logo

చంద్రబాబును గెలిపించండి

రాజధానిని నిర్మించే నాయకుడు చంద్రబాబును గెలిపించాలని అమరావతి రాజధాని రైతులు మంగళగిరి కొత్తపేటలో బుధవారం సాయంత్రం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

Published : 02 May 2024 06:36 IST

మంగళగిరి: కొత్తపేటలో రాజధాని రైతుల ప్రచారం

మంగళగిరి, న్యూస్‌టుడే: రాజధానిని నిర్మించే నాయకుడు చంద్రబాబును గెలిపించాలని అమరావతి రాజధాని రైతులు మంగళగిరి కొత్తపేటలో బుధవారం సాయంత్రం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పారువేట మండపం నుంచి రాజధాని రైతులు, రైతు కూలీలు, మహిళలు బృందాలుగా ఏర్పడి సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని కోరారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్‌కు సంబంధించిన నమూనా బ్యాలట్‌ పత్రాలు పంపిణీ చేసి ఓటేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరాన్ని వివరించారు. జై అమరావతి, జై జై అమరావతి నినాదాలతో వీధులన్నీ హోరెత్తాయి. మహిళలకు సూపర్‌-6 పథకాలను వివరించారు. లోకేశ్‌ గెలిస్తే పేదలకు 20 వేల ఇళ్లు కట్టిస్తారని, ఉన్న చోటే పట్టాలు ఇప్పిస్తారని భరసా ఇచ్చారు. తెదేపా నాయకులు దామర్ల రాజు, ఎండీ ఇబ్రహీం, సంకా బాలాజీగుప్తా, రంగిశెట్టి నరేంద్ర, విన్నకోట శ్రీనివాసరావు, కళ్లం రాజశేఖర్‌రెడ్డి, పాతర్ల రమేష్‌, ఆకుల జయసత్య, తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని