తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.
మంత్రి ఇంటి వద్ద గొడవ
మంత్రి విడదల రజిని ఇంటి వద్ద గొడవ పడుతున్న తెదేపా, వైకాపా నాయకులు,
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్టుడే: తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిని గళ్లా మాధవి ప్రచార వాహన డ్రైవర్ జెట్టి శ్రీనివాస్ శ్యామలనగర్ వీధుల్లో ప్రచారం నిర్వహించి ఎండగా ఉండడంతో మంత్రి రజిని కార్యాలయం సమీపంలో చెట్టు కింద నిలిపారు. దీంతో రజని అనుచరులు ఇక్కడ తెదేపా వాహనాలు ఉంచడానికి వీల్లేదని, అక్కడ నుంచి వెళ్లి పోవాలని వాదనకు దిగారు. డ్రైవర్ శ్రీనివాస్ నీడగా ఉందని రోడ్డు మీద పెట్టుకుంటే..మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో శ్రీనివాస్ ముఖంపై మంత్రి అనుచరులు చేతులతో దాడి చేశారు. ఈ విషయాన్ని డ్రైవర్ శ్రీనివాస్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్బాబుకు తెలియజేశాడు. ఆయనతో పాటు పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే రజిని ఇంటి వద్ద ఆమె మరిది గోపి తదితరులు ఉన్నారు. డ్రైవర్పై దాడి ఎందుకు చేశారని కార్పొరేటర్ వరప్రసాద్ మంత్రి అనుచరులను ప్రశ్నించారు. దీనికి రెచ్చిపోయిన గోపి ఆయనతో వాదనకు దిగారు. ఇరు వర్గాల మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకొంది. గొడవ తోపులాట వరకూ వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వైకాపా నాయకులు తెదేపా ప్రచార వాహనం డ్రైవర్ శ్రీనివాస్పై దాడి చేయడమే గాక తమపై తెదేపా నాయకులు దౌర్జన్యానికి వచ్చారని ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు డ్రైవర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్లగా పోలీసులు తీసుకోలేదు. వైకాపా నాయకులు దాడి చేసిందే గాక శ్రీనివాస్ మద్యం తాగి ఉన్నాడని ఆరోపణలు చేసినందున పరీక్షలు చేయించమని తాము కోరినా పోలీసులు ఆపని చేయలేదని కార్పొరేటర్ వరప్రసాద్బాబు వాపోయారు. పైగా వైకాపా నాయకులు తనపై దాడి చేయకపోయినా..దాడి చేశారని తెదేపా నాయకులకు తెలియజేసినట్లు శ్రీనివాస్తో రాయించుకొని పోలీసులు బెదిరించి పంపారని ఆయన విమర్శించారు. పోలీసులు మంత్రి రజినికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తాము దౌర్జన్యం చేసేందుకు వెళ్లామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
డ్రైవర్ జెట్టి శ్రీనివాస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
[ 04-05-2024]
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రలోభాలు
[ 04-05-2024]
జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ బాధ్యతల నిర్వహణతోపాటు వివిధ అంశాల్లో ఐదేళ్లు రాచిరంపాన పెట్టడంతో వైకాపా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల్ని ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
‘పేదకు నరకం’.. లేదే కనికరం..
[ 04-05-2024]
రాజేష్, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం. -
‘సంక్షేమం పేరుతో జగన్ నమ్మక ద్రోహం’
[ 04-05-2024]
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమం పేరుతో ముస్లిం, మైనార్టీలకు నమ్మక ద్రోహం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ పేర్కొన్నారు. -
రాజధాని వద్దంటూ.. లోకల్ ఎలా అవుతారు?
[ 04-05-2024]
‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. -
372 సమస్యాత్మక కేంద్రాలు
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 1,309 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
జగన్ కుతంత్రం.. ఓడిన మానవత్వం
[ 04-05-2024]
నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి. ఇవీ సీఎం జగన్ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు. -
తొలి రోజు 1,011 మంది గృహ ఓటింగ్
[ 04-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు రెండు రోజుల పాటు ఓటింగ్ చేసుకునే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. -
జగన్.. మాపై ఎందుకీ కక్ష?
[ 04-05-2024]
భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం. -
జగన్ను గద్దె దించడానికి నిరుద్యోగులు సిద్ధం
[ 04-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను మోసగించిన సీఎం జగన్ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్లు మేర చేపట్టిన నిరుద్యోగ చైనత్యయాత్ర శుక్రవారం మంగళగిరి చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..