ఆగుతూ.. సాగుతూ..
ప్రకృతి అన్నదాతలతో దోబూచులాడుతోంది. వాస్తవానికి ఈనెల 15వ తేదీలోపు వివిధ రకాల విత్తనాలు విత్తుకోవడం పూర్తి చేసుకోవాలి. ఆశించిన వర్షాలు పడక పోవడంతోపాటు వాతావరణం అనుకూలించక రైతులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
ఇప్పటివరకు విత్తింది 33 శాతమే
వరుణిడిపైనే అన్నదాతల భారం
న్యూస్టుడే, పరిగి
ప్రకృతి అన్నదాతలతో దోబూచులాడుతోంది. వాస్తవానికి ఈనెల 15వ తేదీలోపు వివిధ రకాల విత్తనాలు విత్తుకోవడం పూర్తి చేసుకోవాలి. ఆశించిన వర్షాలు పడక పోవడంతోపాటు వాతావరణం అనుకూలించక రైతులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం సాగు సమయం ముగిసేలోపు పూర్తి స్థాయిలో విత్తు సాధ్యమవుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితే ఇకముందూ కొనసాగితే ఏంచేయాలని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సాగు స్థితిగతులపై ‘న్యూస్టుడే’ కథనం.
అదను దాటితే ప్రభావం తప్పదు
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు గానీ నదీనదాలు కానీ లేకపోవడంతో వర్షాధార సేద్యమే జీవనాధారం. సమృద్ధి వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు నీటిని అందిస్తాయి. ఈ పరిస్థితి లేని కారణంగా వరుణుడిపైనే ఆశలు పెట్టుకోవాల్సి వస్తోంది. అదను దాటాక విత్తనాలు విత్తుకుంటే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాపోతున్నారు.
కేవలం రెండు రోజుల్లో 56 మి.మీ
జిల్లాలోని 19 మండలాల్లో సాధారణ వర్షపాతం జూన్ మాసంలో 107 మి.మీ ఉంది. కురిసింది మాత్రం 90మి.మీటర్లు. ఇక్కడే ప్రధాన సమస్య ఏర్పడింది.
* జులై మాసంలో 200 మి.మీ గాను ఇప్పటివరకు కేవలం 56 మి.మీ వర్షపాతం నమోదైంది. అది కూడా ఈ రెండు రోజుల్లోనే. ః వానాకాలం సాధారణ సాగు 5,31,500 ః సాగులోకి వచ్చింది 1,79,350 ఎకరాలు (అంటే కేవలం 33 శాతం). ః జూన్లో చౌడాపూర్, కుల్కచర్ల, పరిగి, తాండూరు, యాలాల్ మండలాల్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. చెరువులు, కుంటల కింద ఉన్న ఆయకట్టుదారులు అవి ఎప్పుడు నిండుతాయా అని ఎదురు చూస్తున్నారు. కొద్దోగొప్పో వాటిలోకి నీరు వస్తే వరి సాగుకు నారుమళ్లు పోసుకునేందుకు వీలవుతుందని ఆశపడుతున్నారు.
దండిగా వానలు పడితేనే..
వానలు బాగా కురిస్తేనే సాగు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.బరువు నేలలు కలిగిన చాలా మంది రైతులు సాగుకు ఇంకా ఉపక్రమించడం లేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి విత్తనాలు విత్తుకున్నాక వర్షాలు పడక పోతే నష్టపోతామని భావిస్తున్నారు. తెల్ల బంగారానికి, మొక్కజొన్న పంటలకు విపణిలో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఈసారి చాలా మంది రైతులు వీటి సాగునే ప్రధానంగా ఎంచుకున్నారు.
చెరువుల్లో చుక్కనీరు లేదు
- జి.అనంతయ్య, కౌలు రైతు
నడి వానాకాలం అయినా చెరువులు, కుంటల్లో చుక్క నీరు చేరలేదు. వరుణిడిపైనే భారం వేసి సాగుకు ఉపక్రమించాం. రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ఎకరం పొలంలో వరి సాగు చేసేందుకు నారుమడిని సిద్ధం చేస్తున్నాం. చెంతనే చెరువు ఉన్నా బీడుగా కనిపిస్తోంది. ఇది నిండితేనే బోరులో నీరు పెరిగి సాగుకు మార్గం సుగమం అవుతుంది.
ఆందోళన వద్దు
- గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
వర్షాలపై అన్నదాతల ఆందోళన అనవసరం. సమృద్ధిగానే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఒక భారీ వర్షం పడితే చాలు విత్తుకునేందుకు చక్కటి అదను వస్తుంది. అనంతరం అడపాదడపా వానలు పడినా పైరుకు సరిపోతుంది. కొన్ని పంటలను ఈనెల మూడో వారం వరకు కూడా వేసుకోవచ్చు. వాతావరణం అనుకూలకంగా లేకపోవడంతోనే సాగుపై ప్రభావం పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?