‘మీ పిల్లలను కిడ్నాప్ చేశాం.. అడిగినంత ఇవ్వండి’
విదేశాల్లో ఉన్న మీ పిల్లలను కిడ్నాప్ చేశాం.. అడిగినంత ముట్టచెప్పండి.. లేకుంటే వారు మీకు మిగలరు.. అని బెదిరిస్తూ సైబర్ మోసగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు.
విదేశాల్లో ఉంటున్న వారి తల్లిదండ్రులకు ఫోన్కాల్స్
సైబర్ నేరగాళ్ల కొత్త పంథా
అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
విదేశాల్లో ఉన్న మీ పిల్లలను కిడ్నాప్ చేశాం.. అడిగినంత ముట్టచెప్పండి.. లేకుంటే వారు మీకు మిగలరు.. అని బెదిరిస్తూ సైబర్ మోసగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఫోన్కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తమ పిల్లలకు నేరుగా ఫోన్ చేయడం, వారు చదువుతున్న విద్యా సంస్థల ద్వారా వారి సమాచారాన్ని తెలుసుకుని వంచకుల మోసాలను తిప్పికొట్టాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
- న్యూస్టుడే, రాయదుర్గం
ఇటీవలి ఘటనలే ఆధారం..
అమెరికాలోని క్లీవ్ల్యాండ్లో మహ్మద్ అబ్దుల్ అర్భాత్ అనే భారతీయ విద్యార్థి మార్చి 7న కిడ్నాప్నకు గురయ్యాడు. పది రోజుల తర్వాత ఆయన్ను విడుదల చేయడానికి 1200 అమెరికన్ డాలర్లు డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులకు ఫోన్కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆ యువకుడు వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో విదేశాల్లో ఇద్దరు భారతీయ విద్యార్థుల విషయంలోనూ ఈ తరహా రెండు ఘటనలు నమోదయ్యాయి. సైబర్ మోసగాళ్లు తల్లిదండ్రులకు వీఓఐపీ కాల్స్ చేసి భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు లాగుతున్నారు.
మోసం చేస్తారిలా..
తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న, విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే పిల్లలు, వారి తల్లిదండ్రుల వివరాలను మోసగాళ్లు సేకరిస్తున్నారు. అంతర్జాతీయ నంబర్ (వీఓఐపీ)తో తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారు. మీ పిల్లలను కిడ్నాప్ చేశామని, తమ చెర నుంచి సురక్షితంగా బయటపడాలంటే అడిగినంత డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తుంటారు. అలా డబ్బులు ఇవ్వని పక్షంలో పిల్లలు దక్కరని బెదిరిస్తారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై వారు చెప్పినట్లే చేస్తున్నారు.
ఇలా చేయండి..
- ఆ తరహా కాల్స్ వస్తే వెంటనే డయల్ 100, 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.
- తల్లిదండ్రులు తమ పిల్లలను, విద్యా సంస్థల అధికారులను సంప్రదించాలి.
- విచారణ ప్రక్రియలో సహాయం అందించేందుకు కేటుగాళ్ల కాల్ను రికార్డ్ చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు
[ 16-06-2024]
సైబర్ నేరాల్లో బాధితుల నుంచి నేరగాళ్లు కాజేసిన సొమ్మును తిరిగి తీసుకొచ్చేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. -
హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టివేత
[ 16-06-2024]
శంషాబాద్లో ఎక్సైజ్ పోలీసులుకు గంజాయి చాకెట్ల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. -
గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం.. బాండ్లపై సంతకాలు పెట్టించుకొని వదిలేశారు
[ 16-06-2024]
నగరంలోని గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. ఎస్వోటీ పోలీసులమంటూ ఓ కంపెనీ ఎండీతోపాటు సేల్స్ కోఆర్డినేటర్ను దుండగులు కిడ్నాప్ చేశారు. -
విచారణ పూర్తికాకముందే తీర్పు ఎలా ఇస్తారు?: జగదీశ్ రెడ్డి
[ 16-06-2024]
అసంబద్ధమైన విచారణ కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి వైదొలుగుతారని తాము భావిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. -
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
[ 16-06-2024]
ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం పరిధిలో 5 సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్పోర్టు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. రోజూ 4,000 పాస్పోర్టులు మంజూరు చేస్తున్నారు. -
దుర్భాషలాడాడని కుమారుడిని చంపేసిన తల్లి
[ 16-06-2024]
తల్లి ప్రవర్తన సరిగా లేదని దుర్భాషలాడుతుండడంతో ఓ బాలుడిని తల్లే గొంతు నులిమి చంపేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి చివరికి పోలీసులకు దొరికిపోయింది. -
సంపులోకి పంపించి.. నాలాలోకి తరలించి
[ 16-06-2024]
రాజధానిలో చిన్నపాటి వర్షానికే చెరువుల్లా మారుతున్న రోడ్ల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో దీనిపై అధికారులు కార్యాచరణ రూపొందించారు. -
ఒకరు దేశ సేవలో.. మరొకరు ఐటీ రంగంలో
[ 16-06-2024]
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు దేశ సేవలో.. మరొకరు ఐటీ సేవల్లో. దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం క్యాడెట్స్ వారి తల్లిదండ్రులతో మాట కలిపినప్పుడు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. -
కలుషిత జలాలు.. లీకేజీలు..
[ 16-06-2024]
సార్...మా ప్రాంతంలో మురుగు నీరు పొంగుతోంది.. మా బస్లీలో నల్లాల్లో కలుషిత నీళ్లు వస్తున్నాయి.. మా కాలనీలో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అవుతోంది.. -
నకిలీలు గుర్తించేందుకు విజిలెన్స్ బృందాలు
[ 16-06-2024]
పారిశుద్ధ్య కార్మికుల జీతాలను దోచుకునే వారిపై చర్యలుంటాయని జీహెచ్ఎంసీ ఈవీడీఎం(ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం స్పష్టం చేసింది. -
జులై 7 నుంచి 29 వరకు బోనాలు
[ 16-06-2024]
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ మరింత ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు స్పష్టం చేశారు. -
మురుగు కనుమరుగయ్యేలా
[ 16-06-2024]
ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో ఉత్పత్తయ్యే మురుగు చెరువులు, కుంటలు ఇతర జలవనరుల్లో కలిసిపోకుండా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. -
బాలికల భద్రతకు ‘భరోసా’
[ 16-06-2024]
సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష, హింస, వేధింపులను బాల్య దశ నుంచే అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో బాలికా సాధికారత క్లబ్ (కమిటీలు) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. -
జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్
[ 16-06-2024]
వికారాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్గా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ నియమితులయ్యారు. నేడు (ఆదివారం) ఉదయం 11.30 గంటలకు కలెక్టర్ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
వయోధికుల్ని వేధించడం క్షమించరాని నేరం
[ 16-06-2024]
జన్మనిచ్చి.. అల్లారుముద్దుగా పెంచి, ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులపై వేధింపులు క్షమించరాని నేరమని శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. -
రామోజీరావు స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
[ 16-06-2024]
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికి ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని నాగన్పల్లి రామోజీ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాల -
కూకట్పల్లి జోనల్ కమిషనర్ బదిలీ
[ 16-06-2024]
కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ బదిలీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జనవరి 5న ఇక్కడ పనిచేస్తున్న వి.మమతను బదిలీ చేస్తూ -
ప్రీమియం ఎక్స్ప్లోజివ్స్కు ఐఐసీటీ సాంకేతికత బదిలీ
[ 16-06-2024]
క్షిపణులు, అంతరిక్ష అనువర్తనాల్లో కీలకమైన సీఎల్-20 సింథసిస్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ), హైదరాబాద్లోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసింది. -
పాతబస్తీలో ‘ఈద్-అల్-అదా’ సందడి
[ 16-06-2024]
పాతబస్తీలో ‘ఈద్-అల్-అదా’ (బక్రీద్) సందడి ఊపందుకుంది. త్యాగానికి మారుపేరుగా నిలిచే పండగను సోమవారం జరుపుకోవడానికి ముస్లింలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
బవారియా గ్యాంగ్ పంజా
[ 16-06-2024]
నగరంపై ఉత్తరప్రదేశ్కు చెందిన భవారియా గ్యాంగ్ పంజా విసిరింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. -
పట్టుదల ఉంటే లక్ష్య సాధన సులువు: సినీనటి తాప్సీ
[ 16-06-2024]
విద్యార్థులు ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించాలంటే వారిలో పట్టుదల ముఖ్యమని సినీ నటి తాప్సీ పన్ను పేర్కొన్నారు. హైదరాబాద్ పబ్లిక్స్కూల్ స్నాతకోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. -
శాస్త్రీయ కళల్లో భారతీయత ప్రతిబింబిస్తుంది
[ 16-06-2024]
శాస్త్రీయ సంప్రదాయ కళల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శృతి లయ కేంద్ర నటరాజాలయ ఆధ్వర్యంలో... -
రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర అమోఘం
[ 16-06-2024]
భారత రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బికాస్ రాజన్ భట్టాచార్య అన్నారు. -
న్యాయవాదుల సహకార సంఘం సేవలు అభినందనీయం
[ 16-06-2024]
ఒంటరిగా సాధించలేనిది.. జట్టు కట్టి సాధించొచ్చని, న్యాయవాదుల సహకార సంఘం అందుకు నిదర్శనమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి అన్నారు. -
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
[ 16-06-2024]
చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో డయాలసిస్ కేంద్రంలో మంటలు సంభవించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
రోజుకు 14 గంటల పని.. చేతులపై కాలిన గాయాలు.. 58 మంది బాలకార్మికులకు విముక్తి!
-
ఐర్లాండ్ను ఆదుకున్న డెలానీ, లిటిల్.. పాకిస్థాన్ లక్ష్యం 107
-
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
-
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్