logo

లోకేశ్‌తో చిరువ్యాపారులకు మంచి రోజులు

నారా లోకేశ్‌ ఎమ్మెల్యే అయితే మంగళగిరిలో చిరు వ్యాపారులకు మంచి రోజులొస్తాయని, సైకిల్‌ గుర్తుపై ఓటేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు.

Published : 30 Apr 2024 06:15 IST

ఆకుకూరలు విక్రయిస్తున్న మహిళతో మాట్లాడుతున్న బ్రాహ్మణి

మంగళగిరి, న్యూస్‌టుడే: నారా లోకేశ్‌ ఎమ్మెల్యే అయితే మంగళగిరిలో చిరు వ్యాపారులకు మంచి రోజులొస్తాయని, సైకిల్‌ గుర్తుపై ఓటేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆమె కాళీ మాత ఆలయం వద్ద ఉన్న కూరగాయ వ్యాపారులతో మాట్లాడారు. ప్రతి దుకాణం వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్టాలను తెలుసుకున్నారు. తొలుత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరైన మార్కెట్‌ లేక రోడ్లపై బండ్లు ఏర్పాటు చేసుకుని కూరగాయలు విక్రయిస్తున్నామని పలువురు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అందరికీ ఆమోద యోగ్యంగా పట్టణంలో కూరగాయల మార్కెట్‌ అందుబాటులోకి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.  ఎండనక, వాననక కష్టపడుతున్న అందరికీ కూటమి ప్రభుత్వంతో భరోసా వస్తుందని చెప్పారు. ఆమె వెంట తెలుగు మహిళా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని