మండుటెండల్లో.. ఠండా పానీ
చలివేంద్రం అంటే.. రెండు మట్టి కుండలు.. వాటిపైన ప్లాస్టిక్ గ్లాసు గుర్తుకొస్తుంది. తొలిసారి జలమండలి వినూత్న పద్ధతిలో చలివేంద్రాలను తీసుకొచ్చింది.
పలు ప్రాంతాల్లో జలమండలి ఉచిత తాగునీటి కేంద్రాలు
నాచారంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం
ఈనాడు, హైదరాబాద్: చలివేంద్రం అంటే.. రెండు మట్టి కుండలు.. వాటిపైన ప్లాస్టిక్ గ్లాసు గుర్తుకొస్తుంది. తొలిసారి జలమండలి వినూత్న పద్ధతిలో చలివేంద్రాలను తీసుకొచ్చింది. మట్టికుండల స్థానంలో పెద్ద సైజు కూలింగ్ ఫిల్టర్లను పలు ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చింది. కొన్ని చోట్ల క్యాన్లతో చల్లని నీటిని సరఫరా చేస్తోంది. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోంది. గతంలో మట్టికుండలు లేదా ప్లాస్టిక్ డ్రమ్ములు పెట్టి నీళ్లు పోసేవారు. ప్లాస్టిక్ గ్లాసుతో అడిగిన వారికి నీటిని అందించేవారు. పరిసరాల శుభ్రత పాటించకపోవడం, డ్రమ్ములను సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో ఈ నీటిని తాగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు కాదు. ఈ వేసవిలో జలమండలి అధికారులు రెస్టారెంట్లు, హోటళ్లలో వాడే పెద్దపెద్ద కూలింగ్ ఫిల్టర్లను అందుబాటులో ఉంచారు. వీటిలో నీళ్లు పోస్తే....ఫిల్టర్తో కూల్ అయి బయటకు సరఫరా అవుతాయి. అక్కడే డిస్పోజబుల్ గ్లాసులు ఉంచారు. కొన్ని చోట్ల చిన్న చిన్న క్యాన్లలో శుభ్రమైన చల్లటి నీటిని పోసి ప్రజలకు అందిస్తున్నారు. మండుటెండల్లో దాహం వేసి నీళ్ల కోసం చూసే వారికి ఈ కేంద్రాలు ఊరటనిస్తున్నాయి. రూ.20 పెట్టి చల్లని వాటర్ బాటిల్ కొనే కంటే ఈ నీటినే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు బల్డియా పరిధిలో 55, అవుటర్ రింగ్ పరిధిలో మరో 70 ఈ వినూత్న చలివేంద్రాలను జలమండలి ఏర్పాటు చేసింది. బస్టాప్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో నెలకొల్పుతున్నారు. కూలీ పనులు చేసుకునే వారు, ఆటో డ్రైవర్లు, రోడ్లపై తోపుడు బళ్లపై వ్యాపారం చేసేవారు ఎండాకాలంలో చల్లటి తాగునీరు లేక విలవిలలాడుతుంటారు. ఇలాంటి వారు ఈ కేంద్రాల ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు.
ఇక అక్కడ అన్ని రోజుల్లో కొనసాగింపు
సూటేసుకుని టిప్టాప్గా రెడీ అయి తాగునీరు అందిస్తున్న ఇతడు బంజారాహిల్స్లోని ‘తాజ్కృష్ణ’ ఉద్యోగి. హోటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఇలా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే జలమండలి ప్రత్యేకంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. మిగతా రోజుల్లో ప్రజల నుంచి పెద్దగా డిమాండ్ ఉండకపోవడంతో మూసేస్తుంది. ఇక నుంచి కీలక ప్రాంతాల్లో ఈ కియోస్కోలను కొనసాగించనుంది. రద్దీగా ఉండే కొన్ని ప్రభుత్వ, ట్రస్టు ఆసుపత్రులు, బస్టాండ్ల వద్ద నిరంతరం ఈ కేంద్రాలను కొనసాగించాలని నిర్ణయించింది. బస్టాప్ల వద్ద ప్రయాణికులకు, ఆసుపత్రుల వద్ద రోగులు, సహాయకులకు మంచినీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవిలో చాలా స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇలాంటి వారికి జలమండలే ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనుంది. చలివేంద్రాలకు బల్క్గా తాగునీరు అవసరమయ్యే వారు 155313 ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
[ 18-05-2024]
భార్య వివాహేతర సంబంధం భర్తను హతమార్చింది. పథకం ప్రకారమే ప్రియుడితో కలిసి వివాహిత దారుణానికి తెగబడినట్టు నిర్ధారించారు. హత్య సమయంలో ప్రధాన నిందితుడిని వెంటాడిన బాధితుడి దీనచూపులు లొంగిపోయేందుకు కారణమయ్యాయి. -
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
[ 18-05-2024]
ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 3, 6, 8 నిమిషాలకు మెట్రో పరుగులు పెడుతోంది. కళ్ల ముందే మెట్రో వెళ్లిపోయినా మరొకటి వస్తుందని ప్రయాణికులకు ఒక నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించేందుకు కృషి చేస్తోంది. -
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
[ 18-05-2024]
క్రికెట్ అభిమానులకు పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ ఊరట కల్పించింది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం రాత్రి హైదరాబాద్- గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ రద్దయింది. -
కాపాడకపోతే కష్టమే
[ 18-05-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని రూ.వేల కోట్ల విలువైన భూముల పరిరక్షణ సవాలుగా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్ల కింద మార్చి ఆదాయాన్ని సమకూర్చుకుంది. -
జీహెచ్ఎంసీని ఎలా గట్టెక్కిస్తారు?
[ 18-05-2024]
అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్ఎంసీని ఎలా గట్టెక్కించాలనే అంశమై పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. -
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
[ 18-05-2024]
ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వైకుంఠపాళి, ఫ్లాష్మాబ్...స్వచ్ఛంద సంస్థల, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన ‘ఓట్ ఛాలెంజ్’ ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి. -
మహానగరానికి గోదావరి భరోసా
[ 18-05-2024]
వేసవిలో నగరానికి గోదావరి జలాల భరోసా దక్కింది. వాస్తవానికి మే 1 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అత్యవసర పంపింగ్తో నగరానికి నీటిని తరలించడానికి జలమండలి ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ...ఎల్లంపల్లిలో నీటి మట్టం తగినంత ఉండటంతో ఆ పరిస్థితి రాలేదని అధికారులు చెబుతున్నారు. -
మెట్రో వేళల పొడిగింపు
[ 18-05-2024]
మెట్రోరైలు వేళల్ని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రతి సోమ, శుక్రవారాలు పొడిగించింది. ఇప్పటి వరకు రాత్రిపూట చివరి మెట్రోరైలు 11 గంటల వరకే ఉండేది. దీన్ని ప్రతి శుక్రవారం 45 నిమిషాలు పొడిగించారు. -
దేవుడా
[ 18-05-2024]
గ్రేటర్ పరిధిలోని కొందరు ఆలయ అధికారుల తీరు ఆడింది ఆట...పాడింది పాటగా మారింది. ఆలయాలకు దాతలు ఇచ్చే విరాళాలు, ఖర్చులపై నిర్ధిష్టమైన లెక్కలు చూపడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
వాహనాలు ఇచ్చారు.. మరిచారు
[ 18-05-2024]
మత్స్యకారుల సంక్షేమానికి గత ప్రభుత్వం 75శాతం రాయితీతో చేపలను రవాణా చేసేందుకు వాహనాలిస్తే.. అధికారుల పర్యవేక్షణలోపంతో కొందరు లబ్ధిదారులు వాటిని సొంత అవసరాలకు వినియో గించుకుంటున్నారు. -
నీటి సంరక్షణకు అడుగులు.. అవార్డుకు బాటలు
[ 18-05-2024]
నీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, చెక్డ్యామ్లు, సామాజిక ఇంకుడు గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణానికి మించిన మార్గం మరొకటి లేదు. కేంద్ర ప్రభుత్వం వీటి తవ్వకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. -
హార్డ్వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం
[ 18-05-2024]
వికారాబాద్ పట్టణం రామయ్యగూడ రోడ్డులోని నాగలక్ష్మి హార్డ్వేర్ దుకాణంలో షార్ట్సర్క్యూట్తో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.3 కోట్ల ఆస్తి అగ్నికి ఆహుతి కాగా, బీరువాలో దాచి ఉంచిన రూ.10 లక్షల నగదు కాలి బూడిదైందని భవన యజమాని తెలిపారు. -
ఈ‘నామ్కే’వాస్తే!
[ 18-05-2024]
జిల్లాలో ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్( ఈనామ్)ఇంకా దేశ వ్యాప్తంగా విస్తరణ జరగలేదు. ఫలితంగా విపణుల్లో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. వివిధ రాష్ట్రాల విపణులకు అనుసంధానం జరిగితే, ఉత్పత్తులను వ్యాపారులు ఒకరికి తెలియకుండా ఒకరు ఆన్లైన్లో పోటీ పడి కొనుగోలు చేస్తారు. -
కొలతలు తీసుకోక.. దుస్తులు సరిపోక!
[ 18-05-2024]
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఏటా ఉచితంగా ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నారు. అయితే వీటిని కుట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొలతలు తీసుకోకుండానే సరఫరా చేస్తున్నారు. వాటిని ధరిస్తున్న విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. -
లక్ష ప్రయాణికులు లక్ష్యం
[ 18-05-2024]
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్పై మరోసారి చర్చ మొదలైంది. ఆర్టీసీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన తర్వాత మెట్రోలో 40 వేల మంది ప్రయాణికులు తగ్గారని ఎల్అండ్టీ సంస్థ చెబుతోంది. -
ఆన్లైన్ ఆర్డర్లతో హెరాయిన్ రవాణా
[ 18-05-2024]
ఆన్లైన్ ద్వారా హెరాయిన్ సరఫరా చేస్తున్న ముఠాలోని ఓ నిందితుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుడి వద్ద రూ.4లక్షల విలువైన 33 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. -
వర్సిటీ ఫీజుల్లో రాయితీ ఇప్పిస్తానని మోసం
[ 18-05-2024]
ఫీజులో రాయితీ ఇప్పిస్తానంటూ రూ.4.39 లక్షలు దండుకున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ (సైబర్ క్రైమ్స్) డి.కవిత వివరాల ప్రకారం.. తిరుమలగిరికి చెందిన ఓ వ్యక్తి కుమారుడు యూఎస్ఏ ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్లో చదువుతున్నాడు. -
అతివేగానికి ఒకరు బలి
[ 18-05-2024]
మాదాపూర్లో ఓ కారు రెండు ఆటో ట్రాలీలను ఢీకొట్టి ఇద్దరిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మాదాపూర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. మాదాపూర్ మేఘా హిల్స్కు చెందిన మద్దూరు శ్రీనివాస్(35), మణికొండ చిత్రపురి కాలనీవాసి సంకు వీరరాఘవులు పాల వ్యాపారం చేస్తుంటారు. -
చిరునామాల్లో ఉండరు.. దేనికీ స్పందించరు
[ 18-05-2024]
సేవాలోపాలకు పాల్పడుతున్న సంస్థల చిరునామాలపై స్పష్టత కొరవడటంతో లీగల్ నోటీసులు ఎక్కడికి పంపాలన్న ప్రశ్నలు ఫిర్యాదుదారుల్లో తలెత్తుతున్నాయి. జిల్లా వినియోగదారుల కమిషన్లకు ఫిర్యాదులు చేసినా అవి విచారణ వరకు వెళ్లడం లేదు. -
యువతే దేశానికి సంపద
[ 18-05-2024]
యువతే దేశానికి సంపద అని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ అరుణ్కుమార్ మిశ్రా అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విభాగం పట్టభద్రుల దినోత్సవం నిర్వహించారు. -
కొలనుపాక జైన దేవాలయం అధ్యక్షుడిగా సురేందర్
[ 18-05-2024]
కొలనుపాకలోని జైన శ్వేతాంబర తీర్థం దేవాలయం అధ్యక్షుడిగా సురేందర్ బాటియా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 30 ఏళ్గుగా ఈ ఆలయానికి ధర్మకర్తగా, కొన్ని సంవత్సరాలు సంయుక్త కార్యదర్శిగా, కార్యదర్శిగా పనిచేశారు. -
కేఏ పాల్పై చీటింగ్ కేసు
[ 18-05-2024]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా పోటీకి పార్టీ టికెట్ ఇస్తానని పాల్ రూ.57 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడకు చెందిన ఎస్.కిరణ్కుమార్ గురువారం రాత్రి పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదు చేశారు. -
రూ.కోటి వజ్రాభరణాలు మాయం
[ 18-05-2024]
శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు క్యాబ్లో ఓ వృద్ధురాలు బయల్దేరగా ఆమెకు సంబంధించిన రూ.కోటి విలువైన వజ్రాభరణాలు మాయమయ్యాయి. వాటిని క్యాబ్ డ్రైవరే తస్కరించాడని బాధితులు ఫిర్యాదు చేశారు. గత నెల 20న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
‘ఫ్యాషన్ వీక్’ను నిలిపేసిన పోలీసులు
[ 18-05-2024]
ఈనెల 17 నుంచి 19 వరకు లులు మాల్లో కొనసాగాల్సిన ఫ్యాషన్ వీక్ కార్యక్రమాన్ని కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం నిలిపేశారు. -
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
[ 18-05-2024]
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
[ 18-05-2024]
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.