ఓట్ల వేటలో జగన్నాటకమే
పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది.
తీవ్ర ఎండలను పట్టించుకోకుండా పింఛనుదారులపై కక్షసాధింపు
తెదేపాపై నెపం నెట్టి లబ్ధి పొందాలనే దురాలోచన
ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్టుడే, నరసరావుపేట అర్బన్
- బెల్లంకొండ మండల కేంద్రానికి వెంకటాయపాలెం 22 కిలోమీటర్లు, ఎమ్మాజీ గూడెం 17 కిలోమీటర్లు దూరం. మండల కేంద్రానికి రావడానికి బస్సులుండవు. ఆటోలు కూడా రావు. ఈ గ్రామాల్లో ఉండే వృద్ధులు పింఛను తీసుకోవాలంటే బెల్లంకొండలోని బ్యాంకుకు రావాల్సిందే. ఒకవేళ అంతదూరం నుంచి వచ్చినా ఖాతాలో నగదు పడకపోతే? వారి పరిస్థితి ఏంటీ.?
- మాచర్ల మండల కేంద్రానికి అచ్చమ్మకుంట తండా 15 కిలోమీటర్ల దూరం. దుర్గి మండల కేంద్రానికి మించాలపాడు 7 కి.మీ ఉంటుంది. ఈ రెండు గ్రామాల వారు మండల కేంద్రాలకు రావడానికి ఆటోలు కూడా ఉండవు. పింఛను తీసుకునే వృద్ధులు బ్యాంకులకు రావాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి.
‘‘ఏప్రిల్లో పింఛను పంపిణీకి ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా మరోసారి అలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇంటివద్దకే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మరోసారి ఈసీ స్పష్టం చేసింది’’
- పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ వైకాపా ప్రభుత్వం ఎలాగైనా లబ్ధిపొందాలని తమ స్వార్థానికి పండుటాకులను తిప్పలు పెడుతోంది. పింఛనును అందుకోవడంలో ఎదురయ్యే కష్టాలు ప్రతిపక్షంపై నెట్టడానికి బ్యాంకు ఖాతాలో పింఛను నగదు జమ అంటూ కొత్త నాటకానికి తెర లేపింది.
‘‘వాలంటీర్ల ద్వారా పింఛను పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. అంతేకానీ ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయొద్దని చెప్పలేదు. సచివాలయ ఉద్యోగులను వినియోగించుకుని వృద్ధులకు ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే వెళ్లి అందించాలని కోరింది’’
- దీన్ని అవకాశంగా తీసుకుని వైకాపా ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఏప్రిల్ పింఛన్ల పంపిణీలో దుష్ప్రచారం చేసింది. సచివాలయాల వద్ద బారులు తీరిన పింఛనుదారుల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడుతూ రాక్షసానందం పొందింది.
పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది. గత నెల కంటే ఈసారి వారి కష్టాలు రెట్టింపు కానున్నాయి. ఈనెల 30న సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను నగదు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని కొందరికి, ఇంటికే తెచ్చి ఇస్తామని కదల్లేని వృద్ధులకు చెప్పనున్నారు.
ఎండలు మండుతున్న నేపథ్యంలో..: వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జనం అల్లాడిపోతున్నారు. యువత సైతం ఇంటి నుంచి బయటికి రావడానికి జంకుతోంది. అత్యవసరమై బయటికి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం పండుటాకులకు ఇంటి వద్దే పింఛను ఇవ్వాలని సామాజికవేత్తలు, మానవతావాదులు, పింఛనుదారులు కోరుతున్నారు.
బ్యాంకుల వద్దకు వెళ్లాలంటే..
చాలామంది వృద్ధుల బ్యాంకు ఖాతాలు క్రియాశీలకంగా లేవు. కొందరికి బ్యాంకు ఖాతాలే లేవు. అయిదేళ్లుగా పింఛన్లను చేతికే అందిస్తుండడంతో బ్యాంకు ఖాతాతో వారికి పనిలేకుండా పోయింది. అంతేకాకుండా చాలామంది తమ ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ కూడా ఉంచడం లేదు. దీంతో ఒకవేళ పింఛను నగదు జమ చేస్తే అందులో బ్యాంకు సిబ్బంది కోత విధిస్తారు. మరోవైపు గ్రామాల్లో ఉండే పండుటాకులు పట్టణాలు, మండల కేంద్రాల్లోని బ్యాంకుల వద్ద గంటలకొద్దీ బారులు తీరాల్సి వసుతంది. చాలామంది నిరక్షరాస్యులే. నగదు తీసుకోవడం వారికో పెద్ద సమస్య. మండే ఎండకు ఖర్చుపెట్టుకుని ఆటోనో, బస్సులోనో వెళ్లి తిరిగి ఇంటికి చేరడం అనేది సాధారణ విషయం కాదు. దీనికంటే సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవడమే ఉత్తమం. మాచర్ల, బెల్లంకొండ, వెల్దుర్తి, బొల్లాపల్లి, దుర్గి మండలాల్లో గ్రామాలు చాలా దూరంలో ఉన్నాయి. వీరంతా మండల కేంద్రాలకు రావడం శ్రమతో కూడుకున్న వ్యవహారం. పైగా మే నెల మండుటెండలో బయటకు రావడం అంటే ప్రాణాలతో చెలగాటమే.
ఇంటింటికి వెళ్లి ఇచ్చే వెసులుబాటు ఉన్నా....
జిల్లాలో ఒక్కొక్క సచివాలయం పరిధిలో సగటున 394 పింఛన్లు ఉన్నాయి. సచివాలయాల్లో సిబ్బంది ఒక్కొక్కరు 62 చొప్పున పంపిణీ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. సచివాలయ సిబ్బంది చరవాణిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని డివైజ్ ద్వారా పింఛను పంపిణీ చేయవచ్చు. ఇందుకు సంబంధించిన డివైజ్లు అందుబాటులో ఉన్నాయి. వార్డు, గ్రామ సచివాలయం సిబ్బంది ప్రతివిభాగానికి ఒక్కొక్కరు చొప్పున అందుబాటులో ఉన్నారు. పింఛను లబ్ధిదారులు ఆయా వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలోనే నివాసం ఉంటారు. వీరందరికీ ఇక్కడి సిబ్బందితో పింఛను సొమ్ము ఒకటి, రెండు రోజుల్లోనే లబ్ధిదారులకు ఇంటివద్దే వంద శాతం పంపిణీ చేసే అవకాశం ఉంది. పింఛన్ల పంపిణీపై సచివాలయ సిబ్బంది అవగాహన ఉన్నందున ఎక్కడా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం లేదు.
అప్పుడేమో అలా..: సచివాలయాల ఉద్యోగుల ద్వారా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛను ఇచ్చే వెసులుబాటు ఉన్నా ఏప్రిల్లో ప్రభుత్వం లబ్ధిదారులను కష్టపెట్టింది. సకాలంలో నగదు ఇవ్వకపోవడంతో పింఛనుదారులు ఇబ్బందులుపడ్డారు. ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందడానికి పన్నాగాలు పన్నింది.
ఎండలో బ్యాంకు వద్దకు వెళ్లాలా..
- పోపూరి చారుమతి, యడ్లపాడు
బ్యాంకు ఖాతా ఉందో లేదో తెలియదు. ఇంతవరకూ ఇంటికే తెచ్చిచ్చారు. ఇప్పుడు బ్యాంకులో వేస్తాం తెచ్చుకోండి అంటే ఎలా? ఎండలో చాలాదూరం వెళ్లి రావాలంటే కష్టం. బ్యాంకుల్లో నగదు వేసేవాళ్లు ఇంటికే తెచ్చి ఇవ్వొచ్చు కదా. వృద్ధులకు ఇంటికే తెచ్చివ్వాలి.
మమ్మల్ని ఇబ్బందిపెట్టొదు
- ముండ్రు పేరమ్మ, మాచవరం
అయిదేళ్లుగా చేతికే పింఛన్ ఇస్తున్నారని, బ్యాంకు ఖాతాలు మరిచిపోయాం. ఇప్పుడేమో బ్యాంకుకెళ్లి తెచ్చుకోవాలంటే ఎట్టా? మమ్మల్ని కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం పింఛన్లు: 2,81,235
వార్డు, గ్రామ సచివాలయాలు: 538 (పింఛను పంపిణీకి అదనంగా 175 కేంద్రాలు)
సచివాలయ ఉద్యోగులు : 4503
ఒక్కొక్క సచివాలయానికి సగటు వచ్చే పింఛన్లు : 524
ఒక్కొక్క ఉద్యోగి పంపిణీ చేయాల్సిన పింఛన్లు : 62
బ్యాంకుల్లో పింఛను జమ చేసేది 2,10,007 మందికి
ఇంటికి అందజేసేది: 71,228
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
[ 17-05-2024]
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
[ 17-05-2024]
ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. -
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
[ 17-05-2024]
వైకాపాకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. -
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
[ 17-05-2024]
గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. -
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
[ 17-05-2024]
తెనాలి వైకాపా ఎమ్మెల్యే శివకుమార్ బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. -
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
[ 17-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం సిట్ వేయనుంది. -
పంచాయతీలో పండ్ల వ్యాపారం
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కోరినపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం మామిడి పండ్లు అమ్మకానికి పెట్టారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. -
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
[ 17-05-2024]
పల్నాడులో ఘర్షణలకు కారణమైన పిన్నెల్లి సోదరుల్ని జైలుకు పంపి శాంతి, భద్రతలు కాపాడాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. -
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
అత్తెసరు బోధన.. అరణ్య రోదన..
[ 17-05-2024]
జిల్లాలో 17 చోట్ల హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. -
తలొగ్గారని తప్పించారు
[ 17-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలుంటే అందులో నాలుగు పల్నాడు జిల్లాలో ఉన్నాయంటేనే ఆలోచించాలి. -
ఎన్నికల రుసుముల్లో కోత!
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీఓ, ఏపీఓ), అదర్ పోలింగ్ ఆఫీసర్ల(ఓపీఓ)కు చెల్లించే రెమ్యునరేషన్లోనూ కొందరు రిటర్నింగ్ అధికారులు కోత విధించారు. -
మిగ్జాంతోనైనా కళ్లు తెరవరా?
[ 17-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. -
టిప్పర్ డీజిల్ ట్యాంకు పగలడం వల్లే బస్సు దహనం
[ 17-05-2024]
చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారులు పరిశీలన చేశారు. -
మార్కెట్ల తరలింపు ఎప్పుడో..?
[ 17-05-2024]
నగరాభివృద్ధి, సదుపాయాల కల్పన విషయంలో గత అయిదేళ్లుగా వైకాపా పాలకులు పట్టించుకున్నది లేదు. -
సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసిన ప్రభుత్వం
[ 17-05-2024]
కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆర్వోలకు సూచించారు. -
సర్పంచి ఇంటిపై వైకాపా రౌడీమూక దాడి
[ 17-05-2024]
బెల్లంకొండ మండలంలో వైకాపా రౌడీ మూక ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. -
అద్దంకి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలి
[ 17-05-2024]
అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం దక్కలేదని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
18 మందిపై కేసుల నమోదు
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కారంపూడిపాడులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై 15న గ్రామంలోని 18 మందిపై డిప్యూటీ తహసీల్దారు డి.వెంకటరావు కేసులు నమోదు చేశారు. -
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
[ 17-05-2024]
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వాళ్లను భారత్ గౌరవిస్తే.. మనం ‘దొంగలు’ అంటున్నాం- పాకిస్థాన్ మంత్రి
-
చార్ ధామ్లో ఇకపై రీల్స్ చిత్రీకరణ నిషిద్ధం
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
-
శిఖర్ పహారియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
-
వీసా లేకుండా పర్యటనల కోసం.. భారత్, రష్యా త్వరలో చర్చలు!