కొండెక్కిన కోటా
ఆహారభద్రత కార్డు లబ్ధిదారులకు బియ్యం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రేషన్ దుకాణానికెళ్తే స్టాకు లేదని వెనక్కు పంపుతుండడంతో ఎప్పుడొస్తుందో తెలీక రోజూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. స్టాకు పంపాలంటూ డీలర్లు అధికారులకు విన్నవిస్తున్నా స్పందన ఉండడం లేదు.
బియ్యం లేక ఖాళీగా రేషన్ దుకాణాలు
పంపిణీ గడువు ముగుస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్
ఆహారభద్రత కార్డు లబ్ధిదారులకు బియ్యం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రేషన్ దుకాణానికెళ్తే స్టాకు లేదని వెనక్కు పంపుతుండడంతో ఎప్పుడొస్తుందో తెలీక రోజూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. స్టాకు పంపాలంటూ డీలర్లు అధికారులకు విన్నవిస్తున్నా స్పందన ఉండడం లేదు. సాధారణంగా ప్రతి నెల 1 నుంచి 15 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం కోటా పంపిణీ విషయంలో తర్జనభర్జనల అనంతరం ఆగస్టు 4 నుంచి ఒక్కొక్కరికీ 15 కేజీల చొప్పున అదనంగా పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ ఆర్భాటంగా ప్రకటించింది. లోడింగ్ ఇతరత్రా సమస్యలతో స్టాకు పంపడంలో ఆలస్యం జరుగుతుండటం, పంపిణీ గడువు ముగుస్తుండటంతో లబ్ధిదారులు దుకాణాల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
70శాతం దుకాణాల్లో నో స్టాక్..
గ్రేటర్ పరిధిలో పోర్టబులిటీ, నెలవారీ కోటాతో కలిపి మూడు జిల్లాల్లో ప్రతినెలా సుమారు 50వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం పంపిణీ చేస్తుంటారు. ఆగస్టులో పెంచిన కోటాతో అది రెట్టింపు అయ్యింది. ఒక్కో దుకాణంలో సుమారు 200 క్వింటాళ్ల వరకు బియ్యం ఉండగా పంపిణీ చేశామని, అనంతరం పలుమార్లు విన్నవించగా 50 క్వింటాళ్ల చొప్పున పంపినా రెండు గంటల్లో అయిపోయే పరిస్థితి ఉందని డీలర్లు వాపోతున్నారు. వారం రోజులుగా 70శాతం రేషన్ దుకాణాల్లో స్టాకు లేదని చెబుతున్నారు.
తూకంలో తరుగు.. సాంకేతిక లోపాలు
స్టాకు లేక ఇబ్బంది పడుతున్న రేషన్ డీలర్లు తరుగు మరో సమస్యగా పరిణమించింది. ఒక్కో బస్తాలో 50 కేజీలకు బదులుగా 41 నుంచి 45 కేజీల వరకు బియ్యం వస్తోందని దీంతో వచ్చే కాస్తో కూస్తో కమిషన్ను నష్టపోవాల్సి వస్తోందని డీలర్లు వాపోతున్నారు. దీనికి తోడు రేషన్ పంపిణీలో హెచ్చుతగ్గులకు తావివ్వకుండా ప్రభుత్వం 4జీ సేవలను తీసుకొచ్చినా అవీ అప్పుడప్పుడు మొరాయిస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు.
అధికంగా ఇవ్వాల్సి రావడంతోనే..:
శ్యామారాణి, డీఎంవో, రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లాలో ఈసారి కోటా పెరగడంతోనే సమస్యలు ఉత్పన్నమయ్యాయి. షాపులు దూరంగా ఉండటం, లోడింగ్లో సమస్యలు, వర్షాలు, సెలవులతో స్టాక్ పంపడంలో ఆలస్యం అయిన మాట వాస్తవమే. మూడు రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
నాలుగు రోజుల్లో పూర్తవుతుంది: తనూజ, డీఎంవో, హైదరాబాద్
స్టాకును ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నాం. మరో నాలుగు రోజుల్లో పంపిణీ పూర్తవుతుంది. అవసరమైతే మరో నాలుగు రోజులు గడువు పొడిగించి లబ్ధిదారులకు అందరికీ కోటా అందేలా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?