తుపాకి పేల్చితే రాజీనామా అంటున్నారు.. ఇదేం కక్కుర్తి రాజకీయం: శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్లో తుపాకి పేల్చినట్టు వచ్చిన ఆరోపణలపై రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లను తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తోసిపుచ్చారు.
హైదరాబాద్: మహబూబ్నగర్లో తుపాకి పేల్చినట్టు వచ్చిన ఆరోపణలపై రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లను తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తోసిపుచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా ఒక ఘటన జరిగితే విచారణ ఉంటుందని, తాను పేల్చింది రబ్బర్ బుల్లెట్ అని స్పష్టం చేశారు. కానీ, విపక్షాలు కక్కుర్తి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, కుమురం భీం, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మహనీయుల జయంతి వేడుకలు అన్ని వర్గాలు కలిసి చేసుకోవడం ద్వారా చక్కటి స్ఫూర్తిని చాటాలని కోరారు. అప్పుడే ఆ మహనీయుల ఆత్మ శాంతిస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న తరుణంలో ఆయా వర్గాలకు మేలు చేయాలని సూచించారు. దేశ వ్యాప్తంగా 52శాతంపైగా బీసీ జనాభా కలిగి ఉన్న దృష్ట్యా కనీసం ఇప్పటికైనా కేంద్రం బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడంతో పాటు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. లేదంటే రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక అంశాలపై శాసనసభలో తీర్మానాలు చేసి పంపినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చాలన్న ధ్యాస తప్ప కేంద్రలోని భాజపాకు మరొకటి లేదని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.