వివాదాల అగ్గిరాజేస్తున్న వైకాపా
‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి.
తెదేపా శ్రేణులే లక్ష్యంగా దాడులు
పెదకూరపాడు నియోజకవర్గంలో వరుస ఘటనలు
క్రోసూరు ఘటనలో ఇంతవరకూ నిందితులనే గుర్తించని పోలీసులు
క్రోసూరు: తెదేపా కార్యాలయం వద్ద మంటలు (పాత చిత్రం)
ఈనాడు డిజిటల్, నరసరావుపేట : ‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి. చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం పక్షపాత ధోరణి అవలంబించడం వల్లే తమపై దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
- మార్చి 15న అమరావతి మండలం ధరణికోటలో వైకాపా కార్యాలయానికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించారు. అర్ధరాత్రి కావడంతో పూర్తిగా కాలిపోయింది. ఉదయం చూసేసరికి బూడిద మిగిలింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అనుమానితుల పేరిట ఓ ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారితో నియోజకవర్గంలో కీలకమైన ఓ ముగ్గురు తెదేపా నేతల పేర్లు చెప్పించి వారిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఐదుగురిని అరెస్టు చేశారు.
- ఈనెల 8న క్రోసూరులో తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభ అయిపోయాక అర్ధరాత్రి 12 గంటల సమయంలో క్రోసూరులోని తెదేపా కార్యాలయాన్ని గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. కార్యాలయం పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది. 15 రోజులవుతున్నా అనుమానితులను గుర్తించలేదు. ఎవరో కూడా తెలుసుకునేప్రయత్నం చేయడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
పై రెండు ఘటనల విషయంలో స్థానిక పోలీసులు అధికార పార్టీకి అంటకాగుతున్నారని, అందుకే వైకాపా కార్యాలయం తగులబడితే ఒకలా.. తెదేపా కార్యాలయం తగులబడితే మరోలా చర్యలు తీసుకున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. క్రోసూరులోని తెదేపా కార్యాలయంపై దాడి ఘటన కేసులో ఇంతవరకూ చర్యలు లేకపోవడంతో తెదేపా శ్రేణులనే లక్ష్యం చేస్తూ ఇటీవల వరుస దాడులు పెదకూరపాడు నియోజకర్గంలో చోటుచేసుకుంటున్నాయి. తమను పోలీసులు ఏమీ అనరులే, కేసులు నమోదు చేయరులే.. అరెస్టు చేయరు అన్న ధోరణిలో వైకాపా కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెంలో తెదేపా కార్యాలయానికి ఎవరో గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. మంటలు చెలరేగడంతో అక్కడే నిద్రపోతున్న కొందరికి మెలకువ వచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు భారీగా చెలరేగి కార్యాలయం మొత్తం కాలిపోయింది. అక్కడే ఓ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నా సరే కార్యాలయానికి నిప్పు పెట్టడం గమనార్హం.
తెదేపా పేరు ఎత్తితే చాలు వైకాపా నాయకులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈనెల 19న బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో తెదేపా ఎన్నికల ప్రచార రథం తిరుగుతోంది. వాహనాన్ని అడ్డగించి వెనక్కి వెళ్లిపోవాలంటూ అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త గాదె నాగార్జునరెడ్డి బెదిరించాడు. ప్రచార వాహన డ్రైవరుతో గొడవ పెట్టుకున్నాడు. అంతేకాకుండా వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు రేగడంతో స్థానికులు కొందరు అడ్డుకుని ప్రమాదాన్ని నిలువరించారు. మంటలు ఆర్పిన స్థానికులపై కూడా వైకాపా కార్యకర్త మీ సంగతి తేలుస్తా అంటూ బెదిరించాడు. ఇలా తెలుగుదేశం పార్టీ శ్రేణులే లక్ష్యంగా పెదకూరపాడు నియోజకవర్గంలో వరుస దాడులు చోటుచేసుకుంటున్నా పోలీసుల చర్యలు లేకపోవడంతో వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాలో మాచర్ల, గురజాలను పెదకూరపాడు మించిపోయే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
[ 04-05-2024]
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రలోభాలు
[ 04-05-2024]
జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ బాధ్యతల నిర్వహణతోపాటు వివిధ అంశాల్లో ఐదేళ్లు రాచిరంపాన పెట్టడంతో వైకాపా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల్ని ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
‘పేదకు నరకం’.. లేదే కనికరం..
[ 04-05-2024]
రాజేష్, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం. -
‘సంక్షేమం పేరుతో జగన్ నమ్మక ద్రోహం’
[ 04-05-2024]
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమం పేరుతో ముస్లిం, మైనార్టీలకు నమ్మక ద్రోహం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ పేర్కొన్నారు. -
రాజధాని వద్దంటూ.. లోకల్ ఎలా అవుతారు?
[ 04-05-2024]
‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. -
372 సమస్యాత్మక కేంద్రాలు
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 1,309 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
జగన్ కుతంత్రం.. ఓడిన మానవత్వం
[ 04-05-2024]
నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి. ఇవీ సీఎం జగన్ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు. -
తొలి రోజు 1,011 మంది గృహ ఓటింగ్
[ 04-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు రెండు రోజుల పాటు ఓటింగ్ చేసుకునే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. -
జగన్.. మాపై ఎందుకీ కక్ష?
[ 04-05-2024]
భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం. -
జగన్ను గద్దె దించడానికి నిరుద్యోగులు సిద్ధం
[ 04-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను మోసగించిన సీఎం జగన్ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్లు మేర చేపట్టిన నిరుద్యోగ చైనత్యయాత్ర శుక్రవారం మంగళగిరి చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..