చందా.. దందా
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు.
అప్పుడు మద్యం.. ఇప్పుడు మిర్చి వ్యాపారుల నుంచి వసూళ్లు
పట్టాభిపురం, న్యూస్టుడే: ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. పైగా ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నా..ప్రజాప్రతినిధిగా అయిదేళ్లలో మీకు ఎన్నో పనులు చేసి పెట్టా. కరోనా సమయంలో అప్పుడున్న పరిస్థితులతో మీరు వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేందుకు పాస్లు ఇప్పించా. అంతేగాకుండా అన్నివిధాలా మీకు సహకరించా. నేను ఎంపీగా ఎన్నికై పార్లమెంట్ మెట్లు ఎక్కితే మీకు ఎంతో అండగా ఉంటా. మీ వ్యాపార లావాదేవీలకు అధికారులు పూర్తిగా సహకరించేలా చూస్తా. గతంతో పోలిస్తే ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో మీరు చేతనైనంత ఆర్థిక సహకారం అందించండి. పైగా గతంలో నేను కూడా ఇదే వ్యాపారం చేశా. వ్యాపార పరంగా కూడా మీకు ఎన్నో పనులు చేసి పెట్టా. ఎవరి శక్తి మేరకు వారు చందాలు వసూలు చేసి పెట్టాల్సిందే...
...ఇది గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న ఓ పార్టీ అభ్యర్థి మిర్చి వ్యాపారులకు చేసిన హుకుం. ఆయన ఇప్పటికే దందా చేసి మద్యం వ్యాపారుల నుంచి చందాలు వసూలు చేయగా.. తాజాగా మిర్చి వ్యాపారుల వంతు వచ్చింది.
స్థాయిని బట్టి మొత్తాలు
గుంటూరు మిర్చియార్డు నుంచి దేశ విదేశాలకు మిర్చి ఎగుమతి అవుతుంటుంది. క్రయవిక్రయాలు భారీ స్థాయిలో జరుగుతుంటాయి. వ్యాపారులకు ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారుల్లో ఎవరూ నిక్కచ్చిగా వ్యాపారాలు చేసే వారు ఉండరు. ఎగుమతి వ్యాపారులైతే జీరో, కటింగ్, దిగుమతి వ్యాపారులైతే బిల్లు టు బిల్లు, అధిక కమీషన్ వసూలు చేస్తుంటారు. గతంలో ఇదే వ్యాపారంలో సిద్ధహస్తులైన సదరు ప్రజాప్రతినిధికి ఎగుమతి, దిగుమతి వ్యాపారుల చేసే అక్రమాలు, అవకతవకలపై స్పష్టమైన అవగాహన ఉండడంతో ఎంపీగా ఎన్నికైతే వాటన్నింటికీ ఎటువంటి ఢోకా ఉండదని భరోసా ఇస్తూ వసూళ్లకు తెర లేపారు. మిర్చి ఎగుమతి వ్యాపారులు 300 మంది వరకు ఉంటారు. ఇందులో బడా వ్యాపారులు, ఓ మోస్తరుగా వ్యాపారం చేసే వారు, చిన్న వ్యాపారులు ఉంటారు. ఏ స్థాయి వ్యాపారులు ఎంతెంత ఇవ్వాలో గ్రేడింగ్ చేసి మరీ ఎంపీ అభ్యర్థి హుకుం జారీ చేశారు. పెద్ద వ్యాపారులైతే ఒక్కొక్కరూ రూ.10 లక్షలు, మధ్యస్థంగా ఉండే వారికి రూ.5 లక్షలు, చిన్న వ్యాపారులైతే రూ.3 లక్షలు వంతున ఇవ్వాలని కోరారు. ఇక దిగుమతి లైసెన్స్లు 550కు పైగానే ఉన్నాయి. ఇందులో కొంత మందికి లైసెన్స్లు ఉండవు. లైసెన్స్లు ఉండి పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే వారి నుంచి రూ.5 లక్షలు, చిన్న వ్యాపారులైతే రూ.3 లక్షలు, లైసెన్స్లు లేని వ్యాపారులకు రూ.లక్ష వరకు ఇండెంట్ పెట్టారు. ఎంపీగా గెలిస్తే పొరుగు రాష్ట్రాల్లో వ్యాపార పరంగా ఆగిపోయిన సొమ్ము కూడా వసూలు చేసి పెడతానని, గతంలో ఐపీ పెట్టిన వారి నుంచి కూడా కొంత మేరకు సొమ్ము వసూలు చేసిన విషయాన్ని గుర్తు చేసి వసూళ్లకు దిగుతున్నారు. ఈ విధంగా కోట్లాది రూపాయలకు టెండర్ పెట్టారు. సాధ్యమైనంత వరకు సొంత సొమ్ము ఖర్చు పెట్టకుండా చందాలపై ఎన్నికలు ముగించాలనే ఉద్దేశంతో సదరు అభ్యర్థి ఉన్నారని వ్యాపారులు వాపోతున్నారు.
సెలవలివ్వకముందే చక్కబెట్టాలని: త్వరలో మిర్చియార్డుకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. ఈలోగా చందాల వసూళ్ల పర్వం తంతు ముగించేలా చూడాలని ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులను పురమాయించారు. సంఘాల నాయకుల నుంచి ఫోన్లు వస్తే ఎత్తి మాట్లాడాలంటే వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన సదరు పార్టీకి, అభ్యర్థికి అంత పెద్ద మొత్తంలో సొమ్ములు ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇవ్వాలని, ఇప్పుడు ఈయనకు ఇచ్చిన విషయం తెలిసి...మరో పార్టీ అభ్యర్థులు అడిగితే అప్పుడు ఏమి చేయాలని ట్రేడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
[ 04-05-2024]
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రలోభాలు
[ 04-05-2024]
జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ బాధ్యతల నిర్వహణతోపాటు వివిధ అంశాల్లో ఐదేళ్లు రాచిరంపాన పెట్టడంతో వైకాపా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల్ని ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
‘పేదకు నరకం’.. లేదే కనికరం..
[ 04-05-2024]
రాజేష్, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం. -
‘సంక్షేమం పేరుతో జగన్ నమ్మక ద్రోహం’
[ 04-05-2024]
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమం పేరుతో ముస్లిం, మైనార్టీలకు నమ్మక ద్రోహం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ పేర్కొన్నారు. -
రాజధాని వద్దంటూ.. లోకల్ ఎలా అవుతారు?
[ 04-05-2024]
‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. -
372 సమస్యాత్మక కేంద్రాలు
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 1,309 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
జగన్ కుతంత్రం.. ఓడిన మానవత్వం
[ 04-05-2024]
నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి. ఇవీ సీఎం జగన్ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు. -
తొలి రోజు 1,011 మంది గృహ ఓటింగ్
[ 04-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు రెండు రోజుల పాటు ఓటింగ్ చేసుకునే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. -
జగన్.. మాపై ఎందుకీ కక్ష?
[ 04-05-2024]
భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం. -
జగన్ను గద్దె దించడానికి నిరుద్యోగులు సిద్ధం
[ 04-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను మోసగించిన సీఎం జగన్ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్లు మేర చేపట్టిన నిరుద్యోగ చైనత్యయాత్ర శుక్రవారం మంగళగిరి చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..