logo

ఆగని వాలంటీర్ల ప్రచారం

పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు.

Published : 28 Mar 2024 06:17 IST

వేమూరు వైకాపా అభ్యర్థి అశోక్‌బాబుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న వాలంటీరు సన్నీడియోల్‌
వేమూరు, న్యూస్‌టుడే: పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. వేమూరు మండలం చంపాడులో పి.సన్నీడియోల్‌ అనే వాలంటీరు వైకాపా అభ్యర్థి అశోక్‌బాబు బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా సన్నీడియోల్‌ అశోక్‌బాబుకు వైకాపా నాయకులతో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ విషయంపై ఎంపీడీవో శేషగిరిరావును వివరణ కోరగా వాలంటీర్‌ పాల్గొన్నట్లు రుజువు ఉంటే ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగిస్తామని చెప్పారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని