కారు కంటే ఆటోనే ఖరీదు
గ్రేటర్లో కొత్త ఆటో కొనడంకంటే అదే ధరకు కొత్త కారు లేదా మంచి కండిషన్లో ఉన్న సెకండ్హ్యాండ్ కారు కొనవచ్చు.
పర్మిట్ల పేరుతో దళారుల దోపిడీ
వ్యవస్థీకృత దందాగా సాగుతున్న వైనం
గ్రేటర్లో కొత్త ఆటో కొనడంకంటే అదే ధరకు కొత్త కారు లేదా మంచి కండిషన్లో ఉన్న సెకండ్హ్యాండ్ కారు కొనవచ్చు. ఇది నిజం. ఇదంతా ఆటో పర్మిట్లలో జరుగుతున్న దందా. బహిరంగ మార్కెట్లో కొత్త ఆటో రూ.2-2.25 లక్షలుంటే గ్రేటర్లో కొనాలంటే రూ.4.5-5 లక్షల వరకు చెల్లించాల్సిందే. ఇందులో కేవలం పర్మిట్ కోసమే రూ.2.5 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. కొందరు దళారులు పర్మిట్లను తమ గుప్పిట్లో పెట్టుకొని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
హక్కులు మార్చుకున్నాకే..
కేవలం ఆటోలతోనే కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులున్నాయంటూ గతంలో ప్రభుత్వం పర్మిట్లను నిలుపుదల చేసింది. 2014కు ముందు కొత్తగా 20 వేల కొత్త పర్మిట్లు విడుదల చేసి ఆపేసింది. ప్రస్తుతం ఆటో కొనుక్కొని తిప్పాలంటే పాత పర్మిట్తోనే కొత్తది కొనుక్కోవాల్సి వస్తోంది. ఉదాహరణకు.. ఇప్పటికే ఆటో ఉన్న డ్రైవర్ తన ఆటో పాతబడిందని ఆర్టీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దాన్ని తుక్కుగా మార్చాలి. అప్పుడే రవాణాశాఖ కొత్త పర్మిట్ జారీ చేస్తుంది. లేదంటే పాతది కొని యాజమాన్య హక్కులు మార్చుకుని, తుక్కుగా చేసి, అదే పర్మిట్తో కొత్తది తీసుకోవాలి.
గ్రేటర్లో కొత్త ఆటో కొనడంకంటే అదే ధరకు కొత్త కారు లేదా మంచి కండిషన్లో ఉన్న సెకండ్హ్యాండ్ కారు కొనవచ్చు. ఇది నిజం. ఇదంతా ఆటో పర్మిట్లలో జరుగుతున్న దందా. బహిరంగ మార్కెట్లో కొత్త ఆటో రూ.2-2.25 లక్షలుంటే గ్రేటర్లో కొనాలంటే రూ.4.5-5 లక్షల వరకు చెల్లించాల్సిందే. ఇందులో కేవలం పర్మిట్ కోసమే రూ.2.5 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. కొందరు దళారులు పర్మిట్లను తమ గుప్పిట్లో పెట్టుకొని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
హక్కులు మార్చుకున్నాకే..
కేవలం ఆటోలతోనే కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులున్నాయంటూ గతంలో ప్రభుత్వం పర్మిట్లను నిలుపుదల చేసింది. 2014కు ముందు కొత్తగా 20 వేల కొత్త పర్మిట్లు విడుదల చేసి ఆపేసింది. ప్రస్తుతం ఆటో కొనుక్కొని తిప్పాలంటే పాత పర్మిట్తోనే కొత్తది కొనుక్కోవాల్సి వస్తోంది. ఉదాహరణకు.. ఇప్పటికే ఆటో ఉన్న డ్రైవర్ తన ఆటో పాతబడిందని ఆర్టీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దాన్ని తుక్కుగా మార్చాలి. అప్పుడే రవాణాశాఖ కొత్త పర్మిట్ జారీ చేస్తుంది. లేదంటే పాతది కొని యాజమాన్య హక్కులు మార్చుకుని, తుక్కుగా చేసి, అదే పర్మిట్తో కొత్తది తీసుకోవాలి.
అంతా వారి కనుసన్నల్లోనే..
ఎక్కువ శాతం డ్రైవర్లు ప్రైవేటు ఫైనాన్షియర్ల వద్ద రుణాలు తీసుకొని ఆటోలు కొంటుంటారు. కిస్తీలు కట్టలేని సమయంలో తిరిగి ఫైనాన్షియర్లు ఆ ఆటోలను లాక్కుంటారు. వాటిని తిరిగి ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. యాజమాన్య పేరు మాత్రం పాత డ్రైవర్తోనే ఉంటుంది. ఇలా నగరంలో 50 వేలపైనే ఆటోలున్నాయి. కొన్నింటిపై గతంలో ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పేద ఆటో డ్రైవర్ల నుంచి దళారులు, ఫైనాన్షియర్లు ఎంతోకొంతకు పర్మిట్లు తీసుకొని వాటిని రెండింతల ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరైతే జిల్లాల్లో ఆటోలను కొని అక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకొని వాటిని నగరంలో తిప్పుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల కంట పడితే చలానా కడుతున్నారు. పర్మిట్ల విధానం వ్యవస్థీకృత దందాగా మారింది. రూ.కోట్ల వర్షం కురిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?