గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, కార్యకర్తలపై వైకాపా దాడి
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్వలి కార్యకర్తలతో కలిసి 50వ డివిజన్లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.
పట్నంబజారు: గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్వలి కార్యకర్తలతో కలిసి 50వ డివిజన్లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలో 20వ లైనులోని ఒక ఇంటి వద్ద వైకాపాకు చెందిన నగర డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు అనుచరులు, వైకాపా కార్యకర్తలు కాలనీ వాసుల పేర్లు, ఫోన్ నంబర్లు రాసుకుంటున్నారు. వారి వద్ద చీటీలతోపాటు డబ్బులు కూడా ఉన్నాయి. దీనిని గమనించిన ్జమస్తానువలి వారి వద్దకు వెళ్లి పేర్లు, ఫోన్ నంబర్లు ఎందుకు రాస్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో ఇవన్నీ అడగడానికి మీరెవరంటూ ఆయనతో వైకాపా కార్యకర్తలు వాదనకు దిగారు. నిబంధనల ప్రకారం ఓటర్ల డేటా రాయకూడదంటూ మస్తాన్వలి పేర్కొనగా..ఇది మా రాజ్యం..మేం చెప్పిందే వేదం..అంటూ మస్తాన్వలిపైకి వైకాపా కార్యకర్తలు దురుసుగా దూసుకొచ్చారు. దీనిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ 50వ డివిజన్ అధ్యక్షుడు భాగ్యరాజుపై దాడి చేసి కొట్టారు. భాగ్యరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మస్తాన్వలిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వైకాపా తరఫున తాను ప్రచారం చేస్తుండగా మస్తాన్వలి, అతని అనుచరులు నా వద్దకు వచ్చి ఇక్కడ ఏమి చేస్తున్నారురా..అంటూ తనను కులం పేరుతో దూషించారని శారదా కాలనీకి చెందిన రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్