కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఎన్నికల అధికారులు
పొన్నూరు: ఈనెల 18న ములుకుదురులో మహిళలకు చెక్కులు అందజేస్తున్న వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ
న్యూస్టుడే, పొన్నూరు: ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. అయినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సమావేశానికి హాజరైన వాలంటీర్లను ఎన్నికల అధికారులు విధులు నుంచి తొలగించారు. వాలంటీర్లతో సమావేశం నిర్వహించిన వైకాపా నేతలపై చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జడ్పీ అతిథిగృహమే కార్యాలయంగా..
పొన్నూరు అసెంబ్లీ వైకాపా నియోజకవర్గ సమన్వకర్తగా అంబటి మురళీకృష్ణను గత నెల 28న నియమించారు. అనంతరం జడ్పీ అతిథిగృహాన్ని వైకాపా కార్యాలయంగా మార్చారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జిల్లా పరిషత్తు ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేయిస్తామని ప్రకటించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో విచారణ అనే మాట ఒట్టి మాటగానే మిగిలిపోయిందనే ఆరోపణలు వినిపించాయి.
భోజనాలు పెట్టి.. తాయిలాలు ఎరేసి..
ఈ నెల 16న పొన్నూరు వైకాపా అభ్యర్థిగా అంబటి మురళీకృష్ణను ప్రకటించారు. వైకాపా అభ్యర్థిగా అంబటి పేరును ప్రకటించిన కొంత సమయానికే పొన్నూరు జడ్పీ అతిథిగృహంలో పొన్నూరు పట్టణ, మండల పరిధిలోని వాలంటీర్లతో వైకాపా అభ్యర్థి సమావేశం నిర్వహించారు.వాలంటీర్లకు భోజన వసతి కల్పించి ప్రతి ఒక్కరికి లంచ్ బాక్సులు బహుమతులుగా ఇచ్చారు. 16వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
వాలంటీర్లపై చర్యలతో వదిలేసి..
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. వైకాపా అభ్యర్థి వాలంటీర్లతో సమావేశం నిర్వహించడంపై ఎన్నికల అధికారులకు వరసగా ఫిర్యాదులు వెళ్లాయి. ఆ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేయించి సమావేశంలో పాల్గొన్న వాలంటీర్లను విధుల నుంచి తప్పించి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. సమావేశానికి కారకులైన వైకాపా అభ్యర్థిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రచారంలో చెక్కుల పంపిణీ..
ఈ నెల 18న పొన్నూరు మండల పరిధిలోని ములుకుదురు గ్రామంలో వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా చెక్కులు పంపిణీ చేశారని ఎన్నికల అధికారులకు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు చేశాయి. ఎన్నికల అధికారులు రహస్యంగా విచారణ చేసినట్లు సమాచారం. విచారణ కాగితాలకే పరిమితం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వట్టిచెరుకూరులో తెదేపా సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
[ 27-04-2024]
వట్టిచెరుకూరు మండలంలోని ఇంజనంపాడు గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో శనివారం సూపర్ సిక్స్ పథకాల శంఖారావం కార్యక్రమాలను నిర్వహించారు. -
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్