logo

నేటి నుంచి సీతాఫల్‌మండి రోడ్డులో ట్రాఫిక్‌ మళ్లింపు

గోపాలపురం ట్రాఫిక్‌ ఠాణా పరిధిలోని సీతాఫల్‌మండిలో మెట్రో వాటర్‌ వర్క్స్‌ పనులు చేపడుతున్న దృష్ట్యా బుధవారం నుంచి డిసెంబర్‌ 11 వరకు వాహనాలను మళ్లిస్తున్నట్లు నగర సంయుక్త కమిషనర్‌(ట్రాఫిక్‌) రంగనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 30 Nov 2022 01:31 IST

రెజిమెంటల్‌బజార్‌: గోపాలపురం ట్రాఫిక్‌ ఠాణా పరిధిలోని సీతాఫల్‌మండిలో మెట్రో వాటర్‌ వర్క్స్‌ పనులు చేపడుతున్న దృష్ట్యా బుధవారం నుంచి డిసెంబర్‌ 11 వరకు వాహనాలను మళ్లిస్తున్నట్లు నగర సంయుక్త కమిషనర్‌(ట్రాఫిక్‌) రంగనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చిలకలగూడ చౌరస్తా నుంచి సీతాఫల్‌మండి వెళ్లే వాహనదారులు ఆలుగడ్డబావి మీదుగా వెళ్లి మెట్రో పిల్లర్‌ నంబర్‌ సీ-1139 వద్ద యూ టర్న్‌ తీసుకోవాలని సూచించారు. అక్కడి నుంచి రైల్వే క్వార్టర్స్‌ మీదుగా సీతాఫల్‌మండి చేరుకోవాలని తెలిపారు. వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని