logo

ఉపాధి కూలీల సంఖ్యను పెంచండి: డీఆర్‌డీవో కృష్ణన్‌

గ్రామాల్లో ఉపాధి కూలీకి వచ్చే వారి సంఖ్యను పెంచాలని డీఆర్‌డీవో కృష్ణన్‌ అన్నారు. మంగళవారం పుల్‌మద్దిలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ప్రతి రోజు కూలీలు చేస్తున్న పనులను పరిశీలించి లెక్కించాలన్నారు.

Published : 19 Jan 2022 02:43 IST


పల్‌మద్దిలో పనులను పరిశీలిస్తున్న అధికారి

వికారాబాద్‌ గ్రామీణ: గ్రామాల్లో ఉపాధి కూలీకి వచ్చే వారి సంఖ్యను పెంచాలని డీఆర్‌డీవో కృష్ణన్‌ అన్నారు. మంగళవారం పుల్‌మద్దిలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ప్రతి రోజు కూలీలు చేస్తున్న పనులను పరిశీలించి లెక్కించాలన్నారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఎల్లప్పుడు ఇలాగే ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు. పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యయ, ఎంపీఓ నాగరాజు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని