Telangana News: కళ్లున్నా కనిపించనట్లుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు: హరీశ్రావు
కాంగ్రెస్ నేతలకు కళ్లున్నా ఏమీ కనిపించనట్లుగా మాట్లాడుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సనత్నగర్లోని 50 పడకల ఆస్పత్రిని పరిశీలించి అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలకు కళ్లున్నా ఏమీ కనిపించనట్లుగా మాట్లాడుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సనత్నగర్లోని 50 పడకల ఆస్పత్రిని పరిశీలించి అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వైద్యారోగ్య వ్యవస్థపై బుధవారం కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అద్భుతంగా అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. మాజీ మంత్రి గీతా రెడ్డి ఒక వైద్యురాలు అయి ఉండి కూడా తెలంగాణ వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధిని గ్రహించకపోవడం చాలా బాధాకరమన్నారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిని అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్రావు గుర్తు చేశారు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్.. గాంధీ అస్పత్రిలో అత్యన్నత స్థాయి సౌకర్యాలు కల్పించారని పేర్కొన్నారు. ఉస్మానియా అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. 70 ఏళ్లలో మూడు కళాశాలలు మాత్రమే ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ఘనత అయితే.. 7 సంవత్సరాల్లో 33 కళాశాలలు కట్టిన ఘనత తెరాసదని హరీశ్రావు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!