సరఫరా విషయంలో ఇబ్బందుల్లేకుండా ఉంటాయని, సహకరించాలని విద్యుత్తు అధికారులు కోరుతున్నారు.
వాహనాల్లో వచ్చేవారు
- నరసరావుపేట నుంచి వాహనాల్లో వచ్చేవారు పెట్లూరివారిపాలెం, అచ్చంపాలెం మీదుగా ఘాట్రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్లో నిలిపి ఆర్టీసీ బస్సుల్లో కొండకు చేరుకోవాలి.
- చిలకలూరిపేట నుంచి వాహనాల్లో వచ్చేవారు పురుషోత్తమపట్నం, యడవల్లి, ఈటీ జంక్షన్ సమీపంలో శారదా ఫార్మసీ కాలేజ్ ఎదురుగా ఏర్పాటు చేసిన పార్కింగ్లో వాహనాలను ఆపాలి.
- వీఐపీలు, వీవీఐపీలు ఈటీ జంక్షన్ నుంచి ఎడమవైపు క్వారీ రోడ్డు నుంచి పమిడిపర్రు వైపు ఏర్పాటు చేసిన పార్కింగ్లో తమ వాహనాలను ఆపాలి.
తిరుగుపయనం
- ప్రభలన్నీ వచ్చిన దారిలోనే తిరుగుముఖం పట్టాలి.
- సాధారణ ప్రజలు, వాహనాల్లో వచ్చేవారు, బస్సులు మాత్రం కొండకావురు నుంచి జేఎన్టీయూ, కాకాని దారిలో తిరుగుముఖం పట్టాలి. స్నానాల ఘాట్ నుంచి కాల్వరోడ్డు మీదుగా ఏఎం రెడ్డి కాలేజీ వద్దకు చేరుకుని అటు వినుకొండ వైపు, ఇటు నరసరావుపేటకు తిరుగుముఖం పట్టాలి.
- చిలకలూరిపేట వైపు వెళ్లేవారు ఈటీ జంక్షన్ కట్టుబడివారిపాలెం మీదుగా చెరువు రోడ్డు వైపు మళ్లాలి.
- సంతమాగులూరు, అద్దంకి నుంచి వచ్చేవారు గురిజేపల్లి మీదుగా ఈటీ జంక్షన్కు రావాలి. తిరుగుపయనం కూడా ఇదే దారిలోనే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ మాయగాళ్ల ఉచ్చులో విశాఖ యువత.. కాంబోడియాలో నరకయాతన
-
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
-
హెచ్చు పందేల జోరు.. రౌండ్ల వారీ మెజార్టీపైనా దృష్టి..
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా