మాజీ మంత్రి పుష్పలీల భర్త రాందాస్ మృతి
మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల భర్త, జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(డీసీసీబీ) సీఈవోగా పనిచేసి పదవి విరమణ చేసిన కొండ్రు రాందాస్(69) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్పల్లి సన్రైస్హోమ్స్లోని
రాజేంద్రనగర్, న్యూస్టుడే: మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల భర్త, జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(డీసీసీబీ) సీఈవోగా పనిచేసి పదవి విరమణ చేసిన కొండ్రు రాందాస్(69) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్పల్లి సన్రైస్హోమ్స్లోని తమ నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో నిమ్స్కు తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాందాస్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మరణవార్త విని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు రాజేంద్రనగర్లోని ఆయన నివాసానికి తరలివచ్చి నివాళులర్పించారు. ఆయనకు కుమారుడు సుమన్, కుమార్తె సుష్మ ఉన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణమాదిగ తదితరులు నివాళులర్పించారు. బంజారాహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!